Wimbledon: వింబుల్డన్ టోర్నీ.. ఈ ప్రత్యేకతలు తెలుసా..?
క్రికెట్లో ఎన్ని టోర్నీలున్నా వన్డే ప్రపంచకప్కు ఉండే ప్రాముఖ్యత వేరు. అలాగే టెన్నిస్లోనూ నాలుగు గ్రాండ్స్లామ్లున్నా వింబుల్డన్కు ఉండే ప్రాధాన్యత వేరు...
నేటి నుంచే చారిత్రక టోర్నీ ప్రారంభం..
క్రికెట్లో ఎన్ని టోర్నీలున్నా వన్డే ప్రపంచకప్కు ఉండే ప్రాముఖ్యత వేరు. అలాగే టెన్నిస్లోనూ నాలుగు గ్రాండ్స్లామ్లున్నా వింబుల్డన్కు ఉండే ప్రాధాన్యత వేరు. ప్రతి క్రికెటర్ ప్రపంచకప్లో ఛాంపియన్గా నిలవాలని ఎలా కలగంటాడో.. టెన్నిస్లోనూ రాకెట్ పట్టిన ప్రతి ప్లేయర్ వింబుల్డన్లో గెలవాలని ఆశపడతారు. అయితే, క్రికెట్లో మెగా టోర్నీ నాలుగేళ్లకోసారి నిర్వహిస్తే.. ఈ టెన్నిస్ టోర్నీని ఏటా నిర్వహిస్తారు. అంతగొప్ప పేరున్న వింబుల్డన్ 2022 సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆ టోర్నీ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..
- వింబుల్డన్ టోర్నీని 1877లో తొలిసారి నిర్వహించారు. వింబుల్డన్లోని వార్పుల్ రోడ్లో ఆల్ ఇంగ్లాండ్ క్రొకెట్ క్లబ్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 22 మంది పాల్గొన్న ఈ టోర్నీలో స్పెన్సర్ విలియమ్ గొరే అనే క్రీడాకారుడు ఛాంపియన్గా అవతరించాడు. ఫైనల్లో జోర్జ్ మార్షల్ అనే ప్రత్యర్థిని ఓడించి తొలి విజేతగా చరిత్ర సృష్టించాడు. అయితే, స్పెన్సర్ కేవలం టెన్నిస్ మాత్రమే కాకుండా క్రికెట్, ఫుట్బాల్ గేమ్స్లోనూ రాణించాడు.
- వింబుల్డన్ టోర్నీ తొలి ఏడు సంవత్సరాలు కేవలం పురుషులకు మాత్రమే నిర్వహించగా.. తర్వాతి రోజుల్లో ఆటకు విశేషమైన ఆదరణ లభించింది. దీంతో 1884లో తొలిసారి మహిళల సింగిల్స్ను ఏర్పాటు చేయగా మొత్తం 13 మంది పాల్గొన్నారు. అందులో మౌద్ వాట్సన్ అనే క్రీడాకారిణి ఈ విభాగంలో తొలి ఛాంపియన్గా నిలిచింది. ఇక ఇంగ్లాండ్ తరఫున ఉమెన్స్ సింగిల్స్ గెలిచిన చివరి విజేత వర్జీనియా వేడ్. ఆమె 1977లో వింబుల్డన్ ట్రోఫీని ముద్దాడింది.
- ఇక ప్రస్తుతం వింబుల్డన్ టోర్నీని నిర్వహిస్తున్న ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ సెంట్రల్ కోర్టును 1922లో కింగ్ జార్జ్, క్వీన్ మేరీ ఆవిష్కరించారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఈ గేమ్కు మరింత ఆదరణ లభించడంతో వీక్షకుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ టోర్నీలోని మ్యాచ్లు చూసేందుకు జనం ఎగబడేవారు. దాంతో టికెట్ల కోసం తీవ్ర పోటీ ఉండేది. వారిని నిలువరించడానికి 1922లో తొలిసారి బ్యాలెట్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు.
- వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ను 1937లో తొలిసారి బీబీసీ బ్రాడ్కాస్ట్ యూనిట్ టీవీలో ప్రసారం చేసింది. అప్పట్లో కేవలం నార్త్ లండన్లోని బీబీసీ ట్రాన్స్మీటర్స్కు 40 మైళ్ల దూరంలో ఉండేవారే వీక్షించేవారు. తర్వాత ఆదరణ పెరగడంతో 1967లో దాన్ని రంగుల తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడంటే వివిధ ప్రసార మాధ్యమాల వేదికగా ప్రపంచ వ్యాప్తంగా లైవ్ అప్డేట్స్ వస్తున్నాయి కానీ, అప్పట్లో కేవలం బీబీసీ ద్వారే ఆ టోర్నీ విశేషాలు తెలిసేవి. అందుకోసం ప్రత్యేకమైన టీవీ స్టూడియోలు, కెమెరా స్టేషన్లు, రేడియో స్టేషన్లు ఏర్పాటు చేశారు.
- టెన్నిస్లో మొత్తంగా నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీలుంటే కేవలం వింబుల్డన్లో మాత్రమే గ్రాస్ కోర్టును ఉపయోగిస్తారు. ఆస్ట్రేలియా, యూఎస్ ఓపెన్ టోర్నీల్లో హార్డ్ కోర్టుల్లో మ్యాచ్లు కొనసాగిస్తే.. ఫ్రెంచ్ ఓపెన్లో క్లే కోర్టును వాడతారు. వింబుల్డన్ టోర్నీని గ్రాస్ కోర్టులో నిర్వహిస్తారు. ఈ కోర్టులను 28 మంది తో కూడిన ప్రత్యేకమైన బృందం పర్యవేక్షిస్తుంది. వాటి కోసం ఏటా 9 టన్నుల పెరేనియల్ రై అనే ప్రత్యేకమైన పచ్చగడ్డి విత్తనాలను వినియోగిస్తారు. మ్యాచ్లు జరిగేటప్పుడు ఆ గడ్డిని 8 మిల్లీమీటర్ల మందమే ఉంచుతారు.
- ఈ టోర్నీలో ఆడేవాళ్లంతా తెలుపు రంగు దుస్తులే ధరించాలి. 1963లో ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. 1995లో పూర్తిగా తెల్ల రంగే వాడాలనే నిబంధనను తీసుకొచ్చారు. అలాగే 2014 నుంచి ఆటగాళ్లు వాడే పరికరాలు, బూట్లు, టోపీలు, సాక్సులు ఇలా ప్రతీది తెల్ల రంగులోనే ఉండాలి. అలాగే క్రీడాకారులు ఆయా మ్యాచ్ల్లో పాల్గొనే ముందు ఈ కచ్చితమైన నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది రిఫరీలు చూసి అనుమతిస్తారు.
- ఏటా ఈ టోర్నీ జరిగే సమయంలో మొత్తం 23 టన్నుల స్ట్రాబెర్రీలు అమ్ముడుపోతాయి. వీటిని ప్రత్యేకంగా కెంట్ అనే ప్రాంతంలో పండిస్తారు. టోర్నీ జరిగే రోజుల్లో వీటిని రోజూ ఉదయం 5:30 గంటలకే ఆల్ ఇంగ్లాండ్ క్లబ్కు తీసుకొస్తారు. వాటిని మళ్లీ పూర్తిగా పరిశీలించాకే ప్రేక్షకులకు అమ్మడానికి సిద్ధంగా ఉంచుతారు. అలాగే ఆయా రోజుల్లో ప్రేక్షకులు టీ, కాఫీ, ఐస్క్రీమ్లు, పిజ్జా, బర్గర్లు కూడా అధికమొత్తంలో కొనుగోలు చేస్తారు. దీంతో ఇక్కడ ఆహార పధార్థాలకు కూడా భారీ డిమాండ్ ఉంటుంది.
- ఇక ప్రస్తుత సీజన్లో పురుషుల సింగిల్స్ విభాగంలో రోజర్ ఫెదరర్, నోవాక్ జకోవిచ్.. విజేతగా నిలవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ టోర్నీలో ఫెదరర్ అత్యధికంగా 8 సార్లు విజేతగా నిలవగా జకోవిచ్ 6 టైటిళ్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అయితే, జకోవిచ్ గత మూడు సీజన్లలో 2018, 2019, 2021 హ్యాట్రిక్ విజయాలు సాధించి టాప్ ఫెవరెట్గా ఉన్నాడు. 2020లో కరోనా కారణంగా టోర్నీ రద్దయింది.
- మహిళల విభాగంలో మార్టినా నవ్రతిలోవా 9 విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. స్టెఫీ గ్రాఫ్, సెరీనా విలియమ్స్ 7 విజయాలతో రెండో స్థానంలో ఉన్నారు. దీంతో ఈ సీజన్లో సెరీనా విజయం సాధిస్తే స్టెఫీని వెనక్కి నెట్టే అవకాశం ఉంది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం