IND vs AUS: అహ్మదాబాద్ పిచ్పై ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు
తొలి మూడు టెస్టుల్లో పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు నాలుగో టెస్టు జరుగుతున్న (IND vs AUS) అహ్మదాబాద్ పిచ్ నుంచి బౌలర్లకు పూర్తిస్థాయిలో సహకారం లభించలేదు. ఈ క్రమంలో ఆకాశ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) తొలి మూడు టెస్టులు కేవలం మూడు రోజుల్లోపే ముగియడంతో పిచ్లపై అనేక ప్రశ్నలు వచ్చాయి. రెండు టెస్టుల్లో టీమ్ఇండియా విజయం సాధించగా.. మూడో టెస్టులో ఆసీస్ గెలిచింది. స్పిన్కు అనుకూలంగా భారత్ పిచ్లను తయారు చేసుకుందని ఆసీస్ మాజీలు విమర్శలు గుప్పించారు. అయితే, మూడో టెస్టులో పర్యాటక జట్టు విజయం సాధించడంతో వారి నోళ్లు మూత పడినప్పటికీ.. ఐసీసీ మాత్రం ఇందౌర్ పిచ్కు ‘పేలవం’ రేటింగ్ ఇచ్చింది. ఇప్పుడు నాలుగో టెస్టు జరుగుతున్న (IND vs AUS) అహ్మదాబాద్ పిచ్ వాటన్నింటికీ భిన్నంగా ఉంది. బ్యాటింగ్కు పూర్తి అనుకూలంగా మారింది. దీనిపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ట్విటర్ వేదికగా స్పందించాడు.
‘‘ఒక విపరీతమైన చర్యను సమర్థించడానికి ఎప్పుడూ మరొక విపరీతమైన చర్య కారణంగా లేదా సాకుగా ఉండకూడదు’’ అని చోప్రా పోస్టు చేశాడు. తొలి మూడు టెస్టుల్లో బౌలర్లకు అనుకూలంగా ఉందనే విమర్శలను తిప్పికొట్టడానికి.. ఇప్పుడు పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలంగా పిచ్ను తయారు చేయడం సరైన పద్ధతి కాదనే విధంగా తన స్పందనను తెలియజేశాడు. అహ్మదాబాద్ మైదానంలో రెండో రోజు చివర్లో పది ఓవర్లు మినహా.. ఆసీస్ బ్యాటర్లే బ్యాటింగ్ చేశారు. ఏకంగా తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 480 పరుగులు సాధించింది. కానీ, ఇదే పిచ్పై రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీసి రాణించాడు. సరైన ప్రాంతంలో బంతులేస్తే వికెట్లు తీయొచ్చని నిరూపించాడు. అయితే, బ్యాటింగ్కు అనుకూలమనేది కాదనలేని సత్యం. ఎందుకంటే ఇప్పుడు భారత్ కూడా తమ తొలి ఇన్నింగ్స్లో ధాటిగానే ఆడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం