IND vs AUS: అహ్మదాబాద్ పిచ్పై ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు
తొలి మూడు టెస్టుల్లో పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు నాలుగో టెస్టు జరుగుతున్న (IND vs AUS) అహ్మదాబాద్ పిచ్ నుంచి బౌలర్లకు పూర్తిస్థాయిలో సహకారం లభించలేదు. ఈ క్రమంలో ఆకాశ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) తొలి మూడు టెస్టులు కేవలం మూడు రోజుల్లోపే ముగియడంతో పిచ్లపై అనేక ప్రశ్నలు వచ్చాయి. రెండు టెస్టుల్లో టీమ్ఇండియా విజయం సాధించగా.. మూడో టెస్టులో ఆసీస్ గెలిచింది. స్పిన్కు అనుకూలంగా భారత్ పిచ్లను తయారు చేసుకుందని ఆసీస్ మాజీలు విమర్శలు గుప్పించారు. అయితే, మూడో టెస్టులో పర్యాటక జట్టు విజయం సాధించడంతో వారి నోళ్లు మూత పడినప్పటికీ.. ఐసీసీ మాత్రం ఇందౌర్ పిచ్కు ‘పేలవం’ రేటింగ్ ఇచ్చింది. ఇప్పుడు నాలుగో టెస్టు జరుగుతున్న (IND vs AUS) అహ్మదాబాద్ పిచ్ వాటన్నింటికీ భిన్నంగా ఉంది. బ్యాటింగ్కు పూర్తి అనుకూలంగా మారింది. దీనిపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ట్విటర్ వేదికగా స్పందించాడు.
‘‘ఒక విపరీతమైన చర్యను సమర్థించడానికి ఎప్పుడూ మరొక విపరీతమైన చర్య కారణంగా లేదా సాకుగా ఉండకూడదు’’ అని చోప్రా పోస్టు చేశాడు. తొలి మూడు టెస్టుల్లో బౌలర్లకు అనుకూలంగా ఉందనే విమర్శలను తిప్పికొట్టడానికి.. ఇప్పుడు పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలంగా పిచ్ను తయారు చేయడం సరైన పద్ధతి కాదనే విధంగా తన స్పందనను తెలియజేశాడు. అహ్మదాబాద్ మైదానంలో రెండో రోజు చివర్లో పది ఓవర్లు మినహా.. ఆసీస్ బ్యాటర్లే బ్యాటింగ్ చేశారు. ఏకంగా తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 480 పరుగులు సాధించింది. కానీ, ఇదే పిచ్పై రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీసి రాణించాడు. సరైన ప్రాంతంలో బంతులేస్తే వికెట్లు తీయొచ్చని నిరూపించాడు. అయితే, బ్యాటింగ్కు అనుకూలమనేది కాదనలేని సత్యం. ఎందుకంటే ఇప్పుడు భారత్ కూడా తమ తొలి ఇన్నింగ్స్లో ధాటిగానే ఆడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.