Anahat Singh: 15 ఏళ్లకే స్క్వాష్ సీనియర్ టైటిల్.. ఎవరీ అనహత్?
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధుని చూసి రాకెట్ పట్టిన ఆ అమ్మాయి.. 15 ఏళ్లకే స్వ్కాష్లో జాతీయ సీనియర్ టైటిల్ గెలిచి ఈ ఘనత సాధించిన రెండో పిన్న వయస్కురాలిగా నిలిచిన ఈ యువ సంచలనం విశేషాలు ఇవి.
ఆ అమ్మాయిని చూస్తే స్కూల్ కెళ్లే పాప.. మ్యాచ్లు చూడటానికి స్టేడియానికి వచ్చిందా అన్నట్లు ఉంటుంది. ఆ బక్క పలచని అమ్మాయి గాలికి పడిపోతుందా అని కూడా అనిపిస్తుంది. కానీ, బరిలో దిగితే కానీ తెలియదు ఆ టీనేజర్ సత్తా ఏంటో! వయసు 15 ఏళ్లే అయినా సీనియర్లతో పోటీపడుతూ అంతర్జాతీయ టైటిళ్లు గెలుస్తూ ఔరా అనిపిస్తుంది ఈ బాలిక. ఆమే అనహత్ సింగ్ (Anahat Singh). భారత స్క్వాష్ (Squash) నయా సంచలనం. తాజాగా జాతీయ సీనియర్ విభాగంలో టైటిల్ గెలిచి ఈ ఘనత సాధించిన రెండో పిన్న వయస్కురాలిగా నిలిచింది.
సింధుని చూసి..
దిల్లీకి చెందిన అనహత్ తొలుత బ్యాడ్మింటన్ ప్లేయర్ కావాలని అనుకుంది. 2008లో పి.వి.సింధుని చూసి స్ఫూర్తి పొంది రాకెట్ పట్టింది. ఇంట్లో అమ్మానాన్న గుర్శరణ్సింగ్, తన్వి కూడా క్రీడాకారులే కావడం ఆమెకు కలిసొచ్చింది. అక్క అమైరా స్క్వాష్ వైపు వెళ్లడం చూసి ఎనిమిదేళ్ల వయసులో అనహత్కు కూడా ఈ ఆటపై ఇష్టం ఏర్పడింది. అక్కతో కలిసి తానూ టోర్నీలకి వెళ్లడం మొదలుపెట్టింది. జాతీయ కోచ్ అంజాద్ఖాన్ శిక్షణలో వేగంగా ఈ ఆటలో రాటుదేలింది అనహత్. అతి తక్కువ సమయంలోనే అండర్-11లో భారత్ నంబర్వన్ క్రీడాకారిణి అయింది. ఆ తర్వాత అండర్-13లో అడుగుపెట్టింది. రిత్విక్ భట్టాచార్య శిక్షణ ఆమెకు మరింత కలిసొచ్చింది. 2020లో బ్రిటీష్, మలేసియా ఓపెన్ టోర్నీల్లో రజతం సాధించి సత్తా చాటింది. ఆ తర్వాత కొవిడ్-19 కారణంగా ఆమె కెరీర్కు చిన్న విరామం వచ్చింది.
ఆసియా క్రీడల్లో అదరగొట్టి
గతేడాది థాయ్లాండ్లో జరిగిన ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్లో స్వర్ణంతో మెరిసిన అనహత్.. చెన్నైలో జరిగిన సీనియర్ శిబిరానికి ఎంపికైంది. దీపిక పల్లికల్, జోష్న చిన్నప్ప లాంటి వెటరన్ల మధ్య ఈ అమ్మాయి చిన్న పిల్లలా కనబడేది. కానీ, పోటీల్లోకి దిగాక తెలిసింది అనహత్ ప్రతిభ. సీనియర్లు కూడా ఈ అమ్మాయి ముందు నిలువలేకపోయారు. చిరుత వేగం, అంతకుమించిన నైపుణ్యం, సరళతతో ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది అనహత్. ఎంత సీనియర్ ఎదురైనా ఏమాత్రం తొణక్కుండా స్థిరంగా ఆడడం ఆమె మరో ప్రత్యేకత. ఈ లక్షణాలు సీనియర్ విభాగంలో ఆమె త్వరగా దూసుకెళ్లేలా చేశాయి. ఈ ఏడాది ఆగస్టులో అండర్-17 ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్లో అనహత్ విజేతగా నిలిచింది. ఈ జోరుతోనే హాంగ్జౌ ఆసియా క్రీడల్లో అనహత్ రెండు కాంస్యాలతో అదరగొట్టింది. మహిళల టీమ్లో కాంస్య పతకం గెలిచిన ఈ టీనేజర్.. ఆ తర్వాత మిక్స్డ్ విభాగంలో అభయ్ సింగ్ తోడు కంచు మోగించింది. 2026 లాస్ఏంజెల్ ఒలింపిక్స్లో స్క్వాష్ను ఒక ఆటగా చేర్చడంతో కచ్చితంగా ఒలింపిక్స్కు అర్హత సాధించి సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. తాజాగా జాతీయ సీనియర్ విభాగంలో టైటిల్ గెలుచుకుని.. జోష్న చిన్నప్ప (2000) తర్వాత ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా నిలిచిన 15 ఏళ్ల అనహత్.. మున్ముందు ఇంకెన్ని ఘనతలు సాధిస్తుందో చూడాలి.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!