Anil Kumble: భారత క్రికెట్లో ఈ రోజు ఓ సంచలనం.. కుంబ్లేకు పాక్ జట్టు దాసోహమైన వేళ!
భారత్ క్రికెట్ చరిత్రలో నేడు ఓ మరుపురాని రోజు. ఏ బౌలరైన కలలు కనే గణంకాలను భారత స్పిన్నర్ కుంబ్లే సాధించాడు.
ఇంటర్నెట్డెస్క్: భారత(Team India) స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే (Anil Kumble) స్పిన్ సుడిలో చిక్కుకొని పాక్ బ్యాటింగ్ పేకమేడలా కూలి నేటికి 24 ఏళ్లు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ రికార్డును భారత లెజెండ్ సమం చేశాడు. రెండు టెస్టుల సిరీస్లో భారత్(Team India) తొలిటెస్టులో ఓటమి చవి చూసింది. చెన్నైలో జరిగిన ఆ టెస్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 136 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా 12 పరుగల తేడాతో మ్యాచ్ను కోల్పోయింది. దీంతో 1999 ఫిబ్రవరి 7న నాటి ఫిరోజ్షా కోట్ల మైదానంలో జరిగే రెండో టెస్టును గెలిచి సిరీస్ను సమం చేయాలన్న ఒత్తిడి భారత్పై పెరిగిపోయింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 252 పరుగులు సాధించింది. ఎస్.రమేష్, అజారుద్దీన్లు మాత్రమే అర్ధ శతకాలు చేయగా.. ఐదుగురు బ్యాటర్లు కలిపి 8 పరుగులు చేశారు. సక్లైన్ ముస్తాక్ రెచ్చిపోయి 5 వికెట్లు సాధించాడు. దీంతో భారత బౌలర్లపై ఒత్తిడి పెరిగిపోయింది. శ్రీనాథ్, వెంకటేష్ ప్రసాద్, హర్భజన్, కుంబ్లే(Anil Kumble)తో భారత బౌలింగ్ దళం పాక్ వెన్ను విరిచింది. దీంతో పాక్ 172కే ఆలౌట్ అయింది. కుంబ్లే 4, హర్భజన్ 3 వికెట్లు తీసుకొన్నారు. భారత్(Team India)కు 80 పరుగుల ఆధిక్యం లభించింది.
రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు మెరుగ్గా ఆడి 339 పరుగులు చేశారు. రమేష్ 96, గంగూలీ 62, శ్రీనాథ్ 49 పరుగులు చేశారు. కోట్ల వికెట్ స్పిన్నర్లకు స్వర్గధామంలా మారింది. పాక్ ఎదుట 420 పరుగుల భారీ లక్ష్యం ఉంది. టెస్టుల్లో 400 పరుగులపై లక్ష్యాన్ని ఛేదించడం సామాన్యమైన విషయం కాదు. పాక్ ఓపెనర్లు అన్వర్, అఫ్రిదీ శుభారంభాన్ని ఇచ్చి 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కుంబ్లే (Anil Kumble) బౌలింగ్లో అఫ్రిదీ అవుట్ కావడంతో వికెట్ల పతనం మొదలైంది. కుంబ్లే(Anil Kumble) తర్వాతి బంతికే ఇజాజ్ అహ్మద్ ఎల్బీ రూపంలో డకౌట్ అయ్యాడు. స్టార్ బ్యాటర్లు ఇంజిమామ్ (6), మహమ్మద్ యూసఫ్ (0), మోయిన్ ఖాన్ (3)లను కూడా అతడు పెవిలియన్కు చేర్చడంతో పాక్ పతనం ఖాయమైంది. ఒంటరి పోరాటం చేస్తున్న అన్వర్ కూడా ఏకాగ్రత దెబ్బతిని కుంబ్లే బౌలింగ్లో లక్ష్మణ్కు క్యాచ్ ఇచ్చాడు. సలీం మాలిక్-వసీం అక్రమ్ కొద్ది సేపు ప్రతిఘటించినా పాక్ ఓటమిని తప్పించలేకపోయారు. 186 పరుగల వద్ద కుంబ్లే(Anil Kumble) మరోసారి విజృంభించి మాలిక్ వికెట్ రూపంలో ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన ముస్తాక్ అహ్మద్, సక్లైన్ ముస్తాక్ను 58వ ఓవర్లో వరుసగా ఔటు చేశాడు. 60వ ఓవర్లో వసీం అక్రమ్ను కుంబ్లే ఎల్బీగా బలిగొనడంతో పాక్ పతనం సంపూర్ణమైంది. ఈ ఇన్నింగ్స్లో 26.3 ఓవర్లు బౌలింగ్ చేసిన అనిల్ మొత్తం 74 పరుగులిచ్చి 10 వికెట్లు సాధించాడు. దీంతో ఇంగ్లాడ్ ఆఫ్ స్పిన్నర్ జిమ్లేకర్ 1956లో సృష్టించిన రికార్డును సమం చేసినట్లైంది.
టీ బ్రేక్ తర్వాత ఆలోచన..
‘‘ఈ మ్యాచ్లో లంచ్ నుంచి టీబ్రేక్ వరకు నేను వరుసగా బౌలింగ్ చేస్తునే ఉన్నాను. అప్పటికే నా ఖాతాలో ఆరు వికెట్లు పడ్డాయి. గతంలో నా 7 వికెట్ల బెస్ట్ను మెరుగుపర్చుకొనే అవకాశం ఈ మ్యాచ్లో ఉందన్న విషయాన్ని టీబ్రేక్లో గ్రహించాను. ఆ తర్వాత బౌలింగ్ను కొనసాగించాను. 7వ వికెట్ తీసిన కొద్దిసేపటికే వరుస బంతుల్లో 8,9 వికెట్లు కూడా దక్కాయి. పది వికెట్లు సాధించే అవకాశం ఉందని నాకు, జట్టు సభ్యులకు అప్పుడు అర్థమైంది’’ అని ఓ సందర్భంలో అనిల్ కుంబ్లే(Anil Kumble) స్వయంగా వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు