Qualifier 2 - SRH vs RR: నేను లోకల్.. ఈ స్టేడియం నాకెంతో ‘స్పెషల్’: రవిచంద్రన్ అశ్విన్
రెండో క్వాలిఫయర్ కోసం హైదరాబాద్ - రాజస్థాన్ టీమ్లు తమ శక్తియుక్తులను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాయి. చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో కీలకమైన రెండో క్వాలిఫయర్ మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది. సన్రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్ తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో తన సొంత మైదానం చెపాక్లో ఆడుతుండటంపై రాజస్థాన్ రవిచంద్రన్ అశ్విన్ థ్రిల్గా ఫీలవుతున్నాడు. ఈసారి తమ జట్టుకే ఇక్కడి ప్రేక్షకులు మద్దతు తెలుపుతారని ఆశాభావం వ్యక్తంచేస్తున్నాడు.
‘‘ఎవరి హోం గ్రౌండ్ వారికి స్పెషల్. నాకు కూడా చెపాక్ ఇలాంటిదే. చాన్నాళ్లపాటు ఎన్నో సాధించిన మైదానం అది. బ్యాటింగ్లోనూ మెరుపులు మెరిపించా. తప్పకుండా ఈసారి మా జట్టు కోసం కీలక ప్రదర్శన చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈసారి మాకే మద్దతు ఇస్తారనుకుంటున్నా. హైదరాబాద్పై ఎలాంటి గేమ్ ప్లాన్ను అమలుచేస్తామనేది ఇప్పుడే చెప్పలేం. మా వ్యూహాలు వారిపై ఆధిపత్యం ప్రదర్శిస్తాయా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది’’ అని అశ్విన్ తెలిపాడు.
హెడ్నే టార్గెట్ చేస్తుంది: చోప్రా
వరుస మ్యాచుల్లో విఫలమైన ట్రావిస్ హెడ్ను రాజస్థాన్ బౌలర్లు మరోసారి త్వరగా ఔట్ చేసేందుకు వ్యూహం పన్నుతారని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘హెడ్కు బౌలింగ్ వేసేటప్పుడు ట్రెంట్ బౌల్ట్ పెద్దగా ఇబ్బందిపడడు. గత మ్యాచ్లో అతడిని ఔట్ చేసే అవకాశం చేజారింది. రియాన్ క్యాచ్ను డ్రాప్ చేశాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. ఈసారి అలా జరగకుండా హెడ్ను ఉచ్చులో వేయడానికి ప్రయత్నిస్తారు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. హెడ్ మొదటి ఇన్నింగ్స్లో ఎక్కువగా పరుగులు చేస్తుంటే.. శర్మ ఛేదన సమయంలో దూకుడుగా ఆడుతున్నాడు. తప్పకుండా అతడు భారత జట్టులోకి వస్తాడు’ అని చోప్రా వ్యాఖ్యానించాడు.
ఒకవేళ మ్యాచ్ ఇవాళ రద్దైతే..?
రెండో క్వాలిఫయర్లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్లో కోల్కతాతో టైటిల్ కోసం తలపడుతుంది. నైరుతి రుతుపవనాల నేపథ్యంలో వర్షం పడే అవకాశం లేకపోలేదు. ఒకవేళ మ్యాచ్కు రిజర్వ్ డే ఉంది. ఒకవేళ అప్పుడు కూడా మ్యాచ్ జరగకుండా రద్దైతే మాత్రం హైదరాబాద్ ఫైనల్కు చేరుతుంది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ కంటే సన్రైజర్స్ ముందుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..