Abhinav Bindra: అథ్లెట్లు రోబోలు కాదు
క్రీడా విధానంలో భాగమైన ప్రతి ఒక్కరూ అథ్లెట్లను మనుషుల్లాగే చూడాలని, అంతే కానీ పతకాలు తెచ్చే రోబోల్లాగా పరిగణించకూడదని షూటింగ్ దిగ్గజం అభినవ్ బింద్రా అన్నాడు.
దిల్లీ: క్రీడా విధానంలో భాగమైన ప్రతి ఒక్కరూ అథ్లెట్లను మనుషుల్లాగే చూడాలని, అంతే కానీ పతకాలు తెచ్చే రోబోల్లాగా పరిగణించకూడదని షూటింగ్ దిగ్గజం అభినవ్ బింద్రా అన్నాడు. ఒలింపిక్స్, ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో ఇటీవల భారత మెరుగైన ప్రదర్శన కారణంగా క్రీడాకారులకు ఆదరణ దక్కడంతో పాటు వీళ్లపై అంచనాల భారం కూడా పెరుగుతోంది. ‘‘అన్నింటికంటే ముందుగా అథ్లెట్లను మనుషుల్లాగే చూడాలి. పతకాలు తెచ్చే రోబోల్లాంటి పరిస్థితిలోకి నెట్టొద్దు. అథ్లెట్లతో బంధం పెంచుకోవడం, నమ్మకం ఏర్పరుచుకోవడం అత్యంత ముఖ్యం. అథ్లెట్ల స్థిరమైన మానసిక, భావోద్వేగ పరిస్థితులతో వ్యవహరించేటప్పుడు క్రీడా సైకాలజిస్టులకు ఎంతో ఓపిక ఉండాలి. టోక్యో ఒలింపిక్స్కు, ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్కు మధ్య షూటర్ల మానసిక దృక్పథం మారింది. నాలుగేళ్ల క్రితం కాకుండా ఇప్పుడు వీళ్లు ఎలా ఉన్నారనే విషయంపైనే మానసిక అంచనా వేయాలి. అథ్లెట్ల పరిణామంతో పాటే సైకాలజిస్టులూ మారాలి. ఇప్పుడు సంధి దశలో ఉన్నాం. క్రీడా సైన్స్ను కోచ్లు స్వాగతించాలి. వీళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. ఉదాహరణకు కోచ్లకు మానసిక ఆరోగ్యం గురించి వర్క్షాప్ నిర్వహిస్తే అప్పుడు వాళ్లు మరింత సంతోషపడతారు’’ అని కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్లో గురువారం క్రీడా సైకాలజిస్టులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో అభినవ్ పేర్కొన్నాడు. 2008 ఒలింపిక్స్ 10మీ. ఎయిర్ రైఫిల్లో బింద్రా పసిడి గెలిచిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్