WTC Final: ‘ఐసీసీ ఏం చేస్తోంది.. అప్పటి వరకు అభిమానుల ఆసక్తి తగ్గుతుంది’
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ (WTC Final)ను జూన్లో నిర్వహించనుండటంపై ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ బ్రాడ్ హాగ్ ఐసీసీపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్-గావస్కర్ ట్రోఫీని టీమ్ఇండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అహ్మదాబాద్లో జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ (WTC Final) బెర్తులు ఖరారు కావడంలో ఈ సిరీస్ కీలకంగా మారింది. మూడో టెస్టు గెలుపొంది ఆసీస్ డబ్ల్యూటీసీ ఫైనల్కు దూసుకెళ్లగా.. న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓడిపోవడంతో భారత్కు లైన్ క్లియర్ అయింది. జూన్ 7-11 మధ్య లండన్లోని ది ఓవల్ మైదానంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ నిర్వహించనున్నారు. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్ను జూన్లో నిర్వహించాలని ఐసీసీ (ICC) తీసుకున్న నిర్ణయంపై ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ బ్రాడ్ హాగ్ (Brad Hogg) అసంతృప్తి వ్యక్తం చేశాడు.
‘ఐసీసీ ఏం చేస్తోంది? ముఖ్యమైన మ్యాచ్లన్నీ పూర్తయ్యాయి. WTC ఫైనల్ కోసం 3 నెలలు వేచి ఉండాల్సి వస్తోంది. ఇలా సుదీర్ఘ విరామం ఇస్తే అభిమానులకు టెస్టు క్రికెట్పై ఆసక్తి తగ్గుతుంది. దయచేసి ఐసీసీ మేల్కొవాలి. అభిమానుల్లో ఇప్పుడు ఉన్న ఉత్సాహం అప్పటివరకు (జూన్) ఉండదు. IPL ముగిసిన తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్ వచ్చే సమయానికి చాలా జట్లు తమ మ్యాచ్లతో బిజీగా ఉంటాయి. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్పై ఇతర దేశాల అభిమానులు ఆసక్తి చూపకపోవచ్చు. మే 21 వరకు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు ఆరు జట్లు నిష్క్రమిస్తాయి. కాబట్టి, అందుబాటులో ఉన్న మా ఆటగాళ్లను గుర్తించి వారిని వీలైనంత తొందరగా యూకేకు తీసుకురావడానికి మేం ప్రయత్నిస్తాం. కొంత సమయం తీసుకుని ఆటగాళ్లను పర్యవేక్షిస్తాం’ అని బ్రాడ్ హాగ్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ఐపీఎల్ 16 సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. మే 28న ఫైనల్ను నిర్వహించునున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?