WTC Final: ‘ఐసీసీ ఏం చేస్తోంది.. అప్పటి వరకు అభిమానుల ఆసక్తి తగ్గుతుంది’
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ (WTC Final)ను జూన్లో నిర్వహించనుండటంపై ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ బ్రాడ్ హాగ్ ఐసీసీపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్-గావస్కర్ ట్రోఫీని టీమ్ఇండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అహ్మదాబాద్లో జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ (WTC Final) బెర్తులు ఖరారు కావడంలో ఈ సిరీస్ కీలకంగా మారింది. మూడో టెస్టు గెలుపొంది ఆసీస్ డబ్ల్యూటీసీ ఫైనల్కు దూసుకెళ్లగా.. న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓడిపోవడంతో భారత్కు లైన్ క్లియర్ అయింది. జూన్ 7-11 మధ్య లండన్లోని ది ఓవల్ మైదానంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ నిర్వహించనున్నారు. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్ను జూన్లో నిర్వహించాలని ఐసీసీ (ICC) తీసుకున్న నిర్ణయంపై ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ బ్రాడ్ హాగ్ (Brad Hogg) అసంతృప్తి వ్యక్తం చేశాడు.
‘ఐసీసీ ఏం చేస్తోంది? ముఖ్యమైన మ్యాచ్లన్నీ పూర్తయ్యాయి. WTC ఫైనల్ కోసం 3 నెలలు వేచి ఉండాల్సి వస్తోంది. ఇలా సుదీర్ఘ విరామం ఇస్తే అభిమానులకు టెస్టు క్రికెట్పై ఆసక్తి తగ్గుతుంది. దయచేసి ఐసీసీ మేల్కొవాలి. అభిమానుల్లో ఇప్పుడు ఉన్న ఉత్సాహం అప్పటివరకు (జూన్) ఉండదు. IPL ముగిసిన తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్ వచ్చే సమయానికి చాలా జట్లు తమ మ్యాచ్లతో బిజీగా ఉంటాయి. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్పై ఇతర దేశాల అభిమానులు ఆసక్తి చూపకపోవచ్చు. మే 21 వరకు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు ఆరు జట్లు నిష్క్రమిస్తాయి. కాబట్టి, అందుబాటులో ఉన్న మా ఆటగాళ్లను గుర్తించి వారిని వీలైనంత తొందరగా యూకేకు తీసుకురావడానికి మేం ప్రయత్నిస్తాం. కొంత సమయం తీసుకుని ఆటగాళ్లను పర్యవేక్షిస్తాం’ అని బ్రాడ్ హాగ్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ఐపీఎల్ 16 సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. మే 28న ఫైనల్ను నిర్వహించునున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల