IND vs AUS: సెలక్టర్లు రాజీనామా చేయాలి: సునీల్ గావస్కర్
ఆస్ట్రేలియా సెలక్టర్లపై టీమ్ఇండియా మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. జట్టు ఎంపిక సరిగ్గా చేయనందుకు బాధ్యత వహిస్తూ వారు రాజీనామా చేయాలని సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy)లో మొదటి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా (Australia) ఘోరంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. పిచ్లను భారత్ తమకు అనుకూలంగా మార్చుకుందని, అందుకే విజయం సాధించిందని ఆసీస్ మాజీ ఆటగాళ్లు, ఆ దేశ మీడియా అక్కసు వెళ్లగక్కింది. అయితే, ఇందౌర్లో జరిగిన మూడో టెస్టులో కంగారులు విజయం సాధించడంతో వారి నోళ్లకు తాళం పడింది. అయితే.. ఆస్ట్రేలియా సెలక్టర్లను భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) ఇటీవల తీవ్రంగా విమర్శించాడు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు, కొన్ని మీడియా సంస్థలు పిచ్ల గురించి ఆలోచించడం మానేసి సెలక్టర్లు ఏం చేస్తున్నారో గమనించాలని సూచించాడు.
‘చాలా మంది ఆసీస్ మాజీ ఆటగాళ్లు, కొన్ని మీడియా సంస్థలు తమ ఆటగాళ్లను విమర్శిస్తున్నాయి. నిజానికి వాళ్లు టార్గెట్ చేయాల్సింది సెలక్టర్లను. మొదటి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటారో లేదో తెలియనప్పుడు ఆ ముగ్గురు ఆటగాళ్లను (హేజిల్వుడ్, మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్) ఎలా ఎంపిక చేస్తారు? అంటే సగం సిరీస్కు కేవలం 13 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారన్నమాట. అప్పటికప్పుడు హడావుడిగా స్పిన్నర్ మాథ్యూ కునెమన్ను రప్పించారు. అలాంటి స్పిన్నర్ అప్పటికే జట్టులో ఉన్నాడు. ఒకవేళ ఆ ఆటగాడు జట్టుకు అవసరం లేడనుకుంటే అతడిని ఎంపిక చేయడం ఎందుకు? తర్వాత అతడి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం ఎందుకు? అంటే టీమ్ మేనేజ్మెంట్ 12 మంది ఆటగాళ్ల నుంచి 11 మందిని ఎంపిక చేసుకుంటుందా? ఇది మరీ విచిత్రంగా ఉంది. సెలక్టర్లకు నిజంగా చిత్తశుద్ధి, బాధ్యత ఉంటే వారు రాజీనామా చేయాలి’ అని సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. మార్చి 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆసీస్ మధ్య నాలుగో టెస్టు ప్రారంభంకానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు