IPL 2024: ఆసీస్ ఆటగాళ్లకు ఇంత ధరా?.. కంగారూ క్రికెటర్లకు డిమాండ్ ఎందుకు?
ఐపీఎల్ వేలంలో (IPL Auction) ఆసీస్ ఆటగాళ్ల హవా కొనసాగింది. భారీ ధరను ఆ జట్టు ప్లేయర్లే సొంతం చేసుకున్నారు. రికార్డులు కూడా వారి పేరిటే నమోదయ్యాయి.
రూ.16 కోట్లు దాటితేనే అమ్మో అంత ధరనా అనుకున్నాం. అదే.. రూ.18.50 కోట్లు అయితే ఆశ్చర్యంలో మునిగిపోయాం. ఇప్పుడు ఏకంగా ఒకరికేమో రూ.24.75 కోట్లు, మరొకరికేమో రూ.20.50 కోట్లు. గత రికార్డులను చెరిపేస్తూ.. సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఈ ఐపీఎల్ మినీ వేలం అంచనాలను దాటేసింది. ఆటగాడి ధర రూ.20 కోట్ల మార్కును చేరుకోవడమే కాదు.. ఒకే సారి ఇద్దరికి అంతకంటే ఎక్కువ ధర దక్కింది. ఆ ఇద్దరూ ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, కమిన్స్ కావడం ఇక్కడ మరో విశేషం. వీళ్లే కాదు.. ఈ వేలంలో ఇతర ఆస్ట్రేలియా ఆటగాళ్లకూ భారీ ధర పలికింది. మరి కంగారూ క్రికెటర్లపై ఫ్రాంఛైజీలు రూ.కోట్ల వర్షం కురిపించడానికి కారణమేంటీ?
వాళ్లదే హవా..
ఐపీఎల్ వేలం అనగానే చాలు ఆస్ట్రేలియా క్రికెటర్లపై ఫ్రాంఛైజీల మోజు బయటపడుతుంది. లీగ్ ఆరంభం నుంచి ఇది ఇలాగే కొనసాగుతూ వస్తోంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకున్న టాప్-10 క్రికెటర్ల జాబితాలో నాలుగు స్థానాలు వాళ్లవే. స్టార్క్, కమిన్స్ (2024 వేలం) తొలి రెండు ప్లేసుల్లో ఉండగా.. కామెరూన్ గ్రీన్ (2023లో రూ.17.50 కోట్లు) నాలుగో స్థానంలో ఉన్నాడు. కమిన్స్ (2020లో రూ.15.50 కోట్లు) తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఇద్దరు ఇంగ్లాండ్ ఆటగాళ్లు (సామ్ కరన్- రూ.18.50 కోట్లు, బెన్ స్టోక్స్- రూ.16.25 కోట్లు), ఒక్కో దక్షిణాఫ్రికా (క్రిస్ మోరిస్- రూ.16.25 కోట్లు), వెస్టిండీస్ (నికోలస్ పూరన్- రూ.16 కోట్లు), ఇద్దరు భారత ఆటగాళ్లు (యువరాజ్ సింగ్- రూ.16 కోట్లు, ఇషాన్ కిషన్- రూ.15.25 కోట్లు) ఉన్నారు. అంతర్జాతీయ టీ20ల్లో బెరుకన్నదే లేకుండా దూకుడుగా ఆడటం ఆసీస్ ఆటగాళ్లకు అలవాటు. అంతే కాకుండా తమ సొంత బిగ్బాష్ టీ20 లీగ్లో సత్తాచాటిన కంగారూ ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలో ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించడం, ఎలాంటి వాతావరణానికి అయినా అలవాటు పడటం ఆసీస్ ఆటగాళ్ల ప్రత్యేకత.
ఈ సారి కూడా అంతే..
ఈ సారి వేలంలోనూ ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారీ ధరలను దక్కించుకున్నారు. దీని వెనుక ఇటీవల ప్రపంచకప్లో వీళ్ల ప్రదర్శన, అంతర్జాతీయ క్రికెట్లో నిలకడైన ఆటతీరు, వారి దేశవాళీ లీగ్లో ఉత్తమంగా రాణించడం తదితర కారణాలున్నాయి. అంతే కాకుండా వేలంలో వీళ్ల పేర్లు వచ్చే సమయానికి నెలకొన్న పరిస్థితులు, ఫ్రాంఛైజీల దగ్గర అప్పుడు ఉన్న డబ్బు, జట్ల మధ్య పోటీ కూడా వీరి ధరలపై ప్రభావం చూపాయి. ఈ సారి అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లలో ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్లున్నారు. స్టార్క్ (కోల్కతా నైట్ రైడర్స్), కమిన్స్ (సన్రైజర్స్ హైదరాబాద్)తో పాటు యువ పేసర్ స్పెన్సర్ జాన్సన్ (గుజరాత్ టైటాన్స్- రూ.10 కోట్లు) కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. వీళ్లే కాకుండా ట్రేవిస్ హెడ్ (సన్రైజర్స్ హైదరాబాద్- రూ.6.80 కోట్లు), జే రిచర్డ్సన్ (దిల్లీ క్యాపిటల్స్- రూ.5 కోట్లు), ఆస్టన్ టర్నర్ (లఖ్నవూ సూపర్ జెయింట్స్- రూ.కోటి) కూడా మంచి ధర పలికారు.
అందుకే ఇలా
ఐపీఎల్లో రెండు సీజన్లే (ఆర్సీబీ తరపున 2014, 2015) ఆడినప్పటికీ స్టార్క్ కోసం కోల్కతా రికార్డు ధర చెల్లించింది. 33 ఏళ్ల స్టార్క్ అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవల ప్రపంచకప్లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన (16 వికెట్లు) చేశాడు. పైగా ఫెర్గూసన్, సౌథీ, ఉమేశ్, శార్దూల్ వంటి పేసర్లను వదులుకున్న కోల్కతాకు స్టార్క్ అవసరం వచ్చింది. మరోవైపు కమిన్స్ను బ్యాటర్గా, బౌలర్గా, కెప్టెన్గా వాడుకోవాలనే ఉద్దేశంతోనే సన్రైజర్స్ కూడా తగ్గలేదని చెప్పాలి. మంచి పేస్తో వికెట్లు రాబట్టగలిగే అతడు భారీ షాట్లూ ఆడగలడు. ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన అర్ధశతకం (2022లో ముంబయిపై 14 బంతుల్లో) రికార్డు అతనిదే. ఇక ఈ ఏడాది దేశానికి ప్రపంచకప్ అందించిన కమిన్స్ నాయకత్వ లక్షణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచకప్ ఫైనల్లో శతకంతో ఆసీస్ను గెలిపించిన హెడ్ కోసం కూడా వేలంలో పోటీ నెలకొంది. వార్నర్ను వదులుకున్న తర్వాత ఆ స్థాయి ఓపెనర్ సన్రైజర్స్కు దొరకలేదు. ఇప్పుడా ఖాళీని హెడ్తో భర్తీ చేయనుంది. ఇక ఆసీస్ యువ పేసర్ స్పెన్సర్కు అంత ధర ఊహించనిదే. ఆస్ట్రేలియా తరపున అతను ఇప్పటి వరకూ రెండు టీ20లు, ఓ వన్డే మాత్రమే ఆడి రెండు వికెట్లను పడగొట్టాడు. కానీ, బిగ్బాష్ లీగ్, హండ్రెడ్ లీగ్లో అతడి ప్రదర్శన, వేగం చూసి గుజరాత్ దక్కించుకున్నట్లుంది. రిచర్డ్సన్ కోసం దిల్లీ కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేసినట్లు కనిపించింది.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!