Axar Patel: మంచు ప్రభావం తప్పించుకొనేందుకు నా ప్రణాళిక అదే: అక్షర్ పటేల్
అక్షర్ పటేల్ (Axar Patel) .. ఆసీస్పై అద్భుత ప్రదర్శనతో నాలుగో టీ20 మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి బౌలింగ్ చేయడం వల్ల వికెట్లు దక్కాయని పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: నాలుగో టీ20 మ్యాచ్లో ఆసీస్పై భారత్ విజయం సాధించడంలో అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లు తీసి ఆస్ట్రేలియాను కట్టడి చేశాడు. దీంతో అక్షర్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా అక్షర్ పటేల్ మాట్లాడాడు.
‘‘మ్యాచ్లు ఆడనప్పుడు ఇంటి దగ్గర ఉన్న సమయంలో చాలా అంశాలపై దృష్టిపెట్టాను. ఇప్పుడు అవి ఈ సిరీస్లో అమలు చేసేందుకు ప్రయత్నించా. నా బలమేంటో తెలుసు. దానికి కట్టుబడి బౌలింగ్ చేశా. మంచు ప్రభావం నుంచి తప్పించుకోవడానికి స్టంప్స్ను లక్ష్యంగా చేసుకుని బంతులను వేయాలి. ఈ మ్యాచ్లో అలా చేసి ఫలితం రాబట్టగలిగా. ఈ ఫార్మాట్లో మానసికంగా చాలా బలంగా ఉండాలి. అప్పుడే వికెట్లను తీసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. గాయం కారణంగా వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో ఆడలేకపోయా. కోలుకున్నాక బౌలింగ్లో మెరుగుకావడానికి శ్రమించా. బౌలింగ్లో వేరియేషన్స్ చాలా కీలకం. వాటిపై సాధన చేశా’’ అని అక్షర్ పటేల్ తెలిపాడు.
ఎప్పుడు అవకాశం వచ్చినా..: రవి బిష్ణోయ్
‘‘జట్టు కోసం ఎప్పుడు అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవడానికి ఎదురు చూస్తుంటా. ఆసీస్తో అవకాశం రావడం బాగుంది. భారత్ గెలవడం మరింత ఆనందంగా ఉంది. నా బౌలింగ్ పట్ల సంతోషంగా ఉన్నా. భవిష్యత్తులోనూ ఇదే ఆటతీరును ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తా. జట్టులో యువకులం ఎక్కువగా ఉన్నాం. ప్రతి ఒక్కరూ అద్భుతంగా రాణిస్తున్నారు. ఒకరికొకరం జట్టుగా ఆస్వాదిస్తున్నాం. భారత బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. మ్యాచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిలకడగా బంతులను సంధించడంపైనే దృష్టిపెట్టాలని సూచించారు’’ అని భారత యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో