ICC: ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డులు.. భారత్ నుంచి ముగ్గురు నామినేట్!
అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రతి నెలా ప్రకటించే ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం టీమ్ఇండియా నుంచి అక్షర్ పటేల్, స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్ నామినేట్ అయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతి నెలా పురుషుల, మహిళా క్రికెట్ విభాగంలో ఒకరికి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు’ ప్రకటిస్తుంది. తాజాగా ఆసీస్తో జరిగిన టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన టీమ్ఇండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ (సెప్టెంబర్) అవార్డు కోసం నామినేట్ అయ్యాడు. అక్షర్తోపాటు పాకిస్థాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్, ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ గ్రీన్ కూడా నామినేట్ కావడం గమనార్హం.
ఆసీస్తో టీ20 సిరీస్లో భాగంగా భారీ స్కోర్లు నమోదైన తొలి మ్యాచ్లో అక్షర్ పటేల్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. కేవలం 8 ఓవర్ల చొప్పున జరిగిన రెండో మ్యాచ్లో దూకుడుగా ఆడిన ఆస్ట్రేలియా బ్యాటర్లకు కళ్లెం వేశాడు. రెండు ఓవర్ల కోటాలో 13 పరుగులే ఇచ్చి గ్లెన్ మ్యాక్స్వెల్, టిమ్ డేవిడ్ వికెట్లు తీసి అదరగొట్టాడు. మూడో టీ20లోనూ మూడు వికెట్లు తీయడం విశేషం. దీంతో ఈ సిరీస్లో మొత్తం ఎనిమిది వికెట్లు తీసి టాప్ బౌలర్గా మారాడు. టీ20ల్లో నంబర్వన్ బ్యాటర్ రిజ్వాన్ కూడా అవార్డు రేసులో నిలిచాడు. గత పది మ్యాచుల్లో ఏడు అర్ధశతకాలు నమోదు చేసి మంచి ఫామ్లో ఉన్నాడు. ఆసియా కప్లోనూ 281 పరుగులు చేసి టాప్ స్కోరర్ కావడం గమనార్హం. భారత్తో జరిగిన మూడు టీ20ల సిరీస్లో ఆసీస్ ఓపెనర్ కామెరూన్ గ్రీన్ రెండు అర్ధశతకాలు బాదేశాడు. దీంతో అతడి పేరూ నామినేట్ అయింది.
భారత్ నుంచి ఇద్దరు మహిళా క్రికెటర్లు
పురుషుల క్రికెట్ నుంచి అక్షర్ పటేల్ ఒక్కడే నామినేట్ కాగా.. భారత్ నుంచి ఇద్దరు మహిళా క్రికెటర్లు నామినేషన్ దక్కించుకోవడం విశేషం. ఇంగ్లాండ్పై మూడు వన్డేల సిరీస్లను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన టీమ్ఇండియా సారథి హర్మన్ ప్రీత్ కౌర్తోపాటు ఓపెనర్ స్మృతి మంధాన ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ కాగా.. వీరిద్దరితోపాటు బంగ్లాదేశ్ సారథి నిగర్ సుల్తానాకు అవకాశం దక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు