Babar Azam: ఆడలేక.. నడిపించలేక.. కెప్టెన్సీ వదిలేసిన బాబర్
బ్యాటర్గా అద్భుతంగా ఆడే బాబర్ అజాం (Babar Azam).. ఈసారి వరల్డ్ కప్లో వ్యక్తిగత ప్రదర్శనతోపాటు జట్టును నడిపించడంలోనూ ఘోరంగా విఫలమయ్యాడు.
ఆ ఆటగాడు అత్యుత్తమ నైపుణ్యాలతో పాకిస్థాన్ జాతీయ జట్టులోకి వచ్చాడు. తనదైన క్లాస్ ఆటతీరుతో మెప్పించాడు. రికార్డుల బాటలో సాగాడు. అనతికాలంలోనే జట్టులో ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు. అంతర్జాతీయ క్రికెట్లోనూ తనదైన ముద్ర వేశాడు. విరాట్ కోహ్లీతో పోల్చి చూసే స్థాయికి చేరాడు. దీంతో జట్టు పగ్గాలు దక్కాయి. మూడు ఫార్మాట్లలోనూ జట్టును నడిపించాడు. సమర్థవంతమైన కెప్టెన్గానూ పేరు తెచ్చుకున్నాడు. కానీ ప్రపంచకప్తో అతని కథ మలుపు తిరిగింది. ఈ మెగా టోర్నీలో జట్టును నడిపించడంలో అతను విఫలమయ్యాడు. ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. చివరకు జట్టు నాయకత్వాన్ని వదులుకున్నాడు. అతనే.. బాబర్ అజాం (Babar Azam). ఉవ్వెత్తున ఎగసి.. అంతే వేగంగా కింద పడ్డ క్రికెటర్.
మెరుపులతో..
2015లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన బాబర్ తక్కువ కాలంలోనే అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగాడు. నిలకడగా రాణిస్తూ పాక్ ప్రధాన బ్యాటర్గా మారాడు. అన్ని ఫార్మాట్లలోనూ మెరుగ్గా రాణించాడు. వన్డేల్లో అత్యధిక వేగంగా 5 వేల పరుగులు, అంతర్జాతీయ టీ20ల్లో వేగంగా మూడు వేల పరుగులు చేసిన ఘనత అతనిదే. ముఖ్యంగా వన్డేల్లో గొప్ప ఆటతీరుతో సాగుతున్నాడు. ఇప్పటివరకూ 117 వన్డేల్లో 56.72 సగటుతో 5729 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలున్నాయి. ఇక 49 టెస్టుల్లో 3772 పరుగులు, 104 టీ20ల్లో 3485 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్ల ర్యాంకింగ్స్లోనూ టాప్-5లో కొనసాగుతున్న ఏకైక ఆటగాడు అతనే. రెండేళ్ల పాటు వన్డేల్లో నంబర్వన్ బ్యాటర్గా కొనసాగాడు. ఇటీవల శుభ్మన్ గిల్ ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక 2019లో సర్ఫరాజ్ అహ్మద్ స్థానంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో అతను పాక్ జట్టు కెప్టెన్గా నియమితుడయ్యాడు. 2021లో టెస్టు సారథ్యమూ స్వీకరించాడు. అతని కెప్టెన్సీలో టెస్టుల్లో 20కి గాను పాక్ 10 గెలిచింది. ఆరు ఓడింది. మరో నాలుగు డ్రా అయ్యాయి. కెప్టెన్గా 43 వన్డేల్లో 26 విజయాలు అందుకున్నాడు. 16 ఓటములు చూశాడు. ఓ మ్యాచ్ ఫలితం తేలలేదు. టీ20ల్లో అయితే అతని కెప్టెన్సీ రికార్డు మరింత గొప్పగా ఉంది. 71 మ్యాచ్ల్లో 42 విజయాలు, 23 ఓటములున్నాయి. ఆరు మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. టీ20ల్లో అత్యంత విజయవంతమైన సారథిగా అతనున్నాడు. అతని కెప్టెన్సీలో 2022 టీ20 ప్రపంచకప్లో పాక్ ఫైనల్ చేరింది. 2021లో సెమీస్ వరకూ వెళ్లింది. ఆసియా కప్ ఫైనల్ చేరింది. వన్డేల్లో నంబర్వన్ ర్యాంకు అందుకుంది. అతని సారథ్యంలోనే పాక్ తొలిసారి ప్రపంచకప్లో భారత్ను ఓడించింది.
ఇప్పుడిలా..
ఆటతో, నాయకత్వంతో ఉత్తమ ప్రదర్శన చేస్తూ సాగుతున్న బాబర్కు ఈ ప్రపంచకప్ సవాలు విసిరింది. ఇందులో జట్టును నడిపించడంలో అతను విఫలమయ్యాడు. మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. ప్రత్యర్థి జట్లను కట్టడి చేయలేక చేతులెత్తేశాడు. సమర్థవంతంగా వ్యూహాలు అమలు చేయలేకపోయాడు. బౌలింగ్ మార్పు, ఫీల్డింగ్ కూర్పులోనూ ఆకట్టుకోలేదు. వికెట్లు రాక, పరుగులు పోతుంటే ఏం చేయలో తెలియని నిస్సహాయ స్థితిలో సహచర ఆటగాళ్లపై అరుస్తూ కనిపించాడు. వ్యక్తిగతంగానూ 9 మ్యాచ్ల్లో 320 పరుగులే చేసి నిరాశపరిచాడు. చివరకు 9 మ్యాచ్ల్లో కేవలం నాలుగు గెలిచి, అయిదింట్లో ఓడి పట్టికలో అయిదో స్థానంతో పాక్ సెమీస్కు దూరమైంది. అందులోనూ అఫ్గానిస్థాన్ చేతిలో ఓటమి బాబర్ను మరింత దెబ్బతీసింది. దీంతో అతను కెప్టెన్గా తప్పుకోవాలని మాజీలు డిమాండ్ చేశారు. నాలుగేళ్లలో కెప్టెన్గా ఏం నేర్చుకోలేదంటూ తప్పుబట్టారు. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అండగా నిలవలేదు. ప్రపంచకప్ వైఫల్యంపై నివేదిక ఇవ్వాలని కోరింది. బాబర్ తప్పుకోవడం తప్ప మరో మార్గం లేదన్నట్లుగా వ్యవహరించింది. ఇక ఇమాముల్ హక్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, హారిస్ రవూఫ్ లాంటి ఆటగాళ్ల ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉన్నా జట్టులో కొనసాగేలా బాబర్ పక్షపాతం చూపించారనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో పూర్తిగా కెప్టెన్సీకే బాబర్ గుడ్బై చెప్పేశాడు. టెస్టుల్లో కొనసాగాలని బోర్డు కోరినా అతను వినలేదని తెలిపింది. అయితే ఆటగాడిగా మాత్రం జట్టులో కొనసాగుతానని చెప్పాడు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
DM చేస్తేనే స్టోరీ.. షేక్ చేస్తే ఫొటో.. ఇన్స్టాలో 4 కొత్త ఫీచర్లు
-
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం.. కరీంనగర్లో కూలిన టెంట్లు
-
వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం.. యూనివర్సిటీలో కలకలం
-
ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక
-
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
-
నష్టాల్లో సూచీలు.. 383 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్