IPL 2023: ఐపీఎల్ ప్లేఆఫ్స్.. మూడు బెర్తులు.. నాలుగు టీమ్ల నుంచి తీవ్ర పోటీ!
ఐపీఎల్ 2023 సీజన్లో (IPL 2023) చివరి మ్యాచ్ ముగిసే వరకూ ప్లేఆఫ్స్ రేసు తేలేలా లేదు. తొలి స్థానం మినహా.. మిగతా వాటి కోసం ఏడు జట్లు పోటీ పడుతున్నప్పటికీ.. మరీ ముఖ్యంగా నాలుగు టీమ్లే ముందు వరుసులో ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో (IPL 2023) ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠగా సాగుతోంది. గుజరాత్ ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం సాంకేతికంగా ఏడు టీమ్లు రేసులో ఉన్నాయి. వీటిల్లో చెన్నై సూపర్ కింగ్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ ముందంజలోఉన్నాయి.
* ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ (18 పాయింట్లు) అగ్రస్థానంతో ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకున్న తొలి జట్టుగా అవతరించింది. తన చివరి మ్యాచ్లో బెంగళూరుతో తలపడాల్సి ఉంది. ఇందులో ఓడినా గుజరాత్ మొదటి స్థానానికి వచ్చిన నష్టమేం లేదు.
* చెన్నై సూపర్ కింగ్స్ (15 పాయింట్లు) కూడా తన చివరి మ్యాచ్లో దిల్లీని ఓడిస్తే రెండో స్థానంతో ప్లేఆఫ్స్లోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. మంచి నెట్రన్రేట్తో గెలిస్తే ఎటువంటి సమస్యా ఉండదు. అప్పుడు క్వాలిఫయర్స్లో ఆడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధార పడి ఉంటుంది.
* ప్రస్తుతం లఖ్నవూ సూపర్ జెయింట్స్ 15 పాయింట్లతో చెన్నై కంటే తక్కువ నెట్రన్రేట్తో మూడో స్థానంలో కొనసాగుతోంది. లఖ్నవూ తన ఆఖరి మ్యాచ్ను కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది. ఇందులో విజయం సాధిస్తే 17 పాయింట్లతో లఖ్నవూ ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. రన్రేట్ బాగుంటే రెండులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు తొలి క్వాలిఫయర్లో తన సోదరుడితోనే (గుజరాత్ టైటాన్స్) తలపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ రన్రేట్ తగ్గినా మూడో స్థానం మాత్రం ఖాయమవుతుంది.
* ముంబయి ఇండియన్స్ (14 పాయింట్లు) కూడా తన చివరి మ్యాచ్లో హైదరాబాద్ను ఓడించినా ప్లేఆఫ్స్లోకి వెళ్తుందని కచ్చితంగా చెప్పలేం. అప్పుడు ముంబయి 16 పాయింట్లతో లీగ్ స్టేజ్ను ముగిస్తుంది. దీనికి కారణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఒకవేళ నేడు హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో ఆర్సీబీ ఓడితే మాత్రం ముంబయిదే నాలుగోప్లేఆఫ్స్ బెర్తు. నేడు ఎస్ఆర్హెచ్ మీద బెంగళూరు గెలిచి.. తన చివరి మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓడిపోతే మాత్రం ప్లేఆఫ్స్ మరింత ఆసక్తికరంగా మారుతుంది. మరోవైపు ముంబయి కూడా తన ఆఖరి మ్యాచ్లో ఓడితే నెట్రన్రేట్ కీలకంకానుంది. రాజస్థాన్ (12 పాయింట్లు), పంజాబ్ (12 పాయింట్లు), కోల్కతా (12 పాయింట్లు) కూడా తమ చివరి మ్యాచుల్లో గెలిచి.. ఇతర జట్లు ఓడిపోతేనే ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తాయి. కానీ, అలాంటి ఛాన్స్లు చాలా తక్కువే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ