IPL 2023: ఐపీఎల్ ప్లేఆఫ్స్.. మూడు బెర్తులు.. నాలుగు టీమ్ల నుంచి తీవ్ర పోటీ!
ఐపీఎల్ 2023 సీజన్లో (IPL 2023) చివరి మ్యాచ్ ముగిసే వరకూ ప్లేఆఫ్స్ రేసు తేలేలా లేదు. తొలి స్థానం మినహా.. మిగతా వాటి కోసం ఏడు జట్లు పోటీ పడుతున్నప్పటికీ.. మరీ ముఖ్యంగా నాలుగు టీమ్లే ముందు వరుసులో ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో (IPL 2023) ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠగా సాగుతోంది. గుజరాత్ ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం సాంకేతికంగా ఏడు టీమ్లు రేసులో ఉన్నాయి. వీటిల్లో చెన్నై సూపర్ కింగ్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ ముందంజలోఉన్నాయి.
* ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ (18 పాయింట్లు) అగ్రస్థానంతో ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకున్న తొలి జట్టుగా అవతరించింది. తన చివరి మ్యాచ్లో బెంగళూరుతో తలపడాల్సి ఉంది. ఇందులో ఓడినా గుజరాత్ మొదటి స్థానానికి వచ్చిన నష్టమేం లేదు.
* చెన్నై సూపర్ కింగ్స్ (15 పాయింట్లు) కూడా తన చివరి మ్యాచ్లో దిల్లీని ఓడిస్తే రెండో స్థానంతో ప్లేఆఫ్స్లోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. మంచి నెట్రన్రేట్తో గెలిస్తే ఎటువంటి సమస్యా ఉండదు. అప్పుడు క్వాలిఫయర్స్లో ఆడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధార పడి ఉంటుంది.
* ప్రస్తుతం లఖ్నవూ సూపర్ జెయింట్స్ 15 పాయింట్లతో చెన్నై కంటే తక్కువ నెట్రన్రేట్తో మూడో స్థానంలో కొనసాగుతోంది. లఖ్నవూ తన ఆఖరి మ్యాచ్ను కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది. ఇందులో విజయం సాధిస్తే 17 పాయింట్లతో లఖ్నవూ ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. రన్రేట్ బాగుంటే రెండులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు తొలి క్వాలిఫయర్లో తన సోదరుడితోనే (గుజరాత్ టైటాన్స్) తలపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ రన్రేట్ తగ్గినా మూడో స్థానం మాత్రం ఖాయమవుతుంది.
* ముంబయి ఇండియన్స్ (14 పాయింట్లు) కూడా తన చివరి మ్యాచ్లో హైదరాబాద్ను ఓడించినా ప్లేఆఫ్స్లోకి వెళ్తుందని కచ్చితంగా చెప్పలేం. అప్పుడు ముంబయి 16 పాయింట్లతో లీగ్ స్టేజ్ను ముగిస్తుంది. దీనికి కారణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఒకవేళ నేడు హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో ఆర్సీబీ ఓడితే మాత్రం ముంబయిదే నాలుగోప్లేఆఫ్స్ బెర్తు. నేడు ఎస్ఆర్హెచ్ మీద బెంగళూరు గెలిచి.. తన చివరి మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓడిపోతే మాత్రం ప్లేఆఫ్స్ మరింత ఆసక్తికరంగా మారుతుంది. మరోవైపు ముంబయి కూడా తన ఆఖరి మ్యాచ్లో ఓడితే నెట్రన్రేట్ కీలకంకానుంది. రాజస్థాన్ (12 పాయింట్లు), పంజాబ్ (12 పాయింట్లు), కోల్కతా (12 పాయింట్లు) కూడా తమ చివరి మ్యాచుల్లో గెలిచి.. ఇతర జట్లు ఓడిపోతేనే ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తాయి. కానీ, అలాంటి ఛాన్స్లు చాలా తక్కువే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!