ODI WC 2023: బంగ్లాదేశ్ టెక్నికల్ కన్సల్టెంట్గా శ్రీధరన్ శ్రీరామ్.. వరల్డ్ కప్ నుంచి నోకియా ఔట్!
ప్రపంచ కప్ (ODi World Cup 2023) కోసం జట్లన్నీ సిద్ధమవుతున్నాయి. బంగ్లాదేశ్ తన జట్టుకు ప్రత్యేకంగా టెక్నికల్ కన్సల్టెంట్ను నియమించుకుంది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టుకు గాయాల బెడద తప్పలేదు. ఇద్దరు కీలక పేసర్లు గాయాలతో దూరమయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ సందర్భంగా బంగ్లాదేశ్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్ను తమ జట్టుకు టెక్నికల్ కన్సల్టెంట్గా నియమించుకుంది. గతంలో బంగ్లాకు టీ20 ప్రధాన కోచ్గా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం అతడికుంది. ఈ మేరకు బంగ్లా క్రికెట్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘శ్రీరామ్ను మా జట్టుకు టెక్నికల్ కన్సల్టెంట్గా నియమించుకున్నాం. వరల్డ్ కప్లో అతడి సేవలను ఉపయోగించుకుంటాం’’ అని బంగ్లాదేశ్ బోర్డు డైరెక్టర్ ఖలీద్ మహమ్మద్ వెల్లడించారు. గతేడాది టీ20 ప్రపంచకప్ ముందు కూడా ఆ దేశం శ్రీరామ్ను ఇదే పదవిలో నియమించుకుంది.
దక్షిణాఫ్రికాకు ఎదురు దెబ్బ
వన్డే ప్రపంచ కప్ ముంగిట దక్షిణాఫ్రికా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులో కీలక పేసర్లు ఆన్రిచ్ నోకియా, సిసిందా మగల గాయాల కారణంగా ప్రపంచకప్నకు దూరమయ్యారు. ఈ మేరకు దక్షిణాఫ్రికా వన్డే టీమ్ ప్రధాన కోచ్ రాబ్ వాల్తెర్ తెలిపారు. వీరిద్దరి స్థానంలో ఆడిల్ పెహ్లూక్వాయో, లీజాద్ విలియమ్స్ను రిప్లేస్ చేస్తున్నట్లు వెల్లడించారు. ‘‘కీలకమైన పేసర్లు లేకపోవడం మమ్మల్ని తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోంది. వారిద్దరూ నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు. అయితే, త్వరగా కోలుకుని జట్టులోకి రావాలని కోరుకుంటున్నా. పెహ్లూక్వాయో, లీజాద్కు అవకాశం కల్పించాం’ అని రాబ్ వ్యాఖ్యానించాడు.
పాకిస్థాన్కు అవకాశాలు తక్కువే: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్
వచ్చే వరల్డ్ కప్లో విజేతగా నిలిచే అవకాశాలు పాకిస్థాన్కు తక్కువగా ఉన్నాయని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు డొమినిక్ కార్క్ వ్యాఖ్యానించాడు. భారత్లా పూర్తిస్థాయి జట్టుతో పాక్ బరిలోకి దిగలేకపోతోందని పేర్కొన్నాడు. ‘‘ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్లను చూశాం. పాక్ క్రికెట్ లీగ్తో ఆ జట్టు బలంగానే తయారైనట్లు అనిపించింది. అయితే, కీలకమైన సమయంలో భారత్ ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఫైనల్లో లంకను 50 పరుగులకే ఆలౌట్ చేసింది. మరోవైపు పాక్ మాత్రం సూపర్ -4 స్టేజ్కే పరిమితమైంది. భారత్ స్పిన్, పేస్, బ్యాటింగ్.. ఇలా అన్ని విభాగాల్లో బలంగా ఉంది. కానీ, పాకిస్థాన్ మాత్రం అలా ఉన్నట్లు కనిపించలేదు. అందుకే, వచ్చే ప్రపంచ కప్లోనూ పాక్కు అవకాశాలు తక్కువగానే ఉన్నాయి’’ అని కార్క్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
166.. 58 బంతుల్లో ఉఫ్
47 నిమిషాలు.. 58 బంతులు.. 167 పరుగులు.. 0 వికెట్లు! బుధవారం ఉప్పల్ స్టేడియంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసమిది. ఇన్నింగ్స్ విరామంలో అభిమానులు స్నాక్స్ తెచ్చుకునేలోపే.. టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్ తీసుకునేలోపే సన్రైజర్స్ లక్ష్య ఛేదన పూర్తయింది. -
ముంబయి తప్ప..
ఐపీఎల్-17 లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. లఖ్నవూపై సన్రైజర్స్ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సంగీతం వింటూ.. సిరీస్లు చూస్తూ
ఒలింపిక్స్ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు. -
మూడేళ్లలో తొలిసారి..
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడనున్నాడు. భువనేశ్వర్లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్ కప్లో అతడు ఆడనున్నాడు. -
ఓడలో ఫ్రాన్స్కు ఒలింపిక్ జ్యోతి
1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది. -
నా రికార్డులను జైస్వాల్ బద్దలు కొడతాడు
టీమ్ఇండియా యువ ఓపెనర్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించే యశస్వి జైస్వాల్కు గొప్ప భవిష్యత్తు ఉందని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా కొనియాడాడు. -
శాంసన్.. మాస్టర్ బ్లాస్టర్!
ఈ ఐపీఎల్లో భీకర ఫామ్తో సాగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతణ్ని మాస్టర్బ్లాస్టర్గా అభివర్ణించాడు. -
అమన్పై ఆశలు
ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్ గురువారం ఆరంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల కోసం ఇదే చివరి అర్హత ఈవెంట్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్లలో అమన్ శెరావత్, దీపక్ పునియాలపై పెద్ద ఆశలే ఉన్నాయి. -
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. -
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. -
నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్పై బ్రియాన్ లారా అభినందనల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులను కొల్లగొడతాడని పేర్కొన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్