Cricket News: అభిమానికి షకిబ్ చెంపదెబ్బ.. ఇంగ్లాండ్ చెఫ్ను తెచ్చుకోనుండటంపై సెహ్వాగ్ కామెంట్!
ఇంటర్నెట్ డెస్క్: మైదానంలో దూకుడుగా ఉండే బంగ్లా కెప్టెన్ షకిబ్.. బయటా అదే విధంగా ప్రవర్తించడం అభిమానులను షాక్కు గురి చేసింది. భారత్ పర్యటనకు వస్తున్న ఇంగ్లాండ్ ప్రత్యేకంగా చెఫ్ను తెచ్చుకోనుండటంపై సెహ్వాగ్ సరదా కామెంట్.. హిందీ పాటకు క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ డ్యాన్స్.. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..
బంగ్లా ఎన్నికల సమయంలోనూ షకిబ్ అనుచిత ప్రవర్తన
బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ మరోసారి విమర్శలపాలయ్యాడు. మైదానంలో ఆవేశంగా ఉండే అతడు.. తాజాగా ఆ దేశ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగానూ ఓ అభిమానిని చెంప దెబ్బ కొట్టాడు. ఆ వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. తన ఓటును వినియోగించుకోవడానికి షకిబ్ పోలింగ్ బూత్ వద్దకు వెళ్లిన సమయంలో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో షకిబ్పై ఓ అభిమాని పడటంతో.. ఈ సీనియర్ క్రికెటర్ ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే అతడి చెంపను చెళ్లుమనిపించాడు.
ఐపీఎల్లో ఇంగ్లాండ్కు అవసరం లేదు: సెహ్వాగ్
టీమ్ఇండియా పర్యటనకు వచ్చే ఇంగ్లాండ్ జట్టు తమతోపాటు ప్రత్యేకంగా వంట చేసే వ్యక్తిని తీసుకు వస్తుందనే వార్తలపై ఇప్పటికే ఆకాశ్ చోప్రా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ కూడా సరదాగా కామెంట్ చేశాడు. ‘‘కుక్ వెళ్లి పోవడంతో ఇంగ్లాండ్కు అవసరం పడింది. ఐపీఎల్లో మాత్రం అవసరం ఉండకపోవచ్చు’’ అని ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ అలెస్టర్ కుక్ లేకపోవడాన్ని ఉదహరిస్తూ సెహ్వాగ్ పోస్టు పెట్టాడు. నెలరోజులపాటు సాగే పర్యటనలో ఆటగాళ్ల ఆరోగ్యం దృష్ట్యా ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
కపిల్ దేవ్ సూపర్ డ్యాన్స్.. వీడియో వైరల్
క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ భారత్కు తొలి వన్డే ప్రపంచకప్ అందించిన కెప్టెన్. అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టిన కపిల్.. అద్భుతంగా డ్యాన్స్ చేస్తారన్న విషయం అభిమానులకు తెలిసేలా ప్రసారమైన వీడియో వైరల్గా మారింది. రెండు రోజుల కిందట తన 65వ పుట్టిన రోజును కపిల్ దేవ్ జరుపుకొన్న సంగతి తెలిసిందే. గతంలో తన సతీమణితో కలిసి హిందీ పాటకు కపిల్ దేవ్ కాలు కదిపిన వీడియోను తాజాగా ఓ అభిమాని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం