BAN vs NZ: అప్పుడు ‘టైమ్డ్ ఔట్’ కలిసొచ్చింది.. ఇప్పుడు ‘హ్యాడ్లింగ్ ది బాల్’ కావాలని చేసింది కాదు: హసన్
‘ఫీల్డింగ్కు విఘాతం’ కలిగించి బంగ్లా సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ ఔటైన సంగతి తెలిసిందే. ఆ జట్టు తరఫున ఇలా పెవిలియన్కు చేరిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్లో (ODI World Cup 2023) శ్రీలంక సీనియర్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్’ గుర్తుంది కదా.. తాజాగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో (BAN vs NZ) మరో అరుదైన ఔట్ నమోదైంది. బంగ్లా ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ ‘హ్యాడ్లింగ్ ది బాల్’ కారణంగా పెవిలియన్కు చేరాడు. బంగ్లా క్రికెట్ చరిత్రలో ఇలా ఔటైన తొలి ఆటగాడు ముష్ఫికర్. అయితే, తమ సీనియర్ ఆటగాడు ముందుగా అనుకొని బంతిని అడ్డుకోలేదని బంగ్లా స్పిన్నర్ మెహిదీ హసన్ పేర్కొన్నాడు. అప్పట్లో అరుదైన ‘టైమ్డ్ ఔట్’ నిర్ణయం తమకు కలిసొచ్చిందని.. తాజా ఘటనలో మాత్రం తాము వికెట్ను కోల్పోయినట్లు పేర్కొన్నాడు.
‘‘ముష్ఫికర్ కావాలని బంతిని అడ్డుకోలేదు. బ్యాటింగ్ చేసే క్రమంలో అనుకోకుండా చేతితో బంతిని ఆపాడు. ఉద్దేశపూర్వకంగా ఇలా ఔట్ కావాలని ఎవరూ అనుకోరు. మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పలు అంశాలను దృష్టిలోపెట్టుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా బంతిని ఎదుర్కొన్న తర్వాత అది స్టంప్స్ మీదకు వస్తుందేమోనని భయపడ్డాడు. అలాంటి సమయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలి. అయితే, చేతితో బంతిని నెట్టి ఔట్ కావాలని అతడేమీ అనుకోలేదు. అప్పటికప్పుడు అలా జరిగిపోయింది. వరల్డ్ కప్లో శ్రీలంక బ్యాటర్ ‘టైమ్డ్ ఔట్’ విషయంలో మాకు అనుకూలంగా నిర్ణయం వచ్చింది. కానీ, ఈసారి అలా జరగలేదు’’ అని మెహిదీ వ్యాఖ్యానించాడు.
పిచ్ పరిస్థితి మాకు తెలుసు..
‘‘మేం సరైన ప్రదేశంలో బంతిని విసిరితే న్యూజిలాండ్ బ్యాటర్లు ఇబ్బంది పడతారని తెలుసు. బ్యాటింగ్ సమయంలో వారి స్పిన్నర్లను ఎదుర్కోవడం చాలా కష్టంగా మారింది. ఇక్కడి పిచ్ పరిస్థితులపై మాకు పూర్తి అవగాహన ఉంది. పిచ్ నుంచి సహకారం లభిస్తుండటంతో త్వరగా వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించాం. అందులో ఇప్పటికే సగం విజయవంతమయ్యాం’’ అని మెహిదీ వెల్లడించాడు. కివీస్ కోల్పోయిన ఐదు వికెట్లలో మెహిదీ మూడు, మరో స్పిన్నర్ తైజుల్ ఇస్లాం రెండు తీశారు.
న్యూజిలాండ్-బంగ్లాదేశ్ రెండో టెస్టు (BAN vs NZ) తొలి రోజే 15 వికెట్లు పడ్డాయి. అందులో 13 వికెట్లను స్పిన్నర్లే పడగొట్టారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 55/5 స్కోరుతో కొనసాగుతోంది. అంతకుముందు బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకే ఆలౌటైంది. వర్షం కారణంగా రెండో రోజు ఆట ఇంకా ప్రారంభం కాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!