ODI World Cup 2023: మరో సెంచరీ మిస్... ‘100’ అందుకోలేకపోతున్నారు!
ప్రపంచకప్ (ODI World Cup 2023) లాంటి మెగా టోర్నీలో సెంచరీ చేసినా.. అయిదు వికెట్లు తీసినా దాని విలువే వేరు. తాజా ప్రపంచకప్లో బ్యాటర్లు సెంచరీ ముంగిట తడబడుతున్నారు. కొద్దిలో శతకాన్ని కోల్పోయి నిరుత్సాహంగా వెనుదిరుతున్నారు.
క్రికెట్లో ఓ బ్యాటర్ అద్భుతంగా రాణించాడని చెప్పడానికి సెంచరీ ఓ ప్రామాణికం. బౌలర్ అదరగొట్టాడని తెలుసుకోవడానికి అయిదు వికెట్ల ప్రదర్శన ఓ రుజువు. అయితే ప్రపంచకప్ (ODI World Cup 2023) లాంటి మెగా టోర్నీలో సెంచరీ చేసినా.. అయిదు వికెట్లు తీసినా దాని విలువే వేరు. తాజా ప్రపంచకప్లో బ్యాటర్లు సెంచరీ ముంగిట తడబడుతున్నారు. కొద్దిలో శతకాన్ని కోల్పోయి నిరుత్సాహంగా వెనుదిరుతున్నారు. ఇందులో భారత బ్యాటర్లే ముందు వరుసలో ఉన్నారు. విరాట్ కోహ్లి (Virat Kohli) మూడుసార్లు, రోహిత్శర్మ (Rohit Sharma) మూడుసార్లు సెంచరీ ముంగిట ఔటై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. తాజాగా ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ మ్యాచ్లో డేవిడ్ మలన్ (87) సెంచరీ మిస్ చేసుకున్నాడు.
కోహ్లి తడబాటు
ఛేదనలో సెంచరీ చేయడంలో కోహ్లి మొనగాడు. అతడు సాధించిన శతకాల్లో ఛేజింగ్లో చేసినవే ఎక్కువ. అలాంటిది ఈ ప్రపంచకప్లో ఛేజింగ్లో రెండుసార్లు మూడంకెలు అందుకోలేకపోయాడు విరాట్. మొత్తం మీద మూడుసార్లు 100 మార్కు దాటడంతో విఫలమయ్యాడు. కచ్చితంగా శతకం బాదుతాడు అనుకున్న సందర్భంలోనూ అభిమానులను నిరాశపరిచాడు. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్లో ఛేదనలో విరాట్ 85 పరుగుల ఇన్నింగ్స్తో అబ్బురపరిచాడు. ఇక శతకం బాదడమే తరువాయి అనుకునేలోపు పెవిలియన్ చేరిపోయాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్తో పోరులో 103 పరుగులతో నాటౌట్గా నిలిచి చాలారోజుల తర్వాత ప్రపంచకప్ సెంచరీ సాధించాడు కింగ్.
అతడాడిన మూడు ప్రపంచకప్పుల్లో ఇది మూడో సెంచరీ మాత్రమే. అయితే ఈ ఒక్క ప్రపంచకప్లోనే మరో మూడు శతకాలు చేసే అవకాశాన్ని విరాట్ కోల్పోయాడు. న్యూజిలాండ్తో పోరులో వీరోచిత ఇన్నింగ్స్ విరాట్ 95 పరుగుల వద్ద ఒత్తిడికి గురై ఓ చెత్త షాట్తో వెనుదిరిగాడు. సెంచరీకి అతి సమీపంగా వచ్చిన ఇన్నింగ్స్ ఇది. సిక్స్తో మ్యాచ్ను ముగించాలన్న అతడి దృక్పథం శతకం కాకుండా అడ్డుకుంది. ఇక శ్రీలంకతో మ్యాచ్లో మొదట బ్యాటింగ్.. అప్పటికే భారత్ మంచి స్థితిలో ఉంది. అయినా కూడా ఓ అనసవరమైన షాట్తో వికెట్ ఇచ్చుకున్నాడు విరాట్. అభిమానులను బాగా నిరాశపరిచాడు. ఓ సాధారణ చెకింగ్ షాట్తో వికెట్ చేజార్చుకున్నాడు.
రోహిత్ కూడా
రోహిత్ది కూడా కోహ్లి లాంటి పరిస్థితే. అతడి ఆట కూడా అచ్చం విరాట్ మాదిరే సాగుతోంది. ఈ టోర్నమెంట్లో అద్భుత ఇన్నింగ్స్లతో అలరించిన ఈ స్టార్ ఓపెనర్.. మూడుసార్లు శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్లో గొప్పగా ఆడి ఇన్నింగ్స్కు పునాది వేసిన రోహిత్.. 81 పరుగుల వద్ద ఔటయ్యాడు. తర్వాత అఫ్గానిస్థాన్పై 131 పరుగులు చేసి ఈసారి టోర్నీలో తొలి సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఆ తర్వాత రెండుసార్లు శతకం చేసే ఛాన్స్ చేజార్చుకున్నాడు రోహిత్. పాకిస్థాన్పై సూపర్ ఇన్నింగ్స్ ఆడినా 86 పరుగుల వద్ద వెనుదిరిగిన ఈ ఓపెనర్.. ఇంగ్లాండ్పైనా ఓ అద్భుతమైన ఇన్నింగ్స్ను 87 పరుగుల వద్దే ముగించాడు. రోహిత్, కోహ్లితో పాటు మరో స్టార్ కేఎల్ రాహుల్ (97 నాటౌట్) కూడా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నాడు. సెంచరీ చేసే ఛాన్స్ ఉన్నా.. సిక్స్కు బదులు ఫోర్ వెళ్లడంతో ఉసూరుమన్నాడు. భారత యువ బ్యాటర్లు శుభ్మన్ గిల్ (92), శ్రేయస్ అయ్యర్ (82) కూడా సెంచరీ ముంగిట ఔటయ్యారు.
వేరే జట్లలోనూ
భారత బ్యాటర్లు మాత్రమే కాదు పాకిస్థాన్తో మ్యాచ్లో కేన్ విలియమ్సన్ (95) త్రుటిలో మూడంకెల స్కోరు అందుకోలేకపోయాడు. గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన అతడు గొప్పగా ఆడినా ఈ విషయంలో బోల్తా పడ్డాడు. మార్క్రమ్ (91 పరుగులు, పాకిస్థాన్పై), వార్నర్ (81, కివీస్పై), క్లాసెన్ (90, బంగ్లాదేశ్), రచిన్ రవీంద్ర (97, పాకిస్థాన్పై) శతకాలు చేజార్చుకున్న బ్యాటర్ల జాబితాలో ఉన్నారు. ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ బ్యాటర్లు షకీబ్ అల్ హసన్ (82), నజ్ముల్ శాంటో (90) కూడా శతకాలను చేజార్చుకున్నారు. కొసమెరుపు ఏంటంటే దక్షిణాఫ్రికా స్టార్ క్వింటన్ డికాక్ అందరికంటే భిన్నం. ఈ టోర్నీలో 50 దాటిన ప్రతిసారీ ఈ ఓపెనర్ సెంచరీ బాదేశాడు. ఏకంగా 4 శతకాలు ఖాతాలో వేసుకున్నాడు.
కొన్ని 80లు 100 కంటే ఎక్కువ అంటారు క్రికెట్లో.. ఇప్పుడు అభిమానులు కూడా భారత ఆటగాళ్లు సెంచరీలు మిస్ అయిన ప్రతిసారి సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులే పెడుతున్నారు. కొంతమంది మాత్రం మ్యాచ్లు గెలిస్తే చాలు.. శతకాలు అవసరం లేదని అంటున్నారు. అయితే 80, 90ల్లో ఔటైతే నిజానికి బ్యాటర్కే కాదు అభిమానులకు కూడా ఏదో వెలితి. అంత దూరం వచ్చి ఈ మైలురాయిని దాటలేదే అనే అసంతృప్తి. అందులోనూ ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో సెంచరీలు చేసే అవకాశం ప్రతిసారీ రాదు. ముఖ్యంగా కెరీర్ చరమాంకంలో ఉన్న కోహ్లి, రోహిత్కు ఈ టోర్నీయే సువర్ణావకాశం. మున్ముందు మ్యాచ్ల్లో ఈ స్టార్లు 80లను 100లుగా మారుస్తారో లేదో చూడాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు