BCCI: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌.. తొలి రెండు మ్యాచ్‌లకు జట్టును ప్రకటించిన బీసీసీఐ

ఇంగ్లాండ్‌తో ఈ నెల 25 నుంచి జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు బీసీసీఐ జట్టును ప్రకటించింది.  

Updated : 21 Jan 2024 15:04 IST

ముంబయి: ఇంగ్లాండ్‌తో ఈనెల 25 నుంచి స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ జరగనుంది. తొలి రెండు టెస్టులకు సంబంధించి బీసీసీఐ తాజాగా ఆటగాళ్లను ప్రకటించింది. హైదరాబాద్‌ వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది. రోహిత్‌ శర్మ జట్టుకు నేతృత్వం వహించనున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌కు తొలిసారి టెస్టు జట్టులో స్థానం దక్కింది. ఈ జట్టులో ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానె, ఇషాన్‌ కిషన్‌కు చోటు దక్కలేదు.  

భారత జట్టు:  రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), జస్ప్రీత్‌ బుమ్రా(వైస్‌ కెప్టెన్‌) శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌(వికెట్‌ కీపర్‌), కేఎస్‌ భరత్‌(వికెట్‌ కీపర్‌), ధ్రువ్‌ జురెల్‌(వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహమ్మద్‌ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని