BCCI: వీడిన ఉత్కంఠ.. భారత ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగింపు
భారత్ ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ను (Rahul Dravid) కొనసాగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎట్టకేలకు భారత క్రికెట్ (Team India) జట్టు ప్రధాన కోచ్ పదవిపై ఉత్కంఠ వీడింది. ప్రధాన కోచ్గా కొనసాగేందుకు రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) అంగీకరించాడు. దీంతో బీసీసీఐ అధికారిక ప్రకటన జారీ చేసింది. రాహుల్తోపాటు ఇప్పటికే ఉన్న సహాయక సిబ్బంది పదవీకాలాన్ని కూడా బీసీసీఐ పొడిగించింది. దీని ప్రకారం బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్కు పొడిగింపు లభించినట్లైంది. అయితే, వీరు ఎప్పటి వరకు ఈ పదవిలో ఉంటారనేది మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్నాయి.
ద్రవిడ్ స్పందన ఇదీ..
‘‘టీమ్ఇండియాతో గత రెండేళ్ల ప్రయాణం ఎన్నో జ్ఞాపకాలను అందించింది. ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూశాం. మేనేజ్మెంట్తోపాటు జట్టు నుంచి ఎంతో సహకారం లభించింది. డ్రెస్సింగ్ రూంలో సృష్టించిన వాతావరణం పట్ల గర్వంగా ఉంది. జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. మేం సరైన దారిలోనే ఉన్నాం. మా సన్నద్ధతపై స్పష్టత ఉంది. నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు. నా విజన్ పట్ల విశ్వాసంతో మద్దతుగా నిలిచింది. వన్డే ప్రపంచకప్ ముందు జట్టుగా చాలా సవాళ్లను ఎదుర్కొన్నాం. వాటన్నింటిని తట్టుకుని నిలబడ్డాం. ఆ సమయంలోనూ బీసీసీఐ మద్దతును మరువలేం. జట్టు కోసం కొన్నిసార్లు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చేది. నా కోసం కుటుంబ సభ్యులు చాలా త్యాగాలు చేశారు. వారి మద్దతును ఎప్పుడూ మరిచిపోలేను’’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా కూడా రాహుల్ ద్రవిడ్కు శుభాకాంక్షలు తెలిపారు.
వన్డే ప్రపంచ కప్ తర్వాత కోచ్గా ద్రవిడ్ పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని అదే పదవిలో కొనసాగమని క్రికెట్ మాజీలు, బీసీసీఐ పెద్దలు కొంతకాలంగా అడుగుతూనే ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కార్ కూడా ఇదే కోరుకున్నారు. తొలుత విముఖత చూపిన ద్రవిడ్.. చివరికి అంగీకరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్