BCCI: ఐపీఎల్ మైదాన సిబ్బందికి బీసీసీఐ నజరానా
ఐపీఎల్-17 విజయవంతం కావడంలో తెర వెనుక పాత్ర పోషించిన మైదాన సిబ్బంది, క్యురేటర్లను బీసీసీఐ ప్రశంసించింది.
దిల్లీ: ఐపీఎల్-17 విజయవంతం కావడంలో తెర వెనుక పాత్ర పోషించిన మైదాన సిబ్బంది, క్యురేటర్లను బీసీసీఐ ప్రశంసించింది. వీరి సేవలకు గుర్తింపుగా ఒక్కో మైదానానికి రూ.25 లక్షల చొప్పున బహుమతిని ప్రకటించింది. ‘‘మైదాన సిబ్బంది నిరంతర శ్రమ ఫలితంగానే ఐపీఎల్ విజయవంతం అయింది. క్లిష్టమైన వాతావరణంలోనూ వాళ్లు గొప్ప పిచ్లను తయారు చేశారు. 10 రెగ్యులర్ మైదానాలకు రూ.25 లక్షల చొప్పున నజరానాగా ఇస్తున్నాం. అదనపు వేదికలుగా నిలిచిన మూడు మైదానాలకు రూ.10 లక్షల చొప్పున బహుమతి అందిస్తాం’’ అని బీసీసీఐ కార్యదర్శి జైషా చెప్పాడు. ముంబయి, దిల్లీ, చెన్నై, కోల్కతా, చండీగఢ్, హైదరబాద్, బెంగళూరు, లఖ్నవూ, అహ్మదాబాద్, జైపుర్ వేదికలు ఐపీఎల్-17లో రెగ్యులర్ మ్యాచ్లను నిర్వహించాయి. వీటికి తోడు విశాఖపట్నం, గువాహాటి, ధర్మశాలల్లో కొన్ని మ్యాచ్లు జరిగాయి. దిల్లీకి విశాఖ.. రాజస్థాన్కు గువాహాటి.. పంజాబ్కు ధర్మశాల రెండో సొంత వేదికలుగా నిలిచాయి.
ఆసీస్కు తొమ్మిదిమందే మిగిలారు!
సిడ్నీ: టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న ఆస్ట్రేలియా జట్టుపై ఐపీఎల్ ప్రభావం పడింది. వార్మప్ మ్యాచ్లు ఆడేందుకు ఆ జట్టుకు ఆటగాళ్ల కొరత వచ్చింది. ప్రస్తుతానికి తొమ్మిదిమందే జట్టులో ఉన్నారు. ఆదివారం ఐపీఎల్ ఫైనల్ ఆడిన కమిన్స్, ట్రావిస్ హెడ్ (హైదరాబాద్), మిచెల్ స్టార్క్ (కోల్కతా)తో పాటు మ్యాక్స్వెల్, కామెరూన్ గ్రీన్ (బెంగళూరు), స్టాయినిస్ (లఖ్నవూ) ఇంకా బార్బడోస్ చేరుకోలేదు. జూన్ 5న ఓమన్తో తొలి గ్రూప్ మ్యాచ్ నాటికల్లా వీళ్లు జట్టుతో కలిసే అవకాశం ఉంది. దీనికి తోడు గాయం నుంచి కోలుకుంటున్న కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ చేసే పరిస్థితుల్లో లేడు. ఈ నేపథ్యంలో కోచింగ్ సిబ్బంది బ్రాడ్ హాడ్జ్, ఆండ్రూ మెక్డొనాల్డ్, జార్జ్ బెయిలీ, ఆండ్రీ బోర్విచ్లను ఫీల్డింగ్ చేయడానికి జట్టులో చేర్చే అవకాశం ఉంది. మంగళవారం నమీబియా.. గురువారం వెస్టిండీస్తో ఆసీస్ వార్మప్ మ్యాచ్లు ఆడనుంది.
కోచ్ రేసులో ఎవరు?
దిల్లీ: బీసీసీఐ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేయడానికి సోమవారంతో గడువు ముగిసింది. ఈ పదవి కోసం చాలా రోజులుగా గౌతమ్ గంభీర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. గంభీర్ మెంటర్గా ఉన్న కోల్కతా నైట్రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో అతడిపై ఆసక్తి ఇంకా పెరిగింది. కానీ అతడు దరఖాస్తు చేశాడా లేదా అన్నది మాత్రం తెలియట్లేదు. బీసీసీఐ నుంచి గానీ, గంభీర్ నుంచి గానీ ఈ విషయంపై స్పందన లేదు. కానీ ప్రస్తుతానికి బీసీసీఐ ముందు అంతగా మెరుగైన ప్రత్యామ్నాయాలు లేవని తెలుస్తోంది. పేరున్న విదేశీయులెవరూ దరఖాస్తు చేసుకోలేదని కూడా అర్థమవుతోంది. ముఖ్యంగా కింది నుంచి ఎదిగి, దేశవాళీ క్రికెట్ వ్యవస్థపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి కోసం చూస్తున్నామని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేసిన నేపథ్యంలో విదేశీయుల నుంచి పెద్దగా స్పందన రాలేదని భావిస్తున్నారు. బీసీసీఐ ప్రధాన లక్ష్యం జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్ అని భావించవచ్చు. కానీ లక్ష్మణ్కు ఆసక్తి లేదని అనిపిస్తోంది.
అంకుషిత గెలుపు
బ్యాంకాక్: బాక్సింగ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్లో ప్రపంచ మాజీ యూత్ ఛాంపియన్ అంకుషిత బోరో శుభారంభం చేసింది. సోమవారం 60 కిలోల విభాగంలో ఏకపక్షంగా ముగిసిన మ్యాచ్లో భారత యువ బాక్సర్ అంకుషిత 4-1తో నమున్ మోంకోర్ (మంగోలియా)ను చిత్తు చేసింది. ప్రత్యర్థి బాక్సర్ దూకుడు ప్రదర్శించినా వ్యూహాత్మకంగా వ్యవహరించిన బోరో అదును చూసి నమున్పై పిడిగుద్దులు విసిరింది. మూడు రౌండ్ల పాటు ఆమెదే ఆధిపత్యం. మరో మ్యాచ్లో భారత బాక్సర్ అభిమన్యు (80 కిలోలు)కు నిరాశ ఎదురైంది. 0-5తో క్రిస్టియన్ నికోలోవ్ (బల్గేరియా) చేతిలో ఓటమిపాలయ్యాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?