BCCI Naman Awards: బీసీసీఐ ‘నమన్’ అవార్డ్స్... విజేతలు వీరే!
నమన్ అవార్డ్స్ పేరిట బీసీసీఐ పురస్కారాలను ప్రకటించింది. భారత మాజీ ఆల్రౌండర్, కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) కర్నల్ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.
హైదరాబాద్: నమన్ అవార్డ్స్ పేరిట బీసీసీఐ పురస్కారాలను ప్రకటించింది. భారత మాజీ ఆల్రౌండర్, కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) కర్నల్ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా అతడికి అవార్డు బహూకరించారు. భారత క్రికెట్కు ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును అందిస్తున్నారు. 1981 నుంచి 1992 మధ్య 80 టెస్టులు, 150 వన్డేలు ఆడిన శాస్త్రి కెరీర్లో ఎన్నో రికార్డులు నెలకొల్పారు. రిటైర్మెంట్ అనంతరం వ్యాఖ్యాతగా మారిన ఆయన 2014 నుంచి 2016 వరకు ఇండియా క్రికెట్ జట్టుకు డైరెక్టర్గా ఉన్నారు. ఆయనతోపాటు ఫరూక్ ఇంజనీర్ కూడా ఈ అవార్డు అందుకున్నారు.
అంతేకాకుండా 2022 - 23కుగానూ పాలీ ఉమ్రిగర్ ఉత్తమ క్రికెటర్గా శుభ్మన్ గిల్ నిలవగా, జస్ప్రీత్ బుమ్రా (2021 - 22), రవిచంద్రన్ అశ్విన్ (2020 - 21), మహ్మద్ షమీ (2019 - 20) గెలుచుకున్నారు. ఉత్తమ మహిళా క్రికెటర్గా 2020 - 21, 2021 - 22కిగానూ స్మృతి మందాన నిలిచింది. 2019 - 20, 2022 - 23 సంవత్సరాలకు దీప్తి శర్మ ఈ పురస్కారం అందుకుంది. వివిధ విభాగాల్లో పలువురు అవార్డులు గెలుచుకున్నారు.
బెస్ట్ అంపైర్ అవార్డు
పద్మనాభన్ (2019-20), వ్రిందా (2020-21), జయరామన్ మదన్ గోపాల్ (2021-22), రోహన్ పండిట్ (2022-23)
వన్డేల్లో అత్యధిక వికెట్లు (ఉమెన్)
పూనమ్ యాదవ్ (2019-20), జులన్ గోస్వామి (2020-21), రాజేశ్వరి గైక్వాడ్ (2021-22), దేవికా యాదవ్ (2022-23)
వన్డేల్లో అత్యధిక పరుగులు (ఉమెన్)
పూనమ్ రౌత్ (2019-20), మిథాలీ రాజ్ (2020-21), హర్మన్ ప్రీత్ కౌర్ (2021-22), రోడ్రిగ్స్ (2022-23)
దిలీప్ సర్దేశాయ్ అవార్డు
టెస్టుల్లో అత్యధిక వికెట్లు: రవిచంద్రన్ అశ్విన్ (2022-23)
టెస్టుల్లో అత్యధిక పరుగులు: యశస్వి జైస్వాల్ (2022-23)
బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూట్ (ఉమెన్)
ప్రియా పునియా (2019-20), షెఫాలీ వర్మ (2020- 21), సబ్బినేని మేఘన (2021-22), అమన్జోత్ కౌర్ (2022-23)
బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూట్ (మెన్)
మయాంక్ అగర్వాల్ (2019 - 2020), అక్షర్ పటేల్ (2020-21), శ్రేయస్ అయ్యర్ (2021-22), యశస్వి జైస్వాల్ ( 2022-23)
మాధవరావు సింధియా అవార్డు (రంజీ ట్రోఫీ)
అత్యధిక వికెట్లు: జయదేవ్ ఉనద్కత్ (2019-20), షామ్స్ ములానీ (2021-22), సక్సేనా (2022-23)
అత్యధిక పరుగులు: రాహుల్ దలాల్ (2019-20), సర్ఫరాజ్ ఖాన్ (2021-22), మయాంక్ అగర్వాల్ (2022-23)
లాలా అమర్నాథ్ అవార్డు
ఉత్తమ ఆల్ రౌండర్ (దేశవాళీ క్రికెట్) : బాబా అపరాజిత్ ( 2019-20), ఆర్ఆర్ ధావన్ ( 2020-21, 2021-22), రియాన్ పరాగ్ ( 2022-23)
ఉత్తమ ఆల్ రౌండర్ (రంజీ ట్రోఫీ): మురా సింగ్ (2019-20), శామ్స్ ములానీ (2021-22), శరాన్ష్ జైన్ (2022-23)
ఉత్తమ జట్టు (దేశవాళీ టోర్నమెంట్)
ముంబయి (2019-20), మధ్యప్రదేశ్ (2021-22), సౌరాష్ట్ర (2022-23)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!