BCCI Naman Awards: బీసీసీఐ ‘నమన్’ అవార్డ్స్... విజేతలు వీరే!
నమన్ అవార్డ్స్ పేరిట బీసీసీఐ పురస్కారాలను ప్రకటించింది. భారత మాజీ ఆల్రౌండర్, కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) కర్నల్ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.
హైదరాబాద్: నమన్ అవార్డ్స్ పేరిట బీసీసీఐ పురస్కారాలను ప్రకటించింది. భారత మాజీ ఆల్రౌండర్, కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) కర్నల్ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా అతడికి అవార్డు బహూకరించారు. భారత క్రికెట్కు ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును అందిస్తున్నారు. 1981 నుంచి 1992 మధ్య 80 టెస్టులు, 150 వన్డేలు ఆడిన శాస్త్రి కెరీర్లో ఎన్నో రికార్డులు నెలకొల్పారు. రిటైర్మెంట్ అనంతరం వ్యాఖ్యాతగా మారిన ఆయన 2014 నుంచి 2016 వరకు ఇండియా క్రికెట్ జట్టుకు డైరెక్టర్గా ఉన్నారు. ఆయనతోపాటు ఫరూక్ ఇంజనీర్ కూడా ఈ అవార్డు అందుకున్నారు.
అంతేకాకుండా 2022 - 23కుగానూ పాలీ ఉమ్రిగర్ ఉత్తమ క్రికెటర్గా శుభ్మన్ గిల్ నిలవగా, జస్ప్రీత్ బుమ్రా (2021 - 22), రవిచంద్రన్ అశ్విన్ (2020 - 21), మహ్మద్ షమీ (2019 - 20) గెలుచుకున్నారు. ఉత్తమ మహిళా క్రికెటర్గా 2020 - 21, 2021 - 22కిగానూ స్మృతి మందాన నిలిచింది. 2019 - 20, 2022 - 23 సంవత్సరాలకు దీప్తి శర్మ ఈ పురస్కారం అందుకుంది. వివిధ విభాగాల్లో పలువురు అవార్డులు గెలుచుకున్నారు.
బెస్ట్ అంపైర్ అవార్డు
పద్మనాభన్ (2019-20), వ్రిందా (2020-21), జయరామన్ మదన్ గోపాల్ (2021-22), రోహన్ పండిట్ (2022-23)
వన్డేల్లో అత్యధిక వికెట్లు (ఉమెన్)
పూనమ్ యాదవ్ (2019-20), జులన్ గోస్వామి (2020-21), రాజేశ్వరి గైక్వాడ్ (2021-22), దేవికా యాదవ్ (2022-23)
వన్డేల్లో అత్యధిక పరుగులు (ఉమెన్)
పూనమ్ రౌత్ (2019-20), మిథాలీ రాజ్ (2020-21), హర్మన్ ప్రీత్ కౌర్ (2021-22), రోడ్రిగ్స్ (2022-23)
దిలీప్ సర్దేశాయ్ అవార్డు
టెస్టుల్లో అత్యధిక వికెట్లు: రవిచంద్రన్ అశ్విన్ (2022-23)
టెస్టుల్లో అత్యధిక పరుగులు: యశస్వి జైస్వాల్ (2022-23)
బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూట్ (ఉమెన్)
ప్రియా పునియా (2019-20), షెఫాలీ వర్మ (2020- 21), సబ్బినేని మేఘన (2021-22), అమన్జోత్ కౌర్ (2022-23)
బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూట్ (మెన్)
మయాంక్ అగర్వాల్ (2019 - 2020), అక్షర్ పటేల్ (2020-21), శ్రేయస్ అయ్యర్ (2021-22), యశస్వి జైస్వాల్ ( 2022-23)
మాధవరావు సింధియా అవార్డు (రంజీ ట్రోఫీ)
అత్యధిక వికెట్లు: జయదేవ్ ఉనద్కత్ (2019-20), షామ్స్ ములానీ (2021-22), సక్సేనా (2022-23)
అత్యధిక పరుగులు: రాహుల్ దలాల్ (2019-20), సర్ఫరాజ్ ఖాన్ (2021-22), మయాంక్ అగర్వాల్ (2022-23)
లాలా అమర్నాథ్ అవార్డు
ఉత్తమ ఆల్ రౌండర్ (దేశవాళీ క్రికెట్) : బాబా అపరాజిత్ ( 2019-20), ఆర్ఆర్ ధావన్ ( 2020-21, 2021-22), రియాన్ పరాగ్ ( 2022-23)
ఉత్తమ ఆల్ రౌండర్ (రంజీ ట్రోఫీ): మురా సింగ్ (2019-20), శామ్స్ ములానీ (2021-22), శరాన్ష్ జైన్ (2022-23)
ఉత్తమ జట్టు (దేశవాళీ టోర్నమెంట్)
ముంబయి (2019-20), మధ్యప్రదేశ్ (2021-22), సౌరాష్ట్ర (2022-23)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్