ODI WC 2023: మినరల్ వాటర్ ఫ్రీ.. టీమ్ఇండియాకు ఆల్ ది బెస్ట్.. ఈసారి కూడా మాదే కప్!
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ (ODI WC 2023) సంగ్రామం మొదలైంది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి జైషా కీలక ప్రకటన వెల్లడించారు. అలాగే టీమ్ఇండియాకు ఆల్ది బెస్ట్ చెబుతూ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ ట్వీట్ చేశాడు. ఈసారి కూడా తమ జట్టే గెలుస్తుందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ వ్యాఖ్యానించాడు. ఇలాంటి వరల్డ్ కప్ విశేషాలు మీ కోసం..
ప్రేక్షకులకు ఉచితంగా మినరల్ వాటర్: జైషా
ప్రపంచ కప్ మ్యాచ్లను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులకు ఉచితంగా మినరల్ వాటర్ అందజేస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. అహ్మదాబాద్ వేదికగా ఇవాళ ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్ ప్రారంభమైంది. మొత్తం పది మైదానాల్లో వరల్డ్ కప్ మ్యాచ్లు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్విటర్ వేదికగా జైషా ‘‘వరల్డ్ కప్ సందడి మొదలైంది. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేస్తున్నా. భారత్లోని వరల్డ్ కప్ మ్యాచ్లు జరిగే అన్ని మైదానాల్లో ప్రేక్షకులకు ఉచితంగా మినరల్ వాటర్ సరఫరా చేస్తాం. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ను అందజేస్తాం. ప్రతి ఒక్కరూ మ్యాచ్లను ఆస్వాదించాలి’’ అని ట్వీట్ చేశారు.
భారత క్రికెట్ జెర్సీలో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్
వరల్డ్ కప్లో భారత్ పోరాటం అక్టోబర్ 8న ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా తొలి మ్యాచ్లో తలపడనుంది. ఈ క్రమంలో టీమ్ఇండియాకు శుభాకాంక్షలు చెబుతూ డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ ఛాంపియన్ డ్రూ మెక్ఇంటైర్ ట్విటర్లో ప్రత్యేకంగా పోస్టు పెట్టాడు. భారత్ ఆతిథ్యం, అభిమానం అద్భుతమని వ్యాఖ్యానించాడు. ‘‘రోహిత్ నాయకత్వంలోని భారత జట్టుకు వరల్డ్ కప్లో మంచి జరగాలి. ఇక్కడకు వచ్చిన ప్రతిసారి ఆతిథ్యం నన్ను విపరీతంగా ఆకర్షిస్తోంది’’ అని ట్వీట్ చేశాడు. గత సెప్టెంబర్లో హైదరాబాద్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో మెక్ఇంటైర్ పాల్గొన్నాడు.
మా జట్టే మళ్లీ ఛాంపియన్: మైకెల్ వాన్
వరల్డ్ కప్లో న్యూజిలాండ్తో ఇంగ్లాండ్ (ENG vs NZ) తొలి మ్యాచ్లో తలపడుతోంది. టాస్ నెగ్గిన కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట ఇంగ్లాండ్ బ్యాటింగ్కు దిగింది. ఈ క్రమంలో ఆ జట్టు మాజీ సారథి మైకెల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ ఇంగ్లాండ్ ఆటగాళ్లు మానసికంగా బలంగా ఉంటారు. మరోసారి ఛాంపియన్గా నిలిచే అవకాశం వారి ముందుంది. ఇంగ్లాండ్ తప్పకుండా విజేతగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. ఆటగాళ్లలో ప్రతి ఒక్కరూ జట్టును గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తారు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో కీలకమైన ప్లేయర్లు మంచి ఫామ్లో ఉన్నారు’’ అని మైకెల్ వాన్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ