ODI WC 2023: ఆ రెండు మైదానాల్లోని మ్యాచుల్లో ఇక ‘నో ఫైర్వర్క్స్’!
వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) కీలక దశకు చేరుకుంటోంది. ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు మైదానాల్లో జరగనున్న మ్యాచుల తర్వాత ఎలాంటి క్రాకర్స్ కాల్చకూడదని నిర్ణయించింది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లో (ODI World cup 2023) ఏదైనా జట్టు మ్యాచ్ గెలిచిన తర్వాత స్టేడియంలో టపాసులను పేలుస్తూ సంబరాలు నిర్వహిస్తున్నారు. అలాగే మ్యాచ్ మధ్యలో అభిమానుల కోసం లైటింగ్ షో కూడా ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లైటింగ్ షో వల్ల పెద్దగా నష్టం లేదు కానీ క్రాకర్స్ను కాల్చడం వల్ల మాత్రం కాలుష్యం పెరుగుతున్నట్లు కొందరి వాదన. అత్యంత దారుణంగా గాలి కాలుష్యం ఉండే దిల్లీ, ముంబయి ప్రాంతాల్లో ఈ టపాసులను పేల్చడం వల్ల ఇంకాస్త వాతావరణానికి హాని చేసినట్లే అవుతుందని అభిమానుల నుంచి విజ్ఞప్తులు అందాయి. దీంతో ఈ రెండు మహా నగరాల్లోని మైదానాల్లో జరిగే మ్యాచ్ల సందర్భంగా టపాసులను కాల్చడంపై బ్యాన్ విధిస్తున్నట్లు తాజాగా బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక ప్రకటన చేశారు.
‘‘వాతావరణ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే విషయం అధికారికంగా ఐసీసీ వద్దకు తీసుకెళ్లాం. వారు కూడా అంగీకరించారు. దీంతో ముంబయి, దిల్లీ మైదానాల వద్ద టపాసుల ప్రదర్శన నిర్వహించడం లేదు. వాతావరణ సమస్యలపై బీసీసీఐ కూడా తన వంతు కృషి చేస్తుంది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ను అద్భుతంగా నిర్వర్తించడం వల్ల భవిష్యత్తులో క్రికెట్కు అదనపు ప్రయోజనం చేకూరనుంది. అదేవిధంగా అభిమానులు, ఆటగాళ్లు, ప్రజల ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. అందులో భాగంగా ఫైర్వర్క్స్ను నిలిపివేస్తున్నాం ’’ అని జైషా తెలిపారు.
ఐసీసీ షెడ్యూల్ ప్రకారం దిల్లీ వేదికగా నవంబర్ 6న ఆఖరి మ్యాచ్ జరగనుంది. బంగ్లాదేశ్-శ్రీలంక జట్లు తలపడతాయి. ముంబయి వేదికగా ఇంకా మూడు మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో భారత్ - శ్రీలంక మ్యాచ్తోపాటు ఆస్ట్రేలియా-అఫ్గానిస్థాన్ మ్యాచ్ కూడా ఉంది. ఈ రెండు మాత్రమే కాకుండా తొలి సెమీస్కు వేదిక కూడా ముంబయిలోని వాంఖడే మైదానమే. దీంతో ఈ మైదానాల్లో క్రాకర్స్ సందడి ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?