Bengaluru Vs Chennai: ధోనీ నుంచి అసలైన షో చూడబోతున్నాం: భారత మాజీ క్రికెటర్
మే 18న బెంగళూరు - చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇదే ఇరు జట్లకూ లీగ్ స్టేజ్లో చివరిది కావడం గమనార్హం. మరోవైపు ప్లేఆఫ్స్కు కీలకంగా మారిన మ్యాచ్ కావడంతో ఆసక్తి నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో చెన్నై తన లీగ్ స్టేజ్లో చివరి మ్యాచ్ ఆడబోతోంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుతో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు ఉందనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. మ్యాచ్ జరగాలని ప్రతిఒక్కరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. చెన్నై ప్లేఆఫ్స్కు వెళ్లకపోతే ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఆడే చివరి మ్యాచ్ ఇదే అవుతుంది. కాబట్టి, అతడినుంచి అసలైన ఆట బెంగళూరుపై చూడబోతున్నామని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వరుణ్ ఆరోన్ వ్యాఖ్యానించాడు.
‘‘శనివారం ఎంఎస్ ధోనీ షోను చూస్తామనే నమ్మకం ఉంది. ఇప్పటివరకు ఈ సీజన్లో మనం అతడి ఆటను చూశాం. చిన్నస్వామి స్టేడియంతో ధోనీకి ప్రత్యేక అనుబంధం ఉంది. అద్భుతమైన ఇన్నింగ్స్లు ఇక్కడ ఆడాడు. గతంలో ఓసారి చివరి ఓవర్లో 20 పరుగులను ఒక్కడే బాదేశాడు. కాబట్టి, అతడు అత్యంత ప్రమాదకారి. మరోసారి అతడి నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ కచ్చితంగా వస్తుందని అనుకుంటున్నా’’ అని ఆరోన్ వెల్లడించాడు. ప్రస్తుత సీజన్లో ధోనీ ఇన్నింగ్స్ చివర్లోనే బ్యాటింగ్కు వస్తున్నాడు. ఒకటి లేదా రెండు ఓవర్లు ఉన్నప్పుడు ధనాధన్ షాట్లతో అలరించాడు. ఇప్పటివరకు 13 మ్యచుల్లో 136 పరుగులు రాబట్టాడు. అందులో ఎక్కువగా బౌండరీల రూపంలో వచ్చినవే. అయితే, ఈసారి మాత్రం ఇంకాస్త ముందుగా బ్యాటింగ్ చూడాలనేదే అభిమానుల ఆకాంక్ష.
ఏప్రిల్ కలిసిరాలేదు.. మే మంచిది: కోహ్లీ
తొలి అర్ధభాగంలో బెంగళూరు కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. ఇప్పుడు రెండో స్టేజ్లో ఐదు విజయాలు సాధించి ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది. ఈ క్రమంలో తమ జట్టు మొదట్లో విఫలం కావడంపై విరాట్ కోహ్లీ (Virat Kohli) కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ మే నెల చాలా బాగుంది. ఏప్రిల్ మాకు పెద్దగా కలిసి రాలేదు. సన్లైట్ కిరణాలను ఇప్పుడే సరిగ్గా అందుకున్నాం(నవ్వుతూ). వరుస విజయాలతో మళ్లీ అభిమానులను అలరించడం ఆనందంగా ఉంది’’ అని తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?