ChatGPT: ధోనీకి హెలికాప్టర్.. మరి రోహిత్, కోహ్లీ, సూర్య, జడేజా, పాండ్యకు ఏంటి?
మహేంద్ర సింగ్ ధోనీ అనగానే మనకు గుర్తొచ్చే అంశాల్లో హెలికాప్టర్ షాట్ ఒకటి. అలా మన స్టార్ క్రికెటర్ల విషయంలో అంత స్పెషల్గా నిలిచన షాట్లేంటో తెలుసా? (Best Shot of Team India Star Players)
మన స్టార్ క్రికెటర్లు మైదానంలోకి దిగి షాట్లు కొడుతుంటే చాలా ఎంజాయ్ చేస్తాం. ఆయా క్రికెటర్ల అభిమానిని అడిగితే.. వాళ్లు అడే ప్రతి షాట్ బెస్ట్ అని చెబుతారు. అయితే ఈ విషయంలో చాట్జీపీటీ (ChatGPT) ఏం చెప్పిందో తెలుసా? ఒక్కో ఆటగాడి గురించి వివరిస్తూ.. వాళ్ల బెస్ట్ షాట్ ఏది అనే విషయాలు చెప్పింది. ఆ వివరాలు మీ కోసం..
రోహిత్ టైమింగ్+ పవర్
కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) నుంచి మొదలుపెడదాం. టైమింగ్తో పవర్ ఫుల్ షాట్లు కొట్టడంలో రోహిత్ స్టైలే వేరు. షార్ట్ పిచ్ బంతి స్లాట్లో పడిందంటే చాలు... సిక్సర్ను మంచి నీళ్లు తాగినట్లు కొట్టేస్తాడు. దీనికి ఎక్కువగా రోహిత్ ఎంచుకునేది పుల్ షాట్. చాట్ జీపీటీ కూడా ఇదే మాట చెప్పింది. ఫార్మాట్ ఏదైనా హిట్ మ్యాన్కు ఈ షాట్ బెస్ట్ అంటోంది.
కూల్గా డ్రైవ్ కొట్టే కోహ్లీ
టీమ్ ఇండియా కింగ్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి బెస్ట్ షాట్ ఏది అని చాట్జీపీటీని అడిగితే... చాలా కూల్గా ‘కవర్ డ్రైవ్’ కొట్టేలా ఆన్సర్ ఇచ్చింది. బాడీ బ్యాలెన్స్, టైమింగ్ను నమ్ముకుని షాట్లు కొట్టే.. విరాట్ కవర్ డ్రైవ్ కొడితే మాత్రం కళ్లార్పకుండా చూడాలనిపిస్తుందని చాట్జీపీటీ అంటోంది. ఫీల్డర్ల మధ్య గ్యాప్ను పసిగట్టి బంతిని పంపడంలో కింగ్ టాలెంట్ తెలుస్తుంది అని వివరించింది. దీంట్లో అతని ఫుట్వర్క్ గొప్పతనం కూడా ఉందని చెప్పింది.
కుంగ్ ఫు పాండ్యా షాట్
భారత క్రికెట్లో ధోనీకి శిష్యులు చాలామంది ఉన్నారు. అయితే అందులో ధోనీ ఫేవరెట్ షాట్ అయిన హెలికాప్టర్ను కొనసాగిస్తున్నది మాత్రం హార్దిక్ పాండ్య (Hardik Pandya)నే. అంతేకాదు ఇదే అతని బెస్ట్ షాట్ అని చాట్జీపీటీ చెబుతోంది. టీ20లకు టీమ్ ఇండియా కెప్టెన్ అయిన పాండ్యను అభిమానులు కుంగ్ఫు పాండ్య అంటుంటారు. అచ్చంగా అలాంటి స్టైల్లోనే ధోనీ హెలికాప్టర్ను కాస్త ఇంప్రూవైజ్ చేసి కొడుతుంటాడు.
మన 360.. మన సూర్య
ఆధునిక తరం క్రికెటర్లలో మిస్టర్ 360 అంటే ఠక్కున గుర్తొచ్చే ఏకైక పేరు సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav). అనతికాలంలో స్టార్ టీ20 ప్లేయర్ అయిపోయిన స్కైకి ఫేవరెట్ అండ్ బెస్ట్ షాట్ అంటే... కవర్ డ్రైవ్ అని చాట్జీపీటీ చెబుతోంది. అయితే దాంతోపాటు ఫాస్ట్ బౌలర్లు అని కూడా చూడకుండా సూర్య ఆడే ఫుల్ షాట్లు అన్నా అభిమానులు అంతే ఎంజాయ్ చేస్తుంటారు.
జడేజా జాదూ స్పెషల్
టీమ్ ఇండియాలో బెస్ట్ ఆల్రౌండర్ అంటూ లిస్ట్ రాస్తే అందులో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) టాప్లో నిలవడం ఖాయం. అంతలా ఇటీవల కాలంలో అదరగొడుతున్నాడు మరి. అలాంటి జడ్డూకి బెస్ట్ షాట్ ఏది? అని అడిగితే చాట్జీపీటీ స్ట్రైట్గా స్ట్రయిట్ డ్రైవ్ అని చెప్పేసింది. లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లు ఈ షాట్ ఆడితే అందంగా ఉంటుంది. అయితే జడేజా ఆడితే జాదూ చేసినట్లుగా ఉంటుంది అని ఫ్యాన్స్ అంటుంటారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా