T20 League: అన్క్యాప్డ్ ఆటగాళ్లు.. ఈసారి అంచనాలకు మించి అద్భుతాలు..!
ఈ సీజన్లో పలువురు అన్క్యాప్డ్ ఆటగాళ్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. సీనియర్లకు సైతం సిగపాట్లు పట్టిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు..
నాణేనికి బొమ్మాబొరుసూ రెండు వైపులుంటాయ్. భారత్లో ఏటా జరిగే మెగా టీ20 టోర్నీకీ అంతే! ప్రపంచ సంపన్న లీగ్గా ఈ టోర్నీపై ఎన్ని విమర్శలున్నా.. కొత్త టాలెంట్ను వెలికితీయడంలో దీన్ని మించిన ఈవెంట్ మరొకటి లేదు. అందువల్లే జాతీయ జట్టులోకి ప్రవేశించడానికి ఈ టోర్నీనే ట్రాక్గా ఎంచుకుంటున్నారు మేటి కుర్రాళ్లు. ప్రపంచ ఆటగాళ్లకు సైతం సిగపాట్లు పట్టిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ మేరకు 2022 సీజన్లో పలువురు అన్క్యాప్డ్ ఆటగాళ్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు.
హైదరాబాద్ కుర్రాడు.. తిలక్
ముంబయి జట్టులో ఈసారి 19 ఏళ్ల హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ ఆటే హైలైట్. జట్టు ఓటములు పక్కనపెడితే ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచుల్లో రెండు అర్ధశతకాలు సహా తిలక్ 334 పరుగులు చేశాడు. జట్టులో సీనియర్ బ్యాటర్లు సైతం చేతులెత్తేస్తున్న వేళ.. అతనొక్కడే అదిరే బ్యాటింగ్తో మెరుగైన స్కోరు సాధిస్తున్నాడు. ఇకపైనా ఇలాగే ఆడితే భవిష్యత్తు టీమ్ఇండియాకు తిలక్ వర్మ ప్రాతినిధ్యం వహిస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సీజన్లో తిలక్ అత్యధిక స్కోర్ 61, స్ట్రైక్రేట్ 136.66.
అభిషేక్.. అంచనాలకు మించి
హైదరాబాద్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈసారి అంచనాలకు మించి రాణిస్తున్నాడు. పంజాబ్కు చెందిన ఈ 21 ఏళ్ల ఎడమచేతి వాటం ఆల్రౌండర్ తన 11 ఇన్నింగ్స్ల్లో మొత్తం 331 పరుగులు సాధించాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైపై గెలుపులో అభిషేక్ శర్మ (75) అమోఘమైన ఇన్నింగ్స్ ఆడి ఔరా అనిపించాడు. అత్యధిక స్కోర్ 75, స్ట్రైక్ రేట్ 132.40.
అరంగ్రేటంలోనే అద్భుతం
గుజరాత్ యువ బ్యాటర్ సాయి సుదర్శన్ అరంగేట్ర మ్యాచ్లోనే అద్భుతంగా ఆడాడు. ఎటువంటి భయం కనిపించకుండా చక్కటి షాట్లు ఆడుతూ ఏకంగా 35 పరుగులు రాబట్టాడు. ఆపై పంజాబ్తో జరిగిన మరో మ్యాచ్లో 65 పరుగులు సాధించి నాటౌట్గా నిలిచాడు. తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల సుదర్శన్ ఇప్పటివరకు ఆడిన 5 ఇన్నింగ్స్ల్లో మొత్తం 145 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. అత్యధిక స్కోర్ 65 నాటౌట్. స్ట్రైక్రేట్ 127.19.
ఫినిషర్ బదోని
గుజరాత్తో జరిగిన అరంగేట్ర మ్యాచ్లోనే అర్థశతకం సాధించాడు లఖ్నవూ ఆటగాడు ఆయుష్ బదోని (54). ఆపై చెన్నై, దిల్లీతో మ్యాచ్ల్లో ఫినిషర్గా బౌండరీలు బాది జట్టును గెలిపించాడు. ఇప్పటివరకు ఆడిన 10 ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీ సహా బదోని 161 పరుగులు చేశాడు. మూడుసార్లు నాటౌట్గా నిలిచాడు. అత్యధిక స్కోర్ 54, స్ట్రైక్రేట్ 129.66.
అలాగే మరో కొత్త జట్టు గుజరాత్లో అభినవ్ (7 మ్యాచ్ల్లో 108) అవకాశం వచ్చినప్పుడల్లా తన మెరుపు బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు. మరోవైపు బెంగళూరు బ్యాటర్లలో రజత్ పటిదార్ (4 ఇన్నింగ్స్ల్లో 137), అనుజ్ రావత్ (8 ఇన్నింగ్స్ల్లో 129) నిలకడగా రాణిస్తున్నారు.
బుల్లెట్ బంతుల ఉమ్రాన్
ఈ సీజన్లో ప్రధాన చర్చంతా హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ గురించే. బులెట్ బంతులతో ఈసారి అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఉమ్రాన్. గుజరాత్తో మ్యాచ్లో 25 పరుగులే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఇందులో నాలుగు బౌల్డ్లు కాగా.. ఒకటి క్యాచ్ ఔట్. అంతేకాకుండా 150 కి.మీ వేగంతో స్థిరంగా బంతులను సంధిస్తున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచుల్లో ఉమ్రాన్ 15 వికెట్లు పడగొట్టాడు.
ముకేశ్ చౌదరీ
రాజస్థాన్కు చెందిన 25 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ముకేశ్ చౌదరీ ఈ సీజన్లో గొప్పగా రాణిస్తున్నాడు. ఇప్పటిదాకా 10 మ్యాచ్లు ఆడి ముకేశ్ 13 వికెట్లు పడగొట్టాడు. ముంబయి ఇండియన్స్తో మ్యాచ్లో 9 పరుగులకే మూడు వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
యూపీకి చెందిన యువ పేసర్ మోసిన్ ఖాన్.. ఈసారి లఖ్నవూ తరఫున ఆడుతున్నాడు. దిల్లీతో జరిగిన మ్యాచ్లో మోసిన్ కేవలం 16 పరుగులే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 10 వికెట్లు పడగొట్టాడు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM