T20 League: అన్క్యాప్డ్ ఆటగాళ్లు.. ఈసారి అంచనాలకు మించి అద్భుతాలు..!
ఈ సీజన్లో పలువురు అన్క్యాప్డ్ ఆటగాళ్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. సీనియర్లకు సైతం సిగపాట్లు పట్టిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు..
నాణేనికి బొమ్మాబొరుసూ రెండు వైపులుంటాయ్. భారత్లో ఏటా జరిగే మెగా టీ20 టోర్నీకీ అంతే! ప్రపంచ సంపన్న లీగ్గా ఈ టోర్నీపై ఎన్ని విమర్శలున్నా.. కొత్త టాలెంట్ను వెలికితీయడంలో దీన్ని మించిన ఈవెంట్ మరొకటి లేదు. అందువల్లే జాతీయ జట్టులోకి ప్రవేశించడానికి ఈ టోర్నీనే ట్రాక్గా ఎంచుకుంటున్నారు మేటి కుర్రాళ్లు. ప్రపంచ ఆటగాళ్లకు సైతం సిగపాట్లు పట్టిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ మేరకు 2022 సీజన్లో పలువురు అన్క్యాప్డ్ ఆటగాళ్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు.
హైదరాబాద్ కుర్రాడు.. తిలక్
ముంబయి జట్టులో ఈసారి 19 ఏళ్ల హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ ఆటే హైలైట్. జట్టు ఓటములు పక్కనపెడితే ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచుల్లో రెండు అర్ధశతకాలు సహా తిలక్ 334 పరుగులు చేశాడు. జట్టులో సీనియర్ బ్యాటర్లు సైతం చేతులెత్తేస్తున్న వేళ.. అతనొక్కడే అదిరే బ్యాటింగ్తో మెరుగైన స్కోరు సాధిస్తున్నాడు. ఇకపైనా ఇలాగే ఆడితే భవిష్యత్తు టీమ్ఇండియాకు తిలక్ వర్మ ప్రాతినిధ్యం వహిస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సీజన్లో తిలక్ అత్యధిక స్కోర్ 61, స్ట్రైక్రేట్ 136.66.
అభిషేక్.. అంచనాలకు మించి
హైదరాబాద్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈసారి అంచనాలకు మించి రాణిస్తున్నాడు. పంజాబ్కు చెందిన ఈ 21 ఏళ్ల ఎడమచేతి వాటం ఆల్రౌండర్ తన 11 ఇన్నింగ్స్ల్లో మొత్తం 331 పరుగులు సాధించాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైపై గెలుపులో అభిషేక్ శర్మ (75) అమోఘమైన ఇన్నింగ్స్ ఆడి ఔరా అనిపించాడు. అత్యధిక స్కోర్ 75, స్ట్రైక్ రేట్ 132.40.
అరంగ్రేటంలోనే అద్భుతం
గుజరాత్ యువ బ్యాటర్ సాయి సుదర్శన్ అరంగేట్ర మ్యాచ్లోనే అద్భుతంగా ఆడాడు. ఎటువంటి భయం కనిపించకుండా చక్కటి షాట్లు ఆడుతూ ఏకంగా 35 పరుగులు రాబట్టాడు. ఆపై పంజాబ్తో జరిగిన మరో మ్యాచ్లో 65 పరుగులు సాధించి నాటౌట్గా నిలిచాడు. తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల సుదర్శన్ ఇప్పటివరకు ఆడిన 5 ఇన్నింగ్స్ల్లో మొత్తం 145 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. అత్యధిక స్కోర్ 65 నాటౌట్. స్ట్రైక్రేట్ 127.19.
ఫినిషర్ బదోని
గుజరాత్తో జరిగిన అరంగేట్ర మ్యాచ్లోనే అర్థశతకం సాధించాడు లఖ్నవూ ఆటగాడు ఆయుష్ బదోని (54). ఆపై చెన్నై, దిల్లీతో మ్యాచ్ల్లో ఫినిషర్గా బౌండరీలు బాది జట్టును గెలిపించాడు. ఇప్పటివరకు ఆడిన 10 ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీ సహా బదోని 161 పరుగులు చేశాడు. మూడుసార్లు నాటౌట్గా నిలిచాడు. అత్యధిక స్కోర్ 54, స్ట్రైక్రేట్ 129.66.
అలాగే మరో కొత్త జట్టు గుజరాత్లో అభినవ్ (7 మ్యాచ్ల్లో 108) అవకాశం వచ్చినప్పుడల్లా తన మెరుపు బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు. మరోవైపు బెంగళూరు బ్యాటర్లలో రజత్ పటిదార్ (4 ఇన్నింగ్స్ల్లో 137), అనుజ్ రావత్ (8 ఇన్నింగ్స్ల్లో 129) నిలకడగా రాణిస్తున్నారు.
బుల్లెట్ బంతుల ఉమ్రాన్
ఈ సీజన్లో ప్రధాన చర్చంతా హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ గురించే. బులెట్ బంతులతో ఈసారి అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఉమ్రాన్. గుజరాత్తో మ్యాచ్లో 25 పరుగులే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఇందులో నాలుగు బౌల్డ్లు కాగా.. ఒకటి క్యాచ్ ఔట్. అంతేకాకుండా 150 కి.మీ వేగంతో స్థిరంగా బంతులను సంధిస్తున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచుల్లో ఉమ్రాన్ 15 వికెట్లు పడగొట్టాడు.
ముకేశ్ చౌదరీ
రాజస్థాన్కు చెందిన 25 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ముకేశ్ చౌదరీ ఈ సీజన్లో గొప్పగా రాణిస్తున్నాడు. ఇప్పటిదాకా 10 మ్యాచ్లు ఆడి ముకేశ్ 13 వికెట్లు పడగొట్టాడు. ముంబయి ఇండియన్స్తో మ్యాచ్లో 9 పరుగులకే మూడు వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
యూపీకి చెందిన యువ పేసర్ మోసిన్ ఖాన్.. ఈసారి లఖ్నవూ తరఫున ఆడుతున్నాడు. దిల్లీతో జరిగిన మ్యాచ్లో మోసిన్ కేవలం 16 పరుగులే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 10 వికెట్లు పడగొట్టాడు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్