#HBDViratKohli: సచిన్ రికార్డును సమం చేసిన కోహ్లీ... ఈ సంవత్సరం చాలా స్పెషల్!
Virat Kohli Birthday Special: టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు ఈ రోజు. గత కొన్నేళ్లుగా ఫామ్ లేమితో ఉన్న ఇప్పుడు ఫుల్ ఫామ్లో ఉన్నాడు.
విజయం సాధించడంతో పాటు ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం కష్టం అంటారు. విపరీతమైన పోటీ ఉండే క్రికెట్లో.. అందులోనూ విపరీతమైన అంచనాల ఒత్తిడి ఉండే భారత క్రికెట్లో ఇది మరింత కష్టం. ఈ ఆటలో విరాట్ కోహ్లి (Virat Kohli) నెలకొల్పిన ప్రమాణాలు అసాధారణం. సచిన్కు దరిదాపుల్లో నిలిచే బ్యాటర్ రావడం కష్టమని అందరూ తీర్మానించేశాక.. సచిన్ను మించే స్థాయిలో పరుగుల ప్రవాహంతో అనేక రికార్డులు బద్దలు కొట్టడం.. మరెన్నో రికార్డుల మీద గురి పెట్టడం అతడికే చెల్లింది. ఈ రోజు ఏకంగా వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు (49)ను కూడా సమం చేసేశాడు. ఐతే ఆటలో ఎవరూ అందుకోని స్థాయికి చేరుకున్న కోహ్లి.. ఒక దశలో ఎదుర్కొన్న వైఫల్యాలు, పతనం చూసి ఇక అతడి పనైపోయిందని అందరూ తీర్మానించేశారు. కానీ పడి లేచిన కెరటంలా పేలవ దశను అతను అధిగమించిన తీరు అద్భుతం. వైఫల్యాల మధ్యే రెండు మూడు పుట్టిన రోజులు జరుపుకొన్న ‘కింగ్’.. ఈ పుట్టిన రోజు (Happby Birthday Virat)కు మళ్లీ కెరీర్ పతాక స్థాయిని అందుకోవడం అభిమానులకు అమితానందాన్నిస్తోంది.
ఈ రోజు (నవంబరు 5) కోహ్లి తన 35వ పుట్టిన రోజును జరుపుకొంటున్నాడు. ఐతే అతడి గత మూడు పుట్టిన రోజులు అంత సంతృప్తికరంగా సాగలేదు. అంతర్జాతీయ కెరీర్ మొదలయ్యాక పైకి ఎదగడమే తప్ప కిందికి పడటం అన్నదే అతడి కెరీర్లో జరగనే లేదు. ఏ దేశంలో ఆడినా.. పిచ్ ఎలాంటిదైనా.. అవతల ఉన్నది ఎలాంటి బౌలర్లయినా అతడికి లెక్క ఉండదు. క్రీజులో అడుగు పెట్టాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించాల్సిందే. అలుపు సొలుపు లేకుండా పరుగులు రాబట్టడం.. మంచినీళ్ల ప్రాయంగా శతకాలు బాదడం.. అందరూ ఇబ్బంది పడే ఛేదనలో మొనగాడిలా నిలబడి జట్టును గెలిపించడం.. అదీ కోహ్లి అంటే. మామూలుగా ఒత్తిడి ఎక్కువైతే ఎలాంటి బ్యాటర్ అయినా తడబడతాడు. కానీ ఎంత ఒత్తిడి ఉంటే అంతగా రెచ్చిపోవడం కోహ్లికే సాధ్యం. కోహ్లిని ఎవరైనా రెచ్చగొడితే.. అతడిలోని అత్యుత్తమ ఆటగాడు బయటికి వస్తాడు. అందుకే వేరే జట్ల మాజీ ఆటగాళ్లు.. కోహ్లితో పెట్టుకోవద్దని, అతణ్ని రెచ్చగొట్టొద్దని తమ ఆటగాళ్లను హెచ్చరించేవారు.
ఇదే పతాక స్థాయి అనుకున్న ప్రతిసారీ.. అంతకుమించి ఉత్తమ ప్రదర్శన చేసి ఇంకా తనకు తానే సాటి అనిపించిన ఆటగాడు విరాట్. వివిధ ఫార్మాట్లలో అతడి పరుగులు.. సగటు.. శతకాలు.. ఇలాంటి గణాంకాలు చూసి క్రికెట్ పండితులు నోరెళ్లబెట్టారు. మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పటి కంటే ఛేదనల్లో ఎక్కువ పరుగులు, సగటు, శతకాలు నమోదు చేయడం అతడికే చెల్లింది. క్రికెట్ చరిత్రలో అప్పటిదాకా ఎవరికీ ఇలాంటి ఘనతలు సాధ్యం కాలేదు. భవిష్యత్తులో కూడా అలాంటి ఆటగాడు వస్తాడని ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఇలా పతాక స్థాయిలో సాగిపోతున్న విరాట్ కెరీర్ 2019-2023 మధ్య మాత్రం ఊహించని పతనం చవిచూసింది.
అదే అతడి ప్రత్యేకత..
సెంచరీ కొట్టడాన్ని ఒక మామూలు విషయంగా మార్చేసి.. ఒక ఏడాదిలో పది సెంచరీలు కొడితే కోహ్లికి ఇది మామూలే కదా అని అభిమానులు అనకునే పరిస్థితి కల్పించిన ఘనుడు కోహ్లి. అలాంటి ఆటగాడు ఒక్క శతకం కూడా సాధించకుండా రెండున్నరేళ్లకు పైగా ఉన్నాడంటే అంతకంటే అనూహ్యమైన విషయం మరొకటి ఉండదు. ఎలాంటి ఆటగాడైనా ఫామ్ కోల్పోవడం, కొంత కాలం పరుగుల కోసం తంటాలు పడటం, సెంచరీలకు దూరం కావడం మామూలే. ఐతే కోహ్లి స్థాయి ఆటగాడు రెండున్నరేళ్లు మూడంకెల స్కోరు చేయకపోవడం మాత్రం అనూహ్యం. ఫలానా ఫార్మాట్ అని తేడా లేకుండా అన్నింట్లోనూ అతను విఫలమయ్యాడు.
ఐపీఎల్లో సైతం సాధారణ పరిస్థితి చేశాడు. కోహ్లి అంటే బెంబేలెత్తిన బౌలర్లు, ప్రత్యర్థి జట్లు.. అతను క్రీజులోకి వస్తుంటే అస్సలు భయపడకపోవడం, తన వికెట్ పడినా పెద్దగా సంబరాలు చేసుకోకపోవడం ఆ పేలవ దశలోనే చూశారు అభిమానులు. సెంచరీల కోసం చూడ్డం మాని అతను 50 దాటినా సంబరపడే పరిస్థితి వచ్చింది ఒక దశలో. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్సీకి దూరం కావడం.. ఐపీఎల్లో సైతం కెప్టెన్సీని విడిచిపెట్టడంతో కోహ్లి ప్రభ మరింత తగ్గింది. దీంతో విరాట్ మళ్లీ మునుపటి స్థాయిని అందుకోలేడని.. ఇక అతను రిటైరవడమే తరువాయి అనే చర్చ జరిగింది. కానీ అలాగే జరిగి ఉంటే.. అతను కోహ్లి ఎందుకవుతాడు?
అక్కడ్నుంచి మొదలు..
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గత ఏడాది ఆసియా కప్లో అఫ్గానిస్థాన్పై సెంచరీ సాధించడంతో విరాట్ మళ్లీ తన పరుగుల ప్రవాహాన్ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ మీద ఆడిన 84 సంచలన ఇన్నింగ్స్తో అతడి పేరు మార్మోగింది. మళ్లీ మునుపటి కోహ్లిని ఆ మ్యాచ్లోనే చూశారు అభిమానులు. క్రికెట్ ప్రపంచమంతా కింగ్ కింగే అని కొనియాడింది. ఇక కోహ్లి ఆగనే లేదు. 2023లో అతడి జోరు మామూలుగా లేదు. ఈ ఏడాది కోహ్లి అంతర్జాతీయ పరుగులు 1500 దాటాయి. ఆరు సెంచరీలు కూడా సాధించాడు. ప్రపంచకప్ కంటే ముందు ఆసియా కప్లో పాకిస్థాన్తో అద్భుత శతకంతో అభిమానులను ఉర్రూతలూగించాడు.
ఇక ప్రపంచకప్లో అయితే అతడి వీరవిహారం మామూలుగా లేదు. 8 ఇన్నింగ్స్ల్లో 108.6 సగటుతో 543 పరుగులు సాధించాడు. అందులో రెండు శతకాలపాటు నాలుగు అర్ధసెంచరీలున్నాయి. ఆస్ట్రేలియాపై 85, న్యూజిలాండ్పై 95, శ్రీలంకపై 88 పరుగుల వద్ద ఔటై.. సచిన్ రికార్డు సమం చేయడానికి అడుగు దూరంలో ఉండిపోయిన విరాట్ దక్షిణాఫ్రికా మీద అజేయ శతకం (101*) చేసి పని పూర్తి చేశాడు. ఇక సచిన్ రికార్డును అధిగమించడమే తరువాయి. త్వరలోనే ఆ రికార్డును తన పేరిట లిఖించుకోవడం ఖాయం. ప్రపంచకప్లో విరాట్ ఇదే ఫామ్ను చివరి వరకు కొనసాగించి భారత్ను మూడోసారి విశ్వవిజేతగా నిలపాలన్నది అభిమానుల ఆకాంక్ష.
- ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
T20 jersey: టీ20 ప్రపంచకప్ టోర్నీకి టీమ్ఇండియా జెర్సీల ధరను అడిడాస్ ప్రకటించింది. -
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. పాక్లో టీమ్ఇండియా పర్యటిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
టీమ్ఇండియా బ్యాటర్ శివమ్ దూబె (Shivam Dube)పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే టీ20 ప్రపంచకప్లో పవర్ఫుల్ హిట్టింగ్తో అలరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!