#HBDViratKohli: సచిన్ రికార్డును సమం చేసిన కోహ్లీ... ఈ సంవత్సరం చాలా స్పెషల్!
Virat Kohli Birthday Special: టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు ఈ రోజు. గత కొన్నేళ్లుగా ఫామ్ లేమితో ఉన్న ఇప్పుడు ఫుల్ ఫామ్లో ఉన్నాడు.
విజయం సాధించడంతో పాటు ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం కష్టం అంటారు. విపరీతమైన పోటీ ఉండే క్రికెట్లో.. అందులోనూ విపరీతమైన అంచనాల ఒత్తిడి ఉండే భారత క్రికెట్లో ఇది మరింత కష్టం. ఈ ఆటలో విరాట్ కోహ్లి (Virat Kohli) నెలకొల్పిన ప్రమాణాలు అసాధారణం. సచిన్కు దరిదాపుల్లో నిలిచే బ్యాటర్ రావడం కష్టమని అందరూ తీర్మానించేశాక.. సచిన్ను మించే స్థాయిలో పరుగుల ప్రవాహంతో అనేక రికార్డులు బద్దలు కొట్టడం.. మరెన్నో రికార్డుల మీద గురి పెట్టడం అతడికే చెల్లింది. ఈ రోజు ఏకంగా వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు (49)ను కూడా సమం చేసేశాడు. ఐతే ఆటలో ఎవరూ అందుకోని స్థాయికి చేరుకున్న కోహ్లి.. ఒక దశలో ఎదుర్కొన్న వైఫల్యాలు, పతనం చూసి ఇక అతడి పనైపోయిందని అందరూ తీర్మానించేశారు. కానీ పడి లేచిన కెరటంలా పేలవ దశను అతను అధిగమించిన తీరు అద్భుతం. వైఫల్యాల మధ్యే రెండు మూడు పుట్టిన రోజులు జరుపుకొన్న ‘కింగ్’.. ఈ పుట్టిన రోజు (Happby Birthday Virat)కు మళ్లీ కెరీర్ పతాక స్థాయిని అందుకోవడం అభిమానులకు అమితానందాన్నిస్తోంది.
ఈ రోజు (నవంబరు 5) కోహ్లి తన 35వ పుట్టిన రోజును జరుపుకొంటున్నాడు. ఐతే అతడి గత మూడు పుట్టిన రోజులు అంత సంతృప్తికరంగా సాగలేదు. అంతర్జాతీయ కెరీర్ మొదలయ్యాక పైకి ఎదగడమే తప్ప కిందికి పడటం అన్నదే అతడి కెరీర్లో జరగనే లేదు. ఏ దేశంలో ఆడినా.. పిచ్ ఎలాంటిదైనా.. అవతల ఉన్నది ఎలాంటి బౌలర్లయినా అతడికి లెక్క ఉండదు. క్రీజులో అడుగు పెట్టాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించాల్సిందే. అలుపు సొలుపు లేకుండా పరుగులు రాబట్టడం.. మంచినీళ్ల ప్రాయంగా శతకాలు బాదడం.. అందరూ ఇబ్బంది పడే ఛేదనలో మొనగాడిలా నిలబడి జట్టును గెలిపించడం.. అదీ కోహ్లి అంటే. మామూలుగా ఒత్తిడి ఎక్కువైతే ఎలాంటి బ్యాటర్ అయినా తడబడతాడు. కానీ ఎంత ఒత్తిడి ఉంటే అంతగా రెచ్చిపోవడం కోహ్లికే సాధ్యం. కోహ్లిని ఎవరైనా రెచ్చగొడితే.. అతడిలోని అత్యుత్తమ ఆటగాడు బయటికి వస్తాడు. అందుకే వేరే జట్ల మాజీ ఆటగాళ్లు.. కోహ్లితో పెట్టుకోవద్దని, అతణ్ని రెచ్చగొట్టొద్దని తమ ఆటగాళ్లను హెచ్చరించేవారు.
ఇదే పతాక స్థాయి అనుకున్న ప్రతిసారీ.. అంతకుమించి ఉత్తమ ప్రదర్శన చేసి ఇంకా తనకు తానే సాటి అనిపించిన ఆటగాడు విరాట్. వివిధ ఫార్మాట్లలో అతడి పరుగులు.. సగటు.. శతకాలు.. ఇలాంటి గణాంకాలు చూసి క్రికెట్ పండితులు నోరెళ్లబెట్టారు. మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పటి కంటే ఛేదనల్లో ఎక్కువ పరుగులు, సగటు, శతకాలు నమోదు చేయడం అతడికే చెల్లింది. క్రికెట్ చరిత్రలో అప్పటిదాకా ఎవరికీ ఇలాంటి ఘనతలు సాధ్యం కాలేదు. భవిష్యత్తులో కూడా అలాంటి ఆటగాడు వస్తాడని ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఇలా పతాక స్థాయిలో సాగిపోతున్న విరాట్ కెరీర్ 2019-2023 మధ్య మాత్రం ఊహించని పతనం చవిచూసింది.
అదే అతడి ప్రత్యేకత..
సెంచరీ కొట్టడాన్ని ఒక మామూలు విషయంగా మార్చేసి.. ఒక ఏడాదిలో పది సెంచరీలు కొడితే కోహ్లికి ఇది మామూలే కదా అని అభిమానులు అనకునే పరిస్థితి కల్పించిన ఘనుడు కోహ్లి. అలాంటి ఆటగాడు ఒక్క శతకం కూడా సాధించకుండా రెండున్నరేళ్లకు పైగా ఉన్నాడంటే అంతకంటే అనూహ్యమైన విషయం మరొకటి ఉండదు. ఎలాంటి ఆటగాడైనా ఫామ్ కోల్పోవడం, కొంత కాలం పరుగుల కోసం తంటాలు పడటం, సెంచరీలకు దూరం కావడం మామూలే. ఐతే కోహ్లి స్థాయి ఆటగాడు రెండున్నరేళ్లు మూడంకెల స్కోరు చేయకపోవడం మాత్రం అనూహ్యం. ఫలానా ఫార్మాట్ అని తేడా లేకుండా అన్నింట్లోనూ అతను విఫలమయ్యాడు.
ఐపీఎల్లో సైతం సాధారణ పరిస్థితి చేశాడు. కోహ్లి అంటే బెంబేలెత్తిన బౌలర్లు, ప్రత్యర్థి జట్లు.. అతను క్రీజులోకి వస్తుంటే అస్సలు భయపడకపోవడం, తన వికెట్ పడినా పెద్దగా సంబరాలు చేసుకోకపోవడం ఆ పేలవ దశలోనే చూశారు అభిమానులు. సెంచరీల కోసం చూడ్డం మాని అతను 50 దాటినా సంబరపడే పరిస్థితి వచ్చింది ఒక దశలో. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్సీకి దూరం కావడం.. ఐపీఎల్లో సైతం కెప్టెన్సీని విడిచిపెట్టడంతో కోహ్లి ప్రభ మరింత తగ్గింది. దీంతో విరాట్ మళ్లీ మునుపటి స్థాయిని అందుకోలేడని.. ఇక అతను రిటైరవడమే తరువాయి అనే చర్చ జరిగింది. కానీ అలాగే జరిగి ఉంటే.. అతను కోహ్లి ఎందుకవుతాడు?
అక్కడ్నుంచి మొదలు..
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గత ఏడాది ఆసియా కప్లో అఫ్గానిస్థాన్పై సెంచరీ సాధించడంతో విరాట్ మళ్లీ తన పరుగుల ప్రవాహాన్ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ మీద ఆడిన 84 సంచలన ఇన్నింగ్స్తో అతడి పేరు మార్మోగింది. మళ్లీ మునుపటి కోహ్లిని ఆ మ్యాచ్లోనే చూశారు అభిమానులు. క్రికెట్ ప్రపంచమంతా కింగ్ కింగే అని కొనియాడింది. ఇక కోహ్లి ఆగనే లేదు. 2023లో అతడి జోరు మామూలుగా లేదు. ఈ ఏడాది కోహ్లి అంతర్జాతీయ పరుగులు 1500 దాటాయి. ఆరు సెంచరీలు కూడా సాధించాడు. ప్రపంచకప్ కంటే ముందు ఆసియా కప్లో పాకిస్థాన్తో అద్భుత శతకంతో అభిమానులను ఉర్రూతలూగించాడు.
ఇక ప్రపంచకప్లో అయితే అతడి వీరవిహారం మామూలుగా లేదు. 8 ఇన్నింగ్స్ల్లో 108.6 సగటుతో 543 పరుగులు సాధించాడు. అందులో రెండు శతకాలపాటు నాలుగు అర్ధసెంచరీలున్నాయి. ఆస్ట్రేలియాపై 85, న్యూజిలాండ్పై 95, శ్రీలంకపై 88 పరుగుల వద్ద ఔటై.. సచిన్ రికార్డు సమం చేయడానికి అడుగు దూరంలో ఉండిపోయిన విరాట్ దక్షిణాఫ్రికా మీద అజేయ శతకం (101*) చేసి పని పూర్తి చేశాడు. ఇక సచిన్ రికార్డును అధిగమించడమే తరువాయి. త్వరలోనే ఆ రికార్డును తన పేరిట లిఖించుకోవడం ఖాయం. ప్రపంచకప్లో విరాట్ ఇదే ఫామ్ను చివరి వరకు కొనసాగించి భారత్ను మూడోసారి విశ్వవిజేతగా నిలపాలన్నది అభిమానుల ఆకాంక్ష.
- ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?