IND vs AUS: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ హీరోలు వీరే!
ఫిబ్రవరి 9 నుంచి 2022-23 బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy) ప్రారంభంకానుంది. తొలి టెస్టు నాగ్పూర్ వేదికగా జరగనుండగా.. ఈ ట్రోఫీలో ఇప్పటివరకు నమోదైన రికార్డులపై ఓ లుక్కేద్దామా..!
ఇంటర్నెట్ డెస్క్: భారత్, ఆసీస్ (IND vs AUS) మధ్య ఎన్ని సిరీస్లు జరిగినా బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) ప్రత్యేకతే వేరు. మిగతా సిరీస్ల్లో ఫలితం ఎలా ఉన్నా ఈ సిరీస్లో గెలవడాన్ని మాత్రం ఇరు జట్లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. స్పిన్నర్లు తమ మాయాజాలంతో బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తే.. పేసర్లు బుల్లెట్ లాంటి బంతులు విసురుతూ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తారు. ఇక, కవ్వింపుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ మాత్రం అవకాశం దొరికినా మాటల యుద్ధానికి దిగి ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీస్తారు. ఇలా హొరాహోరీగా సాగే బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (BGT) రేపే (గురువారం) ప్రారంభం కానుంది. నాగ్పూర్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. మరి BGTలో ఇప్పటివరకు ఉన్న రికార్డులపై ఓ లుక్కేద్దాం..
ఆసీస్ ఒక్కసారే..
ఇరు దేశాలకు చెందిన దిగ్గజ క్రికెటర్లు సునీల్ గావస్కర్ (Sunil Gavaskar), అలెన్ బోర్డర్ (Allen Border) పేరుతో ట్రోఫీని నిర్వహిస్తున్నారు. భారత్లో నిర్వహించిన మొదటి ట్రోఫీ (1996/97)ని టీమ్ఇండియా దక్కించుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక ట్రోఫీని ఇప్పటివరకు 15 సార్లు నిర్వహించగా.. భారత్ 9 సార్లు, ఆస్ట్రేలియా ఐదుసార్లు విజయం సాధించాయి. ఒకసారి (2003/04) డ్రా అయింది. చివరిగా నిర్వహించిన మూడు ట్రోఫీల్లోనూ టీమ్ఇండియానే గెలుపొందింది. భారత్లో బోర్డర్-గావస్కర్ ట్రోఫీని 8 సార్లు నిర్వహించగా.. ఆసీస్ ఒక్కసారి మాత్రమే (2004/05) విజేతగా నిలిచింది.
అత్యధిక పరుగులు చేసింది ఎవరంటే?
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్ తరఫున సచిన్ (Sachin Tendulkar) అత్యధికంగా 3,262 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 16 అర్ధ శతకాలు ఉన్నాయి. భారత్పై ఆసీస్ తరఫున అత్యధికంగా రికీ పాంటింగ్ 2,555 పరుగులు సాధించాడు. 8 శతకాలు, 12 అర్ధ శతకాలు బాదాడు. ప్రస్తుతం క్రికెట్లో కొనసాగుతున్న వారిలో చూసుకుంటే భారత్ తరఫున 1,893 పరుగులతో ఛెతేశ్వర్ పుజారా, ఆసీస్ తరఫున స్టీవ్ స్మిత్ 1,742 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నారు.
అత్యధిక వ్యక్తిగత స్కోరు
ఈ సిరీస్లో భారత్పై అత్యధిక స్కోరు సాధించిన రికార్డు మైఖేల్ క్లార్క్ పేరిట ఉంది. 2012 జనవరిలో సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్లో మైఖేల్ క్లార్క్ 329 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక, భారత్ తరఫున చూసుకుంటే 2001లో ఈడెన్ గార్డెన్స్లో జరిగిన టెస్టు మ్యాచ్లో వీవీఎస్ లక్ష్మణ్ 281 పరుగులు చేశాడు.
భజ్జీ ఫస్ట్.. కుంబ్లే సెకండ్
BGTలో ఒక మ్యాచ్లో అత్యుత్తమ బౌలింగ్ చేసిన రికార్డు హర్భజన్ సింగ్ (Harbhajan Singh) పేరిట ఉంది. 2001లో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో (7/133), రెండో ఇన్నింగ్స్లో 8/84)తో ఆకట్టుకున్నాడు. హర్భజన్ 15 వికెట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. ఇదే చెన్నై మైదానంలో 2004లో జరిగిన మ్యాచ్లో అనిల్ కుంబ్లే (Anil kumble) తొలి ఇన్నింగ్స్లో (7/48), రెండో ఇన్నింగ్స్లో (6/133) తన సత్తా చాటాడు. ఆసీస్ తరఫున ఆల్రౌండర్ స్టీవ్ ఒకీఫ్ (12/70).. 2017లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఒక ఇన్నింగ్స్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన రికార్డు ఆసీస్ స్పిన్నర్ నాథన్ లైయన్ పేరిట ఉంది. 2017 మార్చిలో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో అతడు 22.2 ఓవర్లు బౌలింగ్ చేసి 50 పరుగులిచ్చి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.
ఎక్కువ వికెట్లు పడగొట్టింది ఎవరంటే?
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మొదటి నుంచి స్పిన్నర్లదే హవా. గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ సిరీస్లో టీమ్ఇండియా తరఫున స్పిన్నర్ అనిల్ కుంబ్లే అత్యధికంగా 111 వికెట్లు పడగొట్టాడు. హర్భజన్ సింగ్ 95 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆసీస్ తరఫున నాథన్ లైయన్ 94 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. 53 వికెట్లతో బ్రెట్ లీ తర్వాతి స్థానంలో నిలిచాడు. మరి ఈ సిరీస్లో ఆసీస్, టీమ్ఇండియా క్రికెటర్లు ఎలాంటి మాయాజాలాన్ని ప్రదర్శిస్తోరో చూడాలి మరి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు