IND vs AUS: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ హీరోలు వీరే!
ఫిబ్రవరి 9 నుంచి 2022-23 బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy) ప్రారంభంకానుంది. తొలి టెస్టు నాగ్పూర్ వేదికగా జరగనుండగా.. ఈ ట్రోఫీలో ఇప్పటివరకు నమోదైన రికార్డులపై ఓ లుక్కేద్దామా..!
ఇంటర్నెట్ డెస్క్: భారత్, ఆసీస్ (IND vs AUS) మధ్య ఎన్ని సిరీస్లు జరిగినా బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) ప్రత్యేకతే వేరు. మిగతా సిరీస్ల్లో ఫలితం ఎలా ఉన్నా ఈ సిరీస్లో గెలవడాన్ని మాత్రం ఇరు జట్లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. స్పిన్నర్లు తమ మాయాజాలంతో బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తే.. పేసర్లు బుల్లెట్ లాంటి బంతులు విసురుతూ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తారు. ఇక, కవ్వింపుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ మాత్రం అవకాశం దొరికినా మాటల యుద్ధానికి దిగి ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీస్తారు. ఇలా హొరాహోరీగా సాగే బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (BGT) రేపే (గురువారం) ప్రారంభం కానుంది. నాగ్పూర్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. మరి BGTలో ఇప్పటివరకు ఉన్న రికార్డులపై ఓ లుక్కేద్దాం..
ఆసీస్ ఒక్కసారే..
ఇరు దేశాలకు చెందిన దిగ్గజ క్రికెటర్లు సునీల్ గావస్కర్ (Sunil Gavaskar), అలెన్ బోర్డర్ (Allen Border) పేరుతో ట్రోఫీని నిర్వహిస్తున్నారు. భారత్లో నిర్వహించిన మొదటి ట్రోఫీ (1996/97)ని టీమ్ఇండియా దక్కించుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక ట్రోఫీని ఇప్పటివరకు 15 సార్లు నిర్వహించగా.. భారత్ 9 సార్లు, ఆస్ట్రేలియా ఐదుసార్లు విజయం సాధించాయి. ఒకసారి (2003/04) డ్రా అయింది. చివరిగా నిర్వహించిన మూడు ట్రోఫీల్లోనూ టీమ్ఇండియానే గెలుపొందింది. భారత్లో బోర్డర్-గావస్కర్ ట్రోఫీని 8 సార్లు నిర్వహించగా.. ఆసీస్ ఒక్కసారి మాత్రమే (2004/05) విజేతగా నిలిచింది.
అత్యధిక పరుగులు చేసింది ఎవరంటే?
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్ తరఫున సచిన్ (Sachin Tendulkar) అత్యధికంగా 3,262 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 16 అర్ధ శతకాలు ఉన్నాయి. భారత్పై ఆసీస్ తరఫున అత్యధికంగా రికీ పాంటింగ్ 2,555 పరుగులు సాధించాడు. 8 శతకాలు, 12 అర్ధ శతకాలు బాదాడు. ప్రస్తుతం క్రికెట్లో కొనసాగుతున్న వారిలో చూసుకుంటే భారత్ తరఫున 1,893 పరుగులతో ఛెతేశ్వర్ పుజారా, ఆసీస్ తరఫున స్టీవ్ స్మిత్ 1,742 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నారు.
అత్యధిక వ్యక్తిగత స్కోరు
ఈ సిరీస్లో భారత్పై అత్యధిక స్కోరు సాధించిన రికార్డు మైఖేల్ క్లార్క్ పేరిట ఉంది. 2012 జనవరిలో సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్లో మైఖేల్ క్లార్క్ 329 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక, భారత్ తరఫున చూసుకుంటే 2001లో ఈడెన్ గార్డెన్స్లో జరిగిన టెస్టు మ్యాచ్లో వీవీఎస్ లక్ష్మణ్ 281 పరుగులు చేశాడు.
భజ్జీ ఫస్ట్.. కుంబ్లే సెకండ్
BGTలో ఒక మ్యాచ్లో అత్యుత్తమ బౌలింగ్ చేసిన రికార్డు హర్భజన్ సింగ్ (Harbhajan Singh) పేరిట ఉంది. 2001లో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో (7/133), రెండో ఇన్నింగ్స్లో 8/84)తో ఆకట్టుకున్నాడు. హర్భజన్ 15 వికెట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. ఇదే చెన్నై మైదానంలో 2004లో జరిగిన మ్యాచ్లో అనిల్ కుంబ్లే (Anil kumble) తొలి ఇన్నింగ్స్లో (7/48), రెండో ఇన్నింగ్స్లో (6/133) తన సత్తా చాటాడు. ఆసీస్ తరఫున ఆల్రౌండర్ స్టీవ్ ఒకీఫ్ (12/70).. 2017లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఒక ఇన్నింగ్స్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన రికార్డు ఆసీస్ స్పిన్నర్ నాథన్ లైయన్ పేరిట ఉంది. 2017 మార్చిలో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో అతడు 22.2 ఓవర్లు బౌలింగ్ చేసి 50 పరుగులిచ్చి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.
ఎక్కువ వికెట్లు పడగొట్టింది ఎవరంటే?
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మొదటి నుంచి స్పిన్నర్లదే హవా. గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ సిరీస్లో టీమ్ఇండియా తరఫున స్పిన్నర్ అనిల్ కుంబ్లే అత్యధికంగా 111 వికెట్లు పడగొట్టాడు. హర్భజన్ సింగ్ 95 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆసీస్ తరఫున నాథన్ లైయన్ 94 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. 53 వికెట్లతో బ్రెట్ లీ తర్వాతి స్థానంలో నిలిచాడు. మరి ఈ సిరీస్లో ఆసీస్, టీమ్ఇండియా క్రికెటర్లు ఎలాంటి మాయాజాలాన్ని ప్రదర్శిస్తోరో చూడాలి మరి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు