Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
ముంబయి ఇండియన్స్ (MI) జట్టులో ఏం జరుగుతుందనేది అభిమానుల్లో ఉత్కంఠగా మారింది. బుమ్రా పెట్టిన పోస్టుపై జట్టునే ఒక కుటుంబంగా భావించే మేనేజ్మెంట్ ఎలా స్పందిస్తుందో అందరిలోనూ మెదిలే ప్రశ్న.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో జస్ప్రీత్ బుమ్రా (Bumrah) పెట్టిన పోస్టు వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ముంబయి ఇండియన్స్ను (MI) అన్ఫాలో చేయడం కూడా నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. హార్దిక్ పాండ్య ముంబయికి తిరిగి రావడమే దానికి ప్రధాన కారణమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. బుమ్రా కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బుమ్రా వ్యవహారంపై టీమ్ఇండియా మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు.
‘‘బుమ్రా వంటి బౌలర్ను తయారు చేయడం చాలా కష్టం. పరిమిత ఓవర్ల క్రికెట్ అయినా.. టెస్టులైనా సరే సహజసిద్ధమైన బౌలింగ్తో అదరగొట్టేస్తాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్. వరల్డ్ కప్లో అతడి ప్రదర్శన చూశాం. అంతకుముందు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లోని ఐదో మ్యాచ్కు కెప్టెన్సీ చేపట్టాడు. ఇప్పుడు హార్దిక్ వంటి ప్లేయర్ తిరిగి రావడం బుమ్రాను బాధించి ఉంటుందేమో.. పాండ్య బయటకు వెళ్లి వచ్చాక ముంబయి ఇండియన్స్ సంబరాలు చేసుకుంటుంది. కానీ, జట్టులో మున్ముందు ఎలాంటి మార్పులు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిస్థితే గతేడాది సీఎస్కేలోనూ చోటు చేసుకుంది. రవీంద్ర జడేజా విషయంలో వెంటనే అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మేనేజ్మెంట్ త్వరగా స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు.
ముంబయి జట్టులోనూ ఈ సమస్యకు పరిష్కారం వెతకాలి. త్వరగా బుమ్రా, హార్దిక్ పాండ్య, రోహిత్ను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాలి. అందుకే, బుమ్రాతో త్వరగా మాట్లాడాలి. బుమ్రా అద్భుతమైన వ్యక్తి. ఒకవేళ అతడు ఇబ్బంది పడినట్లు అనిపిస్తే దానిని మేనేజ్మెంట్ సరిచేయాలి. లేకపోతే భారీ మార్పులే చోటు చేసుకొనే అవకాశం ఉంది’’ అని క్రిష్ శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. బుమ్రా తన ఇన్స్టా స్టోరీలో ‘‘కొన్నిసార్లు మౌనంగా ఉండటమే అత్యుత్తమ సమాధానం’’ అనే కొటేషన్ పెట్టడం కూడా వెళ్లిపోయేందుకు చూస్తున్నాడనేదానికి బలాన్ని చేకూరుస్తోంది. ఒకవేళ బుమ్రా ముంబయి ఇండియన్స్ను వీడాలని నిర్ణయించుకుంటే అతడికి వేలంలో భారీ ధర దక్కడం ఖాయమనే వాదనా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!