Rohit Sharma: ప్రపంచకప్ ఒత్తిడిని ఎదుర్కోవడం రోహిత్కు బాగా తెలుసు: ధావన్
అనుభవజ్ఞుడైన రోహిత్ శర్మకు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసునని.. అది జట్టుకు కచ్చితంగా ఉపయోగపడుతుందని వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్డెస్క్: కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీలో టీమ్ ఇండియా చతికలపడుతోందనే ముద్రను పోగొట్టుకోవడానికి టీ20 ప్రపంచకప్ (T20 World Cup) అద్భుతమైన అవకాశం. ఈసారి జట్టు విజేతగా నిలుస్తుందని వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్ విశ్వాసం వ్యక్తంచేశాడు. అతడు ఓ ఆంగ్లపత్రికతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘ప్రపంచకప్లలో భారత్ ఆడుతుంటే చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ, రోహిత్ శర్మ (Rohit Sharma) అనుభవజ్ఞుడైన ఆటగాడు. అతడికి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసు. భారత్ ఈసారి విజయంతో తిరిగి వస్తుందని నమ్ముతున్నా. శివం దుబే, చాహల్, సంజూకు తగిన అవకాశాలు లభించాయి. వారిని జట్టులో చూసి చాలా సంతోషంగా అనిపించింది. టీమ్ ఇండియా చాలా సమతౌల్యంగా ఉంది’’ అని పేర్కొన్నాడు.
విరాట్ మరోసారి ప్రపంచకప్లో విజృంభిస్తాడని శిఖర్ అంచనా వేశాడు. గత ప్రపంచకప్ల్లో కూడా అతడు రాణించిన విషయాన్ని గుర్తు చేశాడు. ‘‘ఈసారి జట్టు విజయాల్లో రోహిత్తోపాటు.. విరాట్, జెస్సీ (బుమ్రా) కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఛేజ్ మాస్టర్గా పేరున్న విరాట్ మైదానంలో ఉంటేనే.. ప్రత్యర్థి జట్టు ధైర్యం కోల్పోతుంది. ఇక మూడు ఫార్మాట్లలో బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్. భారత్ కప్పు గెలవాలంటే అతడు ముఖ్య భూమిక పోషించాలి’’ అని విశ్లేషించాడు.
ఇక ఈసారి ఐపీఎల్లో పలువురు కుర్రాళ్లు మెరిశారని ధావన్ పేర్కొన్నాడు. ముఖ్యంగా అశుతోష్, శశాంక్లు అత్యంత ఒత్తిడిలో కూడా రాణించారని పేర్కొన్నాడు. వీరిలో తనకు భవిష్యత్తు తారలు కనిపిస్తున్నారని చెప్పాడు. వీరెప్పుడూ లక్ష్యాన్ని పూర్తి చేస్తామనే ఆశలను తమలో కల్పిస్తున్నారన్నాడు.
మరోవైపు జూన్ 5వ తేదీన ప్రారంభం కానున్న ప్రపంచకప్నకు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ సన్నద్ధమవుతున్నాడు. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్లో అద్భుతంగా ఆడిన ఉత్సాహంతో ఈ టోర్నీలో రాణిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 5వ తేదీన న్యూయార్క్లో భారత్ జట్టు ఐర్లాండ్తో తలపడనుంది. టీ20 ప్రపంచకప్ 2007లో మినహా భారత్కు మరెప్పుడూ దక్కలేదు. 2013 నుంచి మన జట్టు ఐసీసీ ట్రోఫీలను కూడా గెలవలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం