Lucknow Vs Chennai: ‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది.
ముంబయితో ఐదు రోజుల కిందట ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ మెరుపులు చూశాం. మరోసారి ఆ అవకాశం వస్తే బాగుండనేది సగటు అభిమాని ఆకాంక్ష. అందుకు తగ్గట్టుగానే ఇవాళ ఏకనా స్టేడియం వేదికగా చెన్నై - లఖ్నవూ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
బ్యాటింగ్లో వీరు కీలకం..
పేపర్ మీద చెన్నై బ్యాటింగ్ లైనప్తో పోలిస్తే లఖ్నవూదే కాస్త బలంగా కనిపిస్తోంది. మ్యాచ్లో మాత్రం తమ జట్టు బ్యాటర్లు తేలిపోవడంతో లఖ్నవూ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. డికాక్, కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, స్టాయినిస్, ఆయుష్ బదోని వంటి టాప్ బ్యాటర్లు ఆ జట్టు సొంతం. కానీ, వీరిలో నిలకడ లేకపోవడం ఇబ్బందిగా మారింది. గత రెండు మ్యాచుల్లో ఆ జట్టు కనీసం 180 పరుగులు కూడా చేయలేకపోవడం గమనార్హం. కేవలం ఒక్కరిద్దరు మాత్రమే రాణిస్తున్నారు. మొదట్లో దూకుడుగా ఆడిన పూరన్ తేలిపోతున్నాడు.
మరోవైపు చెన్నై మాత్రం సమష్ఠిగా ఆడుతూ ప్రత్యర్థి ఎదుట భారీ స్కోరును లక్ష్యంగా ఉంచుతోంది. కెప్టెన్ రుతురాజ్ శుభారంభం అందిస్తే.. మిడిల్లో శివమ్ దూబె ఇన్నింగ్స్ను నడిపిస్తున్నాడు. ఇక చివర్లో ధోనీ భారీ సిక్స్లతో విరుచుకుపడుతూ స్కోరు బోర్డును ఉరుకులు పెట్టిస్తున్నాడు. ముంబయిపై కేవలం 4 బంతుల్లోనే 20 పరుగులు సాధించాడు. అందులో హ్యాట్రిక్ సిక్స్లూ ఉన్నాయి. అజింక్య రహానె, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర కూడా కాస్త కుదురుకుంటే చెన్నైను ఆపడం ఎవరితరమూ కాదు.
పతిరనతో కష్టమే.. మయాంక్ వస్తాడా?
చెన్నై పేసర్ పతిరన గాయం నుంచి కోలుకుని వచ్చాక.. మరింత చెలరేగిపోతున్నాడు. దూకుడుగా ఆడే ముంబయిని కట్టడి చేయడమంటే సాహసమే అని చెప్పాలి. పతిరన మాత్రం కీలక సమయంలో వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బ కొట్టాడు. ‘ఇంపాక్ట్’ ప్లేయర్గా వచ్చి చెన్నైని గెలిపించాడు. ముస్తాఫిజుర్ ఉండటం చెన్నైకి అదనపు బలం. వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేస్తాడు. తుషార్ దేశ్ పాండే, శార్దూల్ పరుగులు ఇవ్వడాన్ని నియంత్రించాలి. స్పిన్ భారం రవీంద్ర జడేజాదే. బెస్ట్ ఎకానమీతో (7.45) బంతులేస్తున్న జడ్డూ ఎక్కువ పరుగులు ఇవ్వకుండా బౌలింగ్ చేయడం అతడి స్పెషాలిటీ.
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత వేగవంతమైన బౌలర్గా మారిన లఖ్నవూ పేసర్ మయాంక్ యాదవ్కు గాయాల బెడద ఎక్కువైంది. గత మూడు మ్యాచ్లకు దూరమైన సంగతి తెలిసిందే. ఇవాళ చెన్నైతోనైనా ఆడతాడా? అనేది క్లారిటీ లేదు. ఆ జట్టు బౌలింగ్ కోచ్ కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్ననప్పటికీ.. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తేనే ఆడిస్తామని చెప్పడంతో అభిమానుల్లో సందేహాలు ఎక్కువైపోయాయి. మెగా టోర్నీలో తొలిసారి ఆడుతున్న షమార్ జోసెఫ్ తేలిపోయాడు. తన మొదటి మ్యాచ్లో వికెట్ తీయకపోగా.. 4 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చాడు. ఇదే సీజన్లో ఒక మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన యశ్ ఠాకూర్ కూడా ఇప్పుడు పెద్దగా ప్రభావం చూపించడం లేదు. రవి బిష్ణోయ్, కృనాల్, మోహ్సిన్ ఖాన్పైనే బౌలింగ్ భారం పడింది.
పిచ్ పరిస్థితి.. టాస్ నెగ్గితే ఏంటి?
ఐపీఎల్లో అలవోకగా 200+ స్కోర్లు నమోదవుతుంటే.. ఏకనా మైదానంలో జరిగిన గత మూడు మ్యాచుల్లోనూ ఈ మార్క్ దాటకపోవడం గమనార్హం. పంజాబ్పై లఖ్నవూ 199 పరుగులు చేసింది. ఇదే ఈ సీజన్లో అత్యధికం. పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకుల అంచనా. టాస్ నెగ్గే జట్టు తొలుత బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపనుంది. ఇప్పటివరకు ఇరు జట్లూ కేవలం రెండు మ్యాచుల్లోనే తలపడ్డాయి. చెరొక విజయంతో సమంగా నిలిచాయి. ఈ మ్యాచ్లో చెన్నై గెలిస్తే.. హ్యాట్రిక్ విక్టరీ అవుతుంది. అప్పుడు లఖ్నవూకు హ్యాట్రిక్ ఓటమి ఎదురవుతుంది.
తుది జట్లు (అంచనా):
లఖ్నవూ: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), దీపక్ హుడా, ఆయుశ్ బదోని, మార్కస్ స్టాయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్, మోహ్సిన్ ఖాన్, షమార్ జోసెఫ్, యశ్ ఠాకూర్. ఇంపాక్ట్ ప్లేయర్: మయాంక్ యాదవ్/అర్షద్ ఖాన్
చెన్నై: రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అజింక్య రహానె, మొయిన్ అలీ, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్ పాండే, ముస్తాఫిజుర్ రహ్మాన్. ఇంపాక్ట్ ప్లేయర్: పతిరన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
-
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు