Chennai: చెన్నై ఇప్పటికీ మూడు లేదా నాలుగులో నిలవొచ్చు.. ఎలాగంటే?
భారత టీ20 లీగ్ అత్యంత కీలక దశకు చేరుకుంది. లీగ్ స్టేజ్లో ఆదివారం నాటికి 55 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇంకా 15 మాత్రమే మిగిలాయి...
భారత టీ20 లీగ్ కీలక దశకు చేరుకుంది. లీగ్ స్టేజ్లో ఆదివారం నాటికి 55 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇంకా 15 మాత్రమే మిగిలాయి. దీంతో ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ ప్రతి జట్టుకూ చాలా కీలకమైనది. ఇప్పుడు టాప్-4లో నిలిచిన లఖ్నవూ, గుజరాత్, రాజస్థాన్, బెంగళూరు తేలిగ్గా ప్లేఆఫ్స్ చేరేలా కనిపిస్తున్నా మిగతా జట్లూ టాప్లోకి దూసుకొచ్చే వీలుంది. ఈ నేపథ్యంలో చెన్నై కూడా రాణిస్తే మూడు లేదా నాలుగులో నిలిచే అవకాశాలు ఉన్నాయి.
ముంబయి: ముంబయి ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి కేవలం 2 విజయాలే సాధించింది. దీంతో ప్రస్తుతం పదో స్థానంలో కొనసాగుతున్న ఆ జట్టు.. ఇకపై బాగా ఆడి, మిగిలిన మ్యాచ్లన్నింటిలో గెలిచినా గరిష్ఠంగా ఐదో స్థానంలోనే నిలుస్తుంది.
కోల్కతా: కోల్కతా ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడి 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు ఇకపై అద్భుతంగా పుంజుకొని రాణించినా లీగ్ స్టేజ్ పూర్తయ్యేసరికి గరిష్ఠంగా నాలుగో స్థానంలో నిలిచే అవకాశం ఉంది. అది కూడా ఇతర జట్లతో పోటీపడాల్సిన స్థితిలోనే. ఇది జరగాలంటే అద్భుతమే అని చెప్పాలి.
చెన్నై: ప్రస్తుతం కోల్కతా మాదిరే చెన్నై 11 మ్యాచ్ల్లో 4 విజయాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆదివారం దిల్లీని ఓడించడంతో కాస్త ఉపశమనం లభించింది. దీంతో ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్ల్లోనూ ఇలాగే గొప్ప విజయాలు సాధిస్తే ఇతర జట్లతో సమానంగా 14 పాయింట్లు పంచుకునే వీలుంది. అప్పుడు వాటి కన్నా రన్రేట్ మెరుగ్గా ఉంటే మూడు లేదా నాలుగు స్థానాల్లో నిలిచే వీలుంది. అలా జరగడానికి చాలా తక్కువ అవకాశాలే ఉన్నాయి.
పంజాబ్: పంజాబ్ ప్రస్తుతం 11 మ్యాచ్ల్లో 5 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే మిగతా మూడు మ్యాచ్లు గెలవాలి. అప్పుడు రెండు, మూడు లేదా నాలుగు స్థానాల్లో నిలిచే వీలుంది. అది కూడా ఇతర జట్లతో రన్రేట్ పరంగా మెరుగ్గా ఉంటేనే. అది జరగాలంటే ఇకపై విశేషంగా రాణించాలి.
హైదరాబాద్: హైదరాబాద్ ఇప్పుడు 11 మ్యాచ్ల్లో 5 విజయాలతోనే ఆరో స్థానంలో నిలిచింది. ఇకపై మిగిలిన మూడు మ్యాచ్లు గెలిస్తే టాప్-4లో ఎక్కడైనా నిలవొచ్చు. కానీ ఆదివారం బెంగళూరు చేతిలో ఓడిపోవడంతో అవకాశాలు క్లిష్టంగా మారాయి.
దిల్లీ: దిల్లీ కూడా హైదరాబాద్లాగే ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 5 విజయాలతోనే ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు కూడా టాప్-4లో ఎక్కడైనా నిలవొచ్చు. అయితే, ఇతర జట్లతో పాయింట్లు సమానంగా ఉంటే రన్రేట్ అత్యంత కీలకం అవుతుంది.
బెంగళూరు: బెంగళూరు ప్రస్తుతం ఆడిన 12 మ్యాచ్ల్లో 7 విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇకపై మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తే టాప్-1లో నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు టాప్లో ఉన్న జట్లు మిగతా మ్యాచ్ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది.
రాజస్థాన్: రాజస్థాన్ ఇప్పుడు బెంగళూరు మాదిరే 11 మ్యాచ్ల్లో 7 విజయాలతో టాప్-3లో ఉంది. ఇకపై ఆడాల్సిన మూడు మ్యాచ్లు గెలిస్తే టాప్-1లో ప్లేఆఫ్స్ చేరుతుంది. అందుకు మెరుగైన అవకాశాలున్నాయి. కాకపోతే కాస్త ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది.
గుజరాత్: గుజరాత్ వరుస విజయాలతో మొన్నటివరకూ టాప్-1లో నిలిచినా రెండు వరుస అపజయాలతో ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయింది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 11 మ్యాచ్ల్లో 8 విజయాలు సాధించింది. ఒకవేళ ఇకపై మిగిలిన మూడు మ్యాచ్ల్లో ఓటమిపాలైనా నాలుగోస్థానంలో నిలిచే అవకాశం ఉంది.
లఖ్నవూ: లఖ్నవూ ఇప్పుడు వరుస విజయాలతో టాప్లో దూసుకుపోతోంది. గుజరాత్లాగే ఈ జట్టు కూడా 11 మ్యాచ్ల్లో 8 విజయాలతో కొనసాగుతోంది. ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉన్నా.. అవి ఓడిపోయినా ప్లేఆఫ్స్ చేరే వీలుంది. ఇప్పటికే 16 పాయింట్లు సాధించడం అందుకు కారణం.
నోట్: ఇక్కడ చెప్పిన విషయాలన్నీ జరగాలంటే ప్రతి జట్టూ ఇకపై తాము ఆడాల్సిన అన్ని మ్యాచ్లు తప్పక గెలవాల్సిందే. అది కూడా నెట్రన్ పరంగా ఇతర జట్లతో నెగ్గుకొస్తేనే.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్