CSK: తిరుగులేని చెన్నై.. పన్నెండోసారీ ప్లేఆఫ్స్లోకి!
ఐపీఎల్లో (IPL) అత్యంత విజయవంతమైన జట్టు ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK). నాలుగు సార్లు ఛాంపియన్గా నిలిచిన సీఎస్కే.. మరోసారి ప్లేఆఫ్స్లోకి దూసుకెళ్లింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ మరో రికార్డు సృష్టించింది. మెగా టోర్నీలో అత్యధిక సార్లు ప్లేఆఫ్స్కు చేరిన జట్టుగా ఇప్పటికే రికార్డుకెక్కిన చెన్నై.. ఆ సంఖ్యను మరింత పెంచుకుంది. తాజాగా దిల్లీ క్యాపిటల్స్ను ఓడించి మరీ చెన్నై (CSK) ప్లేఆఫ్స్ను బెర్తును ఖరారు చేసుకుంది. దీంతో మొత్తం 16 సీజన్లలో 12 సార్లు ప్లేఆఫ్స్కు చేరిన ఏకైక జట్టు సీఎస్కే. ఆ తర్వాత ముంబయి (ఈ సీజన్లో కాకుండా) 9 సార్లు చేరుకుంది. రెండు సీజన్లలో సీఎస్కేపై నిషేధం పడిన సంగతి తెలిసిందే. మరో రెండుసార్లు మాత్రమే లీగ్ స్టేజ్కు పరిమితమైంది. ఇప్పటి వరకు నాలుగు టైటిళ్లను సీఎస్కే తన ఖాతాలో వేసుకుంది. మరి ఏ సీజన్లో ఎలా అనేది ఓసారి చూద్దాం..
- 2008: ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. అయితే, అక్కడ రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడింది. దీంతో రన్నరప్గా నిలిచింది.
- 2009: సెమీఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో చెన్నై ఓడిపోయింది. దీంతో ఫైనల్కు చేరి కప్ను సాధిద్దామనే కల నెరవేరలేదు.
- 2010: వరుసగా రెండు సీజన్లలో అదరగొట్టిన సీఎస్కే మూడోసారి విజేతగా నిలిచింది. ఈ సీజన్ ఫైనల్లో ముంబయిని ఓడించి ఛాంపియన్గా అవతరించింది.
- 2011: డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన చెన్నై ఈసారి కూడా అదరగొట్టేసి విజేతగా నిలిచింది. ఫైనల్లో బెంగళూరును ఓడించి వరుసగా రెండోసారి ఛాంపియన్గా చెన్నై అవతరించింది.
- 2012: హ్యాట్రిక్ ఛాంపియన్గా నిలుద్దామనే ఆశలకు బ్రేక్ పడింది. ఫైనల్లో కోల్కతా నైట్రైడర్స్ చేతిలో ఓడిపోయింది.
- 2013: ఈసారి కూడా రన్నరప్గానే టోర్నీని ముగించింది. ఫైనల్కు చేరిన చెన్నై.. ముంబయి ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది.
- 2014: ఈ సీజన్లో ప్లేఆఫ్స్కు చేరిన చెన్నై మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండో క్వాలిఫయర్లో పంజాబ్ చేతిలో ఓడింది. కానీ, అదే ఏడాదిలో జరిగిన ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీ విజేతగా నిలిచింది.
- 2015: మరోసారి రన్నరప్గానే టోర్నీని ముగించింది. ఫైనల్ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. దీంతో అత్యధిక సార్లు ప్లేఆఫ్స్కు చేరిన జట్టుగా చెన్నై రికార్డు సృష్టించింది.
- 2018: వరుసగా రెండు సీజన్లలో (2016, 2017) నిషేధానికి గురైన చెన్నై... మళ్లీ పునరాగమనం చేసిన సీజన్లోనే ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది.
- 2019: ఈ సీజన్లోనూ చెన్నై మళ్లీ ఫైనల్కు దూసుకెళ్లింది. అయితే, ఫైనల్లో ఒక్క పరుగు తేడాతో ముంబయి చేతిలో ఓడిపోయి కప్ను చేజార్చుకుంది.
- 2021: అంతకుముందు ఏడాది (2020 సీజన్)లో లీగ్ స్టేజ్కే పరిమితమైన చెన్నై పుంజుకుంది. ఫైనల్లో కోల్కతా నైట్రైడర్స్ను చిత్తు చేసి మరీ నాలుగోసారి ధోనీసేన టైటిల్ను సొంతం చేసుకుంది.
- 2023: గతేడాది పేలవ ప్రదర్శనతో విమర్శలపాలైన చెన్నై.. ఈసారి మాత్రం అదరగొట్టింది. ధోనీకి చివరి సీజన్గా భావిస్తున్న సమయంలో ప్లేఆఫ్స్కు దూసుకెళ్లింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?