Ashwin-Shakib: అప్పుడు అశ్విన్.. ఇప్పుడు షకిబ్.. వివాదాస్పద ఔట్లతో ప్రపంచ క్రికెట్లో ప్రకంపనలు
మాథ్యూస్ టైమ్డ్ ఔట్ వివాదంలో షకిబ్ అల్హసన్ వ్యవహరించిన తీరు ఎంత వరకు సమంజసం అనే చర్చలోకి వెళ్లే ముందు.. నాలుగేళ్ల ముందు ఐపీఎల్లో జరిగిన ఒక సంచలన ఉదంతం గురించి మాట్లాడుకుందాం..
వన్డే ప్రపంచకప్లో సోమవారం శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ జరిగింది.. మామూలుగా చూస్తే ఈ మ్యాచ్కు అంతగా ప్రాధాన్యం లేదు. బంగ్లాదేశ్ ఎప్పుడో సెమీస్ రేసుకు దూరమైంది. శ్రీలంక సాంకేతికంగా మాత్రమే రేసులో ఉంది కానీ.. ఆ జట్టు కూడా నిష్క్రమించినట్లే. ఎవరికీ ఈ మ్యాచ్ మీద పెద్దగా ఆసక్తి లేదు. కానీ మ్యాచ్ మొదలైన రెండు గంటల తర్వాత.. క్రికెట్ ప్రపంచమంతా ఈ మ్యాచ్లో జరిగిన ఓ ఉదంతం గురించి మాట్లాడుకుంది. అందుక్కారణం.. లంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్గా వెనుదిరగడం. అతడి అప్పీల్ కోసం అడిగి, దానికే కట్టుబడ్డ షకిబ్ పెద్ద విలన్ అయిపోయాడు. ఈ మ్యాచ్ వరకు షకిబ్ చేసింది తప్పే అయినా.. అతడి నిర్ణయం అంతర్జాతీయ క్రికెట్లో ఓ మంచి మార్పునకు దోహదం చేస్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మాథ్యూస్ టైమ్డ్ ఔట్ వివాదంలో షకిబ్ అల్హసన్ వ్యవహరించిన తీరు ఎంత వరకు సమంజసం అనే చర్చలోకి వెళ్లే ముందు.. నాలుగేళ్ల ముందు ఐపీఎల్లో జరిగిన ఒక సంచలన ఉదంతం గురించి మాట్లాడుకుందాం. ఆ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు ప్రాతినిధ్యం వహించిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ను మన్కడింగ్తో రనౌట్ చేశాడు. బౌలర్ బంతి వేస్తున్నపుడు నాన్స్ట్రైకర్ బంతి రిలీజ్ చేసే వరకు క్రీజులోనే ఉండాలి. అంతకంటే ముందే క్రీజును వదిలితే.. రనౌట్ చేయడం నిబంధనల ప్రకారం సరైందే. కానీ ఇలా ఔట్ చేయడాన్ని క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా చూసేవాళ్లు.
ఒకప్పుడు భారత ఆటగాడు వినూ మన్కడ్ ప్రత్యర్థి ఆటగాడిని ఇలా ఔట్ చేసినందుకే దానికి ‘మన్కడింగ్’ అన్న పేరు కూడా వచ్చింది. అయితే ఇలా ఔట్ చేయడాన్ని మహా పాపంలా చూసేవాళ్లు ఒకప్పుడు. కానీ అశ్విన్.. బట్లర్ను ఔట్ చేసినపుడు దీని మీద విస్తృత చర్చ జరిగింది. మళ్లీ మళ్లీ హెచ్చరించినా కూడా వినకుండా బట్లర్ అలా క్రీజును వదలడంతో అశ్విన్కు ఔట్ చేయడం తప్ప మరో మార్గం కనిపించలేదు. ముందే క్రీజును వదిలి బ్యాటర్ అదనపు ప్రయోజనం పొందుతున్నపుడు.. ఇలా ఔట్ చేయడం క్రీడా స్ఫూర్తికి ఎలా విరుద్ధం అవుతుందనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఐసీసీ సైతం ఈ రనౌట్ పూర్తిగా నిబంధనలకు లోబడి చేసేదే అని, అందులో తప్పేమీ లేదని స్పష్టం చేసింది. ఆ సమయంలో దీని మీద జరిగిన విస్తృత చర్చ తర్వాత ఇందులో క్రీడా స్ఫూర్తి కోణం పక్కకు వెళ్లింది. అశ్విన్కు మద్దతు పెరిగింది. క్రమంగా బ్యాటర్లు ముందే క్రీజును వీడే అలవాటును తగ్గించుకున్నారు. అది ఒక రకంగా క్రికెట్కు మంచే చేసిందనే అభిప్రాయం ఏర్పడింది.
వర్తమానంలోకి వస్తే..
ఇప్పుడు మాథ్యూస్ టైమ్డ్ ఔట్ కోసం అప్పీల్ చేసిన షకిబ్ను చాలామంది తప్పుబడుతున్నారు. నిజానికి షకిబ్ అన్యాయంగా వ్యవహరించాడనే చెప్పాలి. ఎందుకంటే మాథ్యూస్ క్రీజులోకి రావడంలోనే ఆలస్యం చేసి ఉంటే అతడిది తప్పే. కానీ వికెట్ పడ్డాక నిర్ణీత వ్యవధిలోనే (2 నిమిషాలు) అతను క్రీజులోకి వచ్చి బంతిని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. కానీ హెల్మెట్ పట్టీ ఊడిపోవడంతో అది గమనించి ఇంకో హెల్మెట్ అడిగి తెప్పించుకుని బ్యాటింగ్కు సిద్ధమయ్యాడు. ఈ విషయం వివరించే ప్రయత్నం చేసినా.. షకిబ్ ఒప్పుకోలేదు. అంపైర్లు కూడా షకిబ్కు సర్దిచెప్పాలని చూసినా ఫలితం లేకపోయింది. తాను నిబంధనల ప్రకారమే అప్పీల్ చేశానని అతనన్నాడు. అంపైర్లు కూడా నిబంధనల ప్రకారమే మాథ్యూస్ను ఔట్ చేశాడు. మొత్తం వ్యవహారంలో షకిబ్ దోషిగానే కనిపిస్తున్నాడు.
కానీ ఈ మ్యాచ్లో అతను అన్యాయంగా వ్యవహరించినట్లు అనిపించినా.. టైమ్డ్ ఔట్ విషయంలో బ్యాటర్లు మరీ తేలిగ్గా తీసుకుంటున్నారని.. చాలామంది నిర్ణీత వ్యవధి కన్నా ఎక్కువ సమయం తీసుకుంటున్నారని.. దీని వల్ల ఫీల్డింగ్ జట్లు ఇబ్బంది పడుతున్నాయని.. మ్యాచ్లో సమయం వృథా అవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల భారత్తో ప్రపంచకప్ మ్యాచ్లో రిజ్వాన్ సైతం ఎక్కువ సమయం వృథా చేయడంతో కోహ్లి గడియారం చూస్తున్నట్లుగా సంజ్ఞ చేసి అసహనం వ్యక్తం చేయడం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మాథ్యూస్ ఉదంతం వల్ల టైమ్డ్ ఔట్ మీద పెద్ద చర్చ జరగడంతో ఇకపై బ్యాటర్లు జాగ్రత్త పడతారని.. నిర్ణీత వ్యవధిలో క్రీజులోకి చేరుకుని బ్యాటింగ్ ఆరంభిస్తారని.. ఇది ఒక రకంగా క్రికెట్కు మంచిదే అనే వాదన వినిపిస్తోంది.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు