Rishabh pant: ఎప్పుడొస్తావ్ పంత్.. పునరాగమనంపై అభిమానుల్లో ఉత్కంఠ!
మహేంద్రసింగ్ ధోని లాంటి ఆల్టైం గ్రేట్ స్థానాన్ని భర్తీ చేస్తూ సత్తా చాటిన పంత్ పోటీ క్రికెట్లోకి ఎప్పుడొస్తాడనే ప్రశ్న అభిమానులను తొలిచేస్తోంది.
(source: pant insta)
వికెట్ కీపర్ బ్యాట్స్మన్గా భారత క్రికెట్ జట్టులో మహేంద్రసింగ్ ధోని లాంటి ఆల్టైం గ్రేట్ స్థానాన్ని భర్తీ చేయడమంటే మాటలు కాదు. ధోని ఉండగానే వివిధ ఫార్మాట్లలో అనేకమంది వికెట్ కీపర్ బ్యాటర్లను ప్రయత్నించి చూసింది భారత్. వాళ్లందరిలో ఎక్కువ ఆకట్టుకున్నది, నిలకడగా ఆడింది రిషబ్ పంత్ (Rishabh pant). వివిధ ఫార్మాట్లలో సత్తా చాటుతున్న ఈ కుర్రాడు గతేడాది డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆటకు దూరం కావడం అభిమానులకు పెద్ద షాక్. ఆ ప్రమాదం జరిగాక దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఎట్టకేలకు బ్యాటింగ్ చేస్తూ కనిపించిన వీడియో సామాజిక మాధ్యమాలను ఊపేసింది. ఇంతకీ పంత్ పోటీ క్రికెట్లోకి ఎప్పుడొస్తాడనే ప్రశ్న అభిమానులను తొలిచేస్తోంది.
సాధారణ నేపథ్యం నుంచి వచ్చి.. ఎంతో కష్టం, పట్టుదలతో టీమ్ఇండియా స్థాయికి ఎదిగిన కుర్రాడు రిషబ్ పంత్. 2018 అండర్-19 ప్రపంచకప్తో వెలుగులోకి వచ్చిన అతను.. ఐపీఎల్లో, దేశవాళీల్లో సత్తా చాటి త్వరగానే భారత జట్టులో స్థానం సంపాదించాడు. ధోని కెరీర్ చరమాంకంలో ఉన్న దశలో ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్న దశలో రిషబ్ తన ప్రతిభతో సెలక్టర్లను మెప్పించాడు. అప్పటికే టెస్టుల్లో రెగ్యులర్ వికెట్ కీపర్గా ఉన్న వృద్ధిమాన్ సాహాను వెనక్కి నెట్టి టెస్టుల్లో నిలదొక్కుకున్నాడు. 2021-22 సీజన్లో ఆస్ట్రేలియాతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో టీమ్ఇండియా చరిత్రాత్మక విజయం సాధించడంలో ఈ హరిద్వార్ కుర్రాడిది కీలక పాత్ర. ఆ సిరీస్లోనే కాక మరి కొన్ని మ్యాచ్ల్లో మెరుపు ఇన్నింగ్స్లు ఆడాడు. వన్డేలు, టీ20ల్లోనూ సత్తా చాటాడు. ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ తరఫునా అతను అదరగొట్టాడు. ఆ జట్టుకు కెప్టెన్గానూ వ్యవహరించాడు. ఇలా కెరీర్ గొప్పగా సాగిపోతున్న దశలో గత ఏడాది డిసెంబరులో దిల్లీ నుంచి తన స్వస్థలానికి కారులో ప్రయాణిస్తుండగా.. రోడ్డు ప్రమాదానికి గురి కావడం సంచలనం రేపింది. త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకున్నప్పటికీ.. రిషబ్ మోకాలికి తీవ్ర గాయమే అయింది.
డెహ్రాడూన్ నుంచి అత్యవసరంగా హెలికాఫ్టర్లో ముంబయికి తరలించి మరీ అతడికి చికిత్స అందించింది బీసీసీఐ. లిగ్మెంట్ సర్జరీతో పాటు మరికొన్ని శస్త్రచికిత్సలు చేయించుకున్న కొన్ని నెలల పాటు ఇంటికే పరిమితం అయ్యాడు. నడక మొదలుపెట్టాక జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కు చేరుకుని పూర్తి ఫిట్నెస్ సాధించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ మధ్యే నెమ్మదిగా బ్యాటింగ్ సాధన ఆరంభించాడు. ఈ క్రమంలోనే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బెంగళూరు సమీపంలో జేఎస్డబ్ల్యూ ఫౌండేషన్ నిర్వహించిన వేడుకల్లో భాగంగా సరదాగా కాసేపు క్రికెట్ మ్యాచ్ ఆడాడు. పంత్ ప్యాడ్లు కట్టుకుని క్రీజులోకి వచ్చి బ్యాటింగ్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో అతడి పునరాగమనం మీద ఆసక్తి పెరిగింది.
ఐపీఎల్కు గ్యారెంటీ!
పంత్ ఏదో సరదాకి ఈ మ్యాచ్ ఆడాడు కానీ.. అతను మ్యాచ్ ఫిట్నెస్ సాధించడానికి ఇంకా సమయం పట్టేలాగే ఉంది. వన్డే ప్రపంచకప్నకు అతను అందుబాటులోకి వస్తాడని ఎంతమాత్రం ఆశలు పెట్టుకోవడానికి లేదు. ఈ ఏడాది అయితే పోటీ క్రికెట్లోకి వచ్చే అవకాశాలు దాదాపు లేనట్లే. తీవ్ర గాయాలు, శస్త్రచికిత్సల నుంచి కోలుకుని.. అంతర్జాతీయ స్థాయిలో పోటీకి తగ్గట్లు మ్యాచ్ ఫిట్నెస్ సాధించాలంటే సమయం పడుతుంది. ఎన్సీఏ వైద్యుల బృందం అతడికి ప్రత్యేకమైన ఫిట్నెస్ ప్రణాళిక రూపొందించింది. దశల వారీగా ఎప్పుడేం చేయాలో అందులో పొందుపరిచారు. ఓవైపు శారీరక దృఢత్వం కోసం కష్టపడుతూ తేలికపాటి క్రికెట్ సాధన చేస్తున్నాడు. ఈ ఏడాది చివరికి అతను మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తాడని భావిస్తున్నారు. ఆ తర్వాత కూడా నేరుగా భారత జట్టులోకి పునరాగమనం చేయకపోవచ్చు. ముందు దేశవాళీల్లో ఆడి ఫిట్నెస్, ఫామ్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. టీమ్ఇండియాలోకి సరిగ్గా ఎప్పుడు వస్తాడో చెప్పలేం కానీ.. 2024 ఐపీఎల్లో పంత్ ఆడే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అందులో సత్తా చాటితే భారత జట్టులోకి పునరాగమనం లాంఛనమే కావచ్చు.
అతడు లేని లోటు
పంత్ లేని సమయంలో భారత జట్టు బాగానే ఇబ్బంది పడింది. ముఖ్యంగా టెస్టుల్లో వికెట్ కీపర్ బ్యాటర్గా తన స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు కనిపించలేదు. పంత్ స్థానంలో ఆడిన ఆంధ్రా కుర్రాడు శ్రీకర్ భరత్ అవకాశాలను ఉపయోగించుకోలేకపోయాడు. వికెట్ కీపింగ్లో ఆకట్టుకున్నప్పటికీ బ్యాటింగ్లో విఫలమయ్యాడు. ఇషాన్ కిషన్ కొన్ని మ్యాచ్లు ఆడినా.. పంత్కు ప్రత్యామ్నాయంలా కనిపించలేదు. ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో పంత్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో భారత అభిమానులు పంత్ను బాగా గుర్తు చేసుకున్నారు. అతనుంటే కథ వేరుగా ఉండేదని ఫీలయ్యారు. రాబోయే వన్డే ప్రపంచకప్లోనూ పంత్ లేకపోవడం భారత్కు ప్రతికూలమే. వికెట్ కీపింగ్ చేసే కేఎల్ రాహుల్ సైతం ప్రపంచకప్నకు అనుమానంగా మారగా.. పంత్ లేని లోటును ఇషాన్ కిషన్, సంజు శాంసన్ లాంటి ఆటగాళ్లు ఏమేర భర్తీ చేస్తారో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అత్యుత్తమ వార్షిక జట్ల ర్యాంకులను ఐసీసీ ప్రకటించింది. భారత్ ఎప్పటిలానే తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అగ్రస్థానంలో నిలిచింది. -
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
ముంబయితో మ్యాచ్కు ముందు ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడిన కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అందరికంటే ఓ బ్యాటర్కు చాలా భయపడేవాడినని పేర్కొన్నాడు. -
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
వరల్డ్ కప్ కోసం స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. అతడికే వైస్ కెప్టెన్సీని అప్పగించింది. -
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన రొమారియో షెఫర్డ్ బౌలర్గా గొప్ప ప్రదర్శనేమీ ఇవ్వడం లేదు. కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టిన అతడు మరోసారి అవకాశం వస్తే చెలరేగుతానని వ్యాఖ్యనించాడు. -
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
రాజస్థాన్ తరఫున అద్భుతంగా ఆడుతున్న రియాన్ పరాగ్ తన ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్పై కీలక ఇన్నింగ్స్ ఆడినా.. తన బెస్ట్ మాత్రం ఇది కాదంటున్నాడు. -
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
ఉత్కంఠపోరులో రాజస్థాన్ను ఓడించిన హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకొచ్చింది. -
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు