Rishabh pant: ఎప్పుడొస్తావ్ పంత్.. పునరాగమనంపై అభిమానుల్లో ఉత్కంఠ!
మహేంద్రసింగ్ ధోని లాంటి ఆల్టైం గ్రేట్ స్థానాన్ని భర్తీ చేస్తూ సత్తా చాటిన పంత్ పోటీ క్రికెట్లోకి ఎప్పుడొస్తాడనే ప్రశ్న అభిమానులను తొలిచేస్తోంది.
(source: pant insta)
వికెట్ కీపర్ బ్యాట్స్మన్గా భారత క్రికెట్ జట్టులో మహేంద్రసింగ్ ధోని లాంటి ఆల్టైం గ్రేట్ స్థానాన్ని భర్తీ చేయడమంటే మాటలు కాదు. ధోని ఉండగానే వివిధ ఫార్మాట్లలో అనేకమంది వికెట్ కీపర్ బ్యాటర్లను ప్రయత్నించి చూసింది భారత్. వాళ్లందరిలో ఎక్కువ ఆకట్టుకున్నది, నిలకడగా ఆడింది రిషబ్ పంత్ (Rishabh pant). వివిధ ఫార్మాట్లలో సత్తా చాటుతున్న ఈ కుర్రాడు గతేడాది డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆటకు దూరం కావడం అభిమానులకు పెద్ద షాక్. ఆ ప్రమాదం జరిగాక దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఎట్టకేలకు బ్యాటింగ్ చేస్తూ కనిపించిన వీడియో సామాజిక మాధ్యమాలను ఊపేసింది. ఇంతకీ పంత్ పోటీ క్రికెట్లోకి ఎప్పుడొస్తాడనే ప్రశ్న అభిమానులను తొలిచేస్తోంది.
సాధారణ నేపథ్యం నుంచి వచ్చి.. ఎంతో కష్టం, పట్టుదలతో టీమ్ఇండియా స్థాయికి ఎదిగిన కుర్రాడు రిషబ్ పంత్. 2018 అండర్-19 ప్రపంచకప్తో వెలుగులోకి వచ్చిన అతను.. ఐపీఎల్లో, దేశవాళీల్లో సత్తా చాటి త్వరగానే భారత జట్టులో స్థానం సంపాదించాడు. ధోని కెరీర్ చరమాంకంలో ఉన్న దశలో ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్న దశలో రిషబ్ తన ప్రతిభతో సెలక్టర్లను మెప్పించాడు. అప్పటికే టెస్టుల్లో రెగ్యులర్ వికెట్ కీపర్గా ఉన్న వృద్ధిమాన్ సాహాను వెనక్కి నెట్టి టెస్టుల్లో నిలదొక్కుకున్నాడు. 2021-22 సీజన్లో ఆస్ట్రేలియాతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో టీమ్ఇండియా చరిత్రాత్మక విజయం సాధించడంలో ఈ హరిద్వార్ కుర్రాడిది కీలక పాత్ర. ఆ సిరీస్లోనే కాక మరి కొన్ని మ్యాచ్ల్లో మెరుపు ఇన్నింగ్స్లు ఆడాడు. వన్డేలు, టీ20ల్లోనూ సత్తా చాటాడు. ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ తరఫునా అతను అదరగొట్టాడు. ఆ జట్టుకు కెప్టెన్గానూ వ్యవహరించాడు. ఇలా కెరీర్ గొప్పగా సాగిపోతున్న దశలో గత ఏడాది డిసెంబరులో దిల్లీ నుంచి తన స్వస్థలానికి కారులో ప్రయాణిస్తుండగా.. రోడ్డు ప్రమాదానికి గురి కావడం సంచలనం రేపింది. త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకున్నప్పటికీ.. రిషబ్ మోకాలికి తీవ్ర గాయమే అయింది.
డెహ్రాడూన్ నుంచి అత్యవసరంగా హెలికాఫ్టర్లో ముంబయికి తరలించి మరీ అతడికి చికిత్స అందించింది బీసీసీఐ. లిగ్మెంట్ సర్జరీతో పాటు మరికొన్ని శస్త్రచికిత్సలు చేయించుకున్న కొన్ని నెలల పాటు ఇంటికే పరిమితం అయ్యాడు. నడక మొదలుపెట్టాక జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కు చేరుకుని పూర్తి ఫిట్నెస్ సాధించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ మధ్యే నెమ్మదిగా బ్యాటింగ్ సాధన ఆరంభించాడు. ఈ క్రమంలోనే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బెంగళూరు సమీపంలో జేఎస్డబ్ల్యూ ఫౌండేషన్ నిర్వహించిన వేడుకల్లో భాగంగా సరదాగా కాసేపు క్రికెట్ మ్యాచ్ ఆడాడు. పంత్ ప్యాడ్లు కట్టుకుని క్రీజులోకి వచ్చి బ్యాటింగ్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో అతడి పునరాగమనం మీద ఆసక్తి పెరిగింది.
ఐపీఎల్కు గ్యారెంటీ!
పంత్ ఏదో సరదాకి ఈ మ్యాచ్ ఆడాడు కానీ.. అతను మ్యాచ్ ఫిట్నెస్ సాధించడానికి ఇంకా సమయం పట్టేలాగే ఉంది. వన్డే ప్రపంచకప్నకు అతను అందుబాటులోకి వస్తాడని ఎంతమాత్రం ఆశలు పెట్టుకోవడానికి లేదు. ఈ ఏడాది అయితే పోటీ క్రికెట్లోకి వచ్చే అవకాశాలు దాదాపు లేనట్లే. తీవ్ర గాయాలు, శస్త్రచికిత్సల నుంచి కోలుకుని.. అంతర్జాతీయ స్థాయిలో పోటీకి తగ్గట్లు మ్యాచ్ ఫిట్నెస్ సాధించాలంటే సమయం పడుతుంది. ఎన్సీఏ వైద్యుల బృందం అతడికి ప్రత్యేకమైన ఫిట్నెస్ ప్రణాళిక రూపొందించింది. దశల వారీగా ఎప్పుడేం చేయాలో అందులో పొందుపరిచారు. ఓవైపు శారీరక దృఢత్వం కోసం కష్టపడుతూ తేలికపాటి క్రికెట్ సాధన చేస్తున్నాడు. ఈ ఏడాది చివరికి అతను మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తాడని భావిస్తున్నారు. ఆ తర్వాత కూడా నేరుగా భారత జట్టులోకి పునరాగమనం చేయకపోవచ్చు. ముందు దేశవాళీల్లో ఆడి ఫిట్నెస్, ఫామ్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. టీమ్ఇండియాలోకి సరిగ్గా ఎప్పుడు వస్తాడో చెప్పలేం కానీ.. 2024 ఐపీఎల్లో పంత్ ఆడే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అందులో సత్తా చాటితే భారత జట్టులోకి పునరాగమనం లాంఛనమే కావచ్చు.
అతడు లేని లోటు
పంత్ లేని సమయంలో భారత జట్టు బాగానే ఇబ్బంది పడింది. ముఖ్యంగా టెస్టుల్లో వికెట్ కీపర్ బ్యాటర్గా తన స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు కనిపించలేదు. పంత్ స్థానంలో ఆడిన ఆంధ్రా కుర్రాడు శ్రీకర్ భరత్ అవకాశాలను ఉపయోగించుకోలేకపోయాడు. వికెట్ కీపింగ్లో ఆకట్టుకున్నప్పటికీ బ్యాటింగ్లో విఫలమయ్యాడు. ఇషాన్ కిషన్ కొన్ని మ్యాచ్లు ఆడినా.. పంత్కు ప్రత్యామ్నాయంలా కనిపించలేదు. ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో పంత్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో భారత అభిమానులు పంత్ను బాగా గుర్తు చేసుకున్నారు. అతనుంటే కథ వేరుగా ఉండేదని ఫీలయ్యారు. రాబోయే వన్డే ప్రపంచకప్లోనూ పంత్ లేకపోవడం భారత్కు ప్రతికూలమే. వికెట్ కీపింగ్ చేసే కేఎల్ రాహుల్ సైతం ప్రపంచకప్నకు అనుమానంగా మారగా.. పంత్ లేని లోటును ఇషాన్ కిషన్, సంజు శాంసన్ లాంటి ఆటగాళ్లు ఏమేర భర్తీ చేస్తారో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్