World Cup 2023: సెమీస్ అవకాశాలు.. ఏ జట్టుకు.. ఎలా?
వన్డే ప్రపంచకప్ (World Cup 2023) కీలక దశకు చేరుకుంది. బంగ్లాదేశ్ మినహా మిగతా అన్ని జట్లకు సాంకేతికంగా సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయి. మరి ఆయా జట్లకు అవకాశాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.
వన్డే ప్రపంచకప్ (World Cup 2023) కీలక దశకు చేరుకుంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఏడు మ్యాచ్లు ఆడగా.. మిగతా జట్లు ఆరేసి మ్యాచ్లు ఆడాయి. అయితే, ఏ జట్టు కూడా అధికారికంగా సెమీస్ బెర్తును ఖరారు చేసుకోలేదు. బంగ్లాదేశ్ మినహా మిగతా అన్ని జట్లకు సాంకేతికంగా సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయి. మరి ఆయా జట్లకు అవకాశాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.
భారత్
టీమ్ఇండియా ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడి అన్నింట్లోనూ విజయం సాధించింది. ప్రస్తుతం 12 పాయింట్లతో టాప్లో ఉంది. శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్తో మ్యాచ్లు ఆడాల్సి ఉంది. భారత్ ఖాతాలో మరో పాయింట్ చేరితే అధికారికంగా సెమీస్ చేరుతుంది. ఈ మూడు మ్యాచ్ల్లో టీమ్ఇండియా ఒక్క దాంట్లో విజయం సాధించినా టాప్లో నిలుస్తుందన్నమాట. ఒకవేళ మూడు మ్యాచ్ల్లో ఓడినా టీమ్ఇండియా సెమీస్కు వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా జరగాలంటే అఫ్గాన్ తన మిగిలిన మూడు మ్యాచ్ల్లో ఒక దాంట్లో కచ్చితంగా ఓడిపోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత జట్టు ఫామ్ చూస్తే ఈ మూడు మ్యాచ్ల్లో కనీసం రెండు మ్యాచ్ల్లో నెగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో మన జట్టు సెమీస్ చేరడానికి పెద్దగా అడ్డంకులు లేవని చెప్పొచ్చు.
సౌతాఫ్రికా
సౌతాఫ్రికా ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడి ఐదు మ్యాచ్ల్లో విజయం సాధించింది. 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్, భారత్, అఫ్గానిస్థాన్తో మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5 నుంచి 10 స్థానాల్లో ఉన్న జట్లను పోల్చిస్తే.. దక్షిణాఫ్రికా ఈ మూడు మ్యాచ్ల్లో ఒక్క దాంట్లో గెలిచినా సెమీస్ చేరుతుంది. ప్రస్తుతం ఆ జట్టు ఫామ్ని చూస్తే ఇది కష్టమేం కాకపోవచ్చు. కాబట్టి.. ఈ జట్టుకు కూడా సెమీస్ చేరినట్లే.
న్యూజిలాండ్
టోర్నీ ఆరంభం నుంచి వరుసగా నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించిన న్యూజిలాండ్.. తర్వాత భారత్, ఆస్ట్రేలియా చేతిలో ఓడి కాస్త డీలా పడింది. ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న కివీస్.. సౌతాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంకతో ఆ జట్టు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్ల్లో రెండింటిలో విజయం సాధిస్తే సెమీ ఫైనల్స్కు అర్హత సాధిస్తుంది.
ఆస్ట్రేలియా
ఆసీస్ తొలి రెండు మ్యాచ్ల్లో ఓడి టోర్నీని పేలవంగా ఆరంభించింది. తర్వాత పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్ల్లో నెగ్గి సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్తో మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్ల్లో రెండింటిలో గెలిస్తే ఆసీస్ సెమీస్ చేరుతుంది. ఒకవేళ మూడు మ్యాచ్ల్లో ఒకే దాంట్లో గెలిచినా ఆస్ట్రేలియాకు అవకాశాలు ఉంటాయి. కానీ, అది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
అఫ్గానిస్థాన్
ఈ ప్రపంచకప్లో సంచలన విజయాలు సాధిస్తోన్న అఫ్గాన్కు ఇంకా సెమీస్ అవకాశాలున్నాయి. ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంకను ఓడించిన అఫ్గానిస్థాన్.. మిగతా మూడు మ్యాచ్ల్లో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో తలపడాల్సి ఉంది. సెమీస్ చేరాలంటే అఫ్గాన్ ఈ మూడు మ్యాచ్ల్లో నెగ్గడంతోపాటు ఆసీస్, న్యూజిలాండ్ ఒక మ్యాచ్లో భారీ తేడాతో ఓడిపోవాలి. అప్పుడు ఈ మూడు జట్లూ 12 పాయింట్లతో ఉంటాయి. మెరుగైన రన్రేట్ ఉన్న జట్టు ముందంజ వేస్తుంది.
శ్రీలంక
శ్రీలంక ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడి రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుం నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్న లంక సాంకేతికంగా మాత్రమే సెమీస్ రేసులో ఉంది. ఆ జట్టు సెమీస్ చేరాలంటే మూడు మ్యాచ్ల్లో కచ్చితంగా విజయం సాధించడంతోపాటు తన కంటే పైన ఐదు జట్లు మిగిలిన మ్యాచ్ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. అంతేకాదు, నెట్రన్రేట్ కూడా కలిసి రావాలి. అయితే, లంక తన మూడు మ్యాచ్ల్లో గెలిచే అవకాశాలే లేవు. ఎందుకంటే భారత్, న్యూజిలాండ్ లాంటి బలమైన జట్లను ఆ జట్టు ఓడించాల్సి ఉంటుంది. కాబట్టి.. శ్రీలంక సెమీస్ రావడం కష్టమే అని చెప్పొచ్చు.
పాకిస్థాన్
పాకిస్థాన్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడి మూడింటిలో విజయం సాధించింది. ప్రస్తుతం ఆరు పాయింట్లతో ఉన్న పాక్.. న్యూజిలాండ్, ఇంగ్లాండ్తో మ్యాచ్లు ఆడాల్సి ఉంది. పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే.. ఈ రెండు మ్యాచ్ల్లో కచ్చితంగా గెలుపొందాలి. అంతేకాదు ప్రస్తుతం టాప్-4లో ఉన్న భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు మిగిలి ఉన్న అన్ని మ్యాచ్ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఆసీస్, న్యూజిలాండ్ మిగిలిన మూడు మ్యాచ్ల్లో కనీసం ఒక దాంట్లో నెగ్గినా పాక్ సెమీస్ అవకాశాలు మూసుకుపోతాయి.
నెదర్లాండ్స్..
ప్రస్తుతం నాలుగు పాయింట్లతో ఉన్న నెదర్లాండ్స్.. అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్, భారత్తో మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆ జట్టు సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలటే మొదట ఈ మూడు మ్యాచ్ల్లోనూ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అంతేకాదు పాకిస్థాన్, అఫ్గాన్, శ్రీలంక 10 కంటే ఎక్కువ పాయింట్లు సాధించకూడదు.
బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడి ఒక్క మ్యాచ్లోనే విజయం సాధించింది. దీంతో ఏ రకంగా చూసిన ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు లేవు.
ఇంగ్లాండ్
ఈ ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడి ఒక్క దాంట్లో నెగ్గింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఆ జట్టు సాంకేతికంగా మాత్రమే సెమీస్ రేసులో ఉంది. ఇంగ్లాండ్.. ఇంకా ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్తో తలపడాల్సి ఉంది. ఇంగ్లిష్ జట్టు సెమీస్కు రావాలంటే.. ఈ మూడు మ్యాచ్ల్లోనూ భారీ తేడాతో విజయం సాధించాలి. అంతేకాదు మూడు జట్లు మాత్రమే ఎనిమిది కంటే ఎక్కువ పాయింట్లతో లీగ్ దశను ముగించాల్సి ఉంటుంది. ఇది సాధ్యమయ్యే పని కాదు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?