IPL: ‘కోహ్లీ కోహ్లీ’ అంటూ అభిమానుల నినాదాలు.. నవీనుల్ హక్ ఏం చేశాడంటే?
లఖ్నవూ, ముంబయి మధ్య జరిగిన మ్యాచ్లో లఖ్నవూ ఆటగాడు నవీనుల్ హక్ (Naveen-ul-Haq)ని చూస్తూ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫ్యాన్స్.. ‘కోహ్లీ కోహ్లీ’ అని నినాదాలు చేశారు. దీనికి నవీనుల్ హక్ ఏ విధంగా రియాక్షన్ ఇచ్చాడంటే..
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల లఖ్నవూ, బెంగళూరు జట్ల మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి.. లఖ్నవూ ఆటగాడు నవీనుల్ హక్ (Naveen ul Haq), మెంటార్ గంభీర్లకు మధ్య ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలిసిందే. కోహ్లీ తన షూను చూపిస్తూ తిట్టడంతో నవీనుల్కు ఆగ్రహం తెప్పించింది. మ్యాచ్ అనంతరం కోహ్లీతో అతను గొడవ పడ్డాడు. అంతటితో వివాదం సద్దుమణగలేదు. మరుసటి రోజు కోహ్లీ, నవీనుల్ సామాజిక మాధ్యమాల్లో స్టేటస్ల రూపంలో గొడవ కొనసాగింది. ఒకరి మీద ఒకరు పరోక్షంగా విమర్శలు గుప్పించుకున్నారు.
ముంబయితో మ్యాచ్లో కోహ్లీ ఒక్క పరుగే చేసి ఔటైనప్పుడు నవీనుల్ హక్ తాను మ్యాచ్ను వీక్షిస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ‘‘తియ్యనైన మామిడి పండ్లు’’ అని క్యాప్షన్ జోడించాడు. కోహ్లీ ఔట్ కావడంతో సంబరం చేసుకున్నట్టుగా అనిపించేలా నవీనుల్ హక్ ఆ పోస్టు పెట్టాడని నెట్టింట చర్చ జరిగింది. నవీనుల్ హక్ను విమర్శిస్తూ కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అంతేకాదు మంగళవారం ముంబయి, లఖ్నవూ మధ్య జరిగిన మ్యాచ్లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న నవీనుల్ హక్ను చూస్తూ ‘కోహ్లీ కోహ్లీ’ అని నినాదాలు చేశారు. ఆ నినాదాలను విన్న నవీనుల్ హక్.. ఇంకా బిగ్గరగా అరవండి అంటూ సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!