CSK: అది నిజం కాదు.. కెప్టెన్ రుతురాజ్కు జడేజా అండగా నిలుస్తాడు: స్టీఫెన్ ఫ్లెమింగ్
సీఎస్కే (CSK) కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు జట్టులోని ప్రతిఒక్కరూ సహకారం అందిస్తారని.. సీనియర్లు వెన్నంటి ఉంటారని ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ (IPL 2024) ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్సీలో మార్పు చేసింది. ఎంఎస్ ధోనీ (MS Dhoni) వైదొలిగి రుతురాజ్కు బాధ్యతలు అప్పగించాడు. అయితే, మరో సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజాను కాదని యువ క్రికెటర్కు కెప్టెన్ పదవి ఇవ్వడం గమనార్హం. రెండేళ్ల కిందట జడ్డూనే తొలుత సారథిగా నియమించి.. ధోనీ వైదొలిగాడు. కానీ, ఆ సీజన్లో జడేజా మెప్పించకపోవడంతో మధ్యలోనే అతన్ని తప్పించారు. గత ఎడిషన్లో ధోనీ సీఎస్కేను ఛాంపియన్గా నిలిపాడు. ఈసారి కూడా అతడే ఉంటాడని అంతా అనుకున్న వేళ ఒక్కసారిగా సంచలన నిర్ణయంతో ధోనీ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. యువ క్రికెటర్ రుతురాజ్కు ధోనీ నుంచే కాకుండా సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా నుంచీ సహకారం లభిస్తుందని ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు.
‘‘గత సీజన్ ఫైనల్లో రవీంద్ర జడేజా చివరి రెండు బంతుల్లో ఆడిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చెన్నైను గెలిపించాడు. సీఎస్కే నాయకత్వానికి జడ్డూ గట్టి పోటీదారు. అయితే, సారథిగా నియమితుడైన రుతురాజ్ గైక్వాడ్కు జడేజా అండగా నిలుస్తాడనడంలో అనుమానాలు అక్కర్లేదు. రుతురాజ్ వ్యక్తిగతంగా అద్భుతమైన ఆటగాడు. ఆటగాళ్లతో అతడు వ్యవహరించే తీరు బాగుంటుంది. జట్టులోని ప్రతిఒక్కరూ గౌరవిస్తారు. ధోనీ గాయపడటం వల్లే ఈసారి కెప్టెన్సీ నుంచి వైదొలిగినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. గతేడాది కంటే ఇప్పుడు ధోనీ మరింత దృఢంగా ఉన్నాడు. ఇప్పటికీ నెట్స్లో విపరీతంగా శ్రమిస్తాడు. భారీ షాట్లు కొట్టే సత్తా ఉంది’’ అని ఫ్లెమింగ్ వెల్లడించాడు.
ధోనీకి తెలుసు.. అందుకే రుతురాజ్ ఎంపిక: భారత మాజీ క్రికెటర్
‘‘ఎంఎస్ ధోనీ జట్టును బ్యాలెన్స్ చేయడంలో దిట్ట. అద్భుత నాయకత్వ పటిమ కలిగిన ప్లేయర్. రుతురాజ్ను సారథిగా ప్రమోట్ చేయడానికి ధోనీ వద్ద కారణం ఉంటుంది. ఎప్పటికీ తానే కెప్టెన్గా ఉండలేనని ధోనీకి తెలుసు. అందుకే, భవిష్యత్తు కోసం ఇప్పటినుంచే రుతురాజ్ను సిద్ధం చేసేందుకు అతడివైపు మొగ్గు చూపి ఉంటాడు. ఝార్ఖండ్ నుంచి వచ్చిన ధోనీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్గా ఎదిగాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్గా మారాడు. భావోద్వేగాలను బయటకు తెలియనీయకుండా ఉండటం గొప్ప విషయం. అయితే, ప్రతి ఒక్కరూ ఎప్పటికైనా సరే ఆటకు గుడ్బై చెప్పాల్సిందే. అలాగే విరాట్ కోహ్లీ కూడా గొప్ప క్రికెటర్. ఈసారి ఆర్సీబీ టైటిల్ను కొడుతుందనే నమ్మకం నాకు లేదు’’ అని మాజీ క్రికెటర్ గోపీనాథ్ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.