IPL-CSK: ఉదయం 9 గంటల వరకు సంబరాలు.. కొందరికి ఫ్లైట్స్ కూడా మిస్: డేవన్ కాన్వే
ఐపీఎల్ చరిత్రలో (IPL) ఐదు టైటిళ్లను గెలిచిన రెండో జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. పటిష్ఠమైన జట్లన ఓడించి మరీ ధోనీ నాయకత్వంలోని సీఎస్కే ఛాంపియన్గా నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎలాంటి అంచనాలు లేకుండానే ఆల్రౌండ్ ప్రదర్శనతో హేమాహేమీ జట్లను ఓడించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023) సీజన్ టైటిల్ను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఎగరేసుకుపోయింది. ఐపీఎల్ ముగిసి పక్షం రోజులు దాటినా.. ఇప్పటికీ సీఎస్కే ఆటగాళ్లు కప్ను సొంతం చేసుకున్న క్షణాలను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. కివీస్ వికెట్ కీపర్ డేవన్ కాన్వే (Devon Conway) సీఎస్కే ఓపెనర్గా కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని సీఎస్కే తరఫున ఆడటం ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పిన కాన్వే.. టైటిల్ నెగ్గిన రోజు కొందరు ఆటగాళ్లు తాము వెళ్లాల్సిన విమానాలను మిస్ చేసుకున్నారని తెలిపాడు.
‘‘టైటిల్ను నెగ్గడం ఉత్సాహం కలిగించింది. అయితే, కొందరు ఆటగాళ్లు తమ గమ్య స్థానాలకు వెళ్లాల్సిన విమానాలను మిస్ అయ్యారు. మొయిన్ అలీ కుటుంబం తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంది. బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమన్స్ తన ఫ్లైట్ను రద్దు చేసుకున్నాడు. డ్వేన్ ప్రిటోరియస్కు విమానం మిస్ అయింది. అతడి కుటుంబ సభ్యులు మాత్రమే సమయానికి ఎయిర్పోర్ట్కు చేరుకుని వెళ్లిపోయారు. టైటిల్ను గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో మేమంతా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాం. మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు కొనసాగాయి. ధోనీ మాకు మధ్యలో ఉన్నాడు. మేమంతా నేరుగా టిఫిన్ చేసేశాం. కొంతమంది నిద్ర పోవడానికి వారి రూమ్కు వెళ్లిపోయారు.
ధోనీతో ఎక్కువ సమయం గడిపినందుకు అదృష్టంగా భావిస్తా. అతడి పట్ల గౌరవం మాటల్లో చెప్పలేనిది. ప్రతిసారి అతడు రూమ్లోకి వస్తుంటే ఏదో తేజస్సు ధోనీ చుట్టూ ఉన్నట్లు అనిపిస్తుంది. క్రికెట్లో అతడు సాధించిన ఘనతలు అపూర్వం’’ అని కాన్వే పేర్కొన్నాడు. చెన్నై - గుజరాత్ మధ్య మ్యాచ్ రిజర్వ్డేకు (మే 29) వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ అర్ధరాత్రి వరకు జరిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో గుజరాత్పై విజయం సాధించి సీఎస్కే తన ఖాతాలో ఐదో ఐపీఎల్ టైటిల్ను వేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు