CSK vs RCB: ధోనీ పాత్ర ఏంటి..? ఆర్సీబీ వ్యూహమేంటి?
చెపాక్ వేదికగా సీఎస్కే-ఆర్సీబీ (CSK vs RCB) జట్ల మధ్య ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్ జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ అభిమానుల కోసం ఐపీఎల్ (IPL) సందడి వచ్చేసింది. ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి కొత్త కెప్టెన్ నాయకత్వంలో బరిలోకి దిగింది. ప్రతి సీజన్లోనూ ‘ఈసాలా కప్ నమదే’ నినాదంతో వచ్చే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్కు సై అంటోంది. మరి ఈ జట్టు వ్యూహమేంటి? కెప్టెన్సీ పగ్గాలను వదిలేసిన ధోనీ పాత్ర ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
డిఫెండింగ్ ఛాంపియన్గా తమకు అచ్చొచ్చిన చెపాక్ వేదికపై చెలరేగేందుకు సీఎస్కే అస్త్రాలను సిద్ధం చేసుకుంది. నూతన సారథి రుతురాజ్ గైక్వాడ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుని జట్టును ముందుకు నడిపిస్తాడనేది ఆసక్తిగా మారింది. ఓపెనర్గా అతడితో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు న్యూజిలాండ్ బ్యాటర్ డేవన్ కాన్వే అందుబాటులో లేడు. గత వన్డే వరల్డ్ కప్లో అదరగొట్టిన కివీస్ ఆటగాడు రచిన్ రవీంద్ర ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశం ఉంది. అజింక్య రహానె, డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబె, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజాతో కూడిన బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన సమీర్ రిజ్వీని బరిలోకి దింపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక బౌలింగ్ విషయంలో ఇప్పటికే మొయిన్ అలీ, జడేజా రూపంలో స్పిన్ ఆల్రౌండర్లు ఉన్నారు. రెండేళ్ల తర్వాత మళ్లీ సీఎస్కేకు ఆడుతున్న శార్దూల్ ఠాకూర్తోపాటు దీపక్ చాహర్ కూడా బ్యాటింగ్ చేయగల పేస్ బౌలర్లు. పతిరణ గైర్హాజరీలో తుషార్ పాండేతో కలిసి సీనియర్లు ఇద్దరూ పేస్ దళాన్ని నడిపించాల్సి ఉంది.
ధోనీ.. వికెట్ కీపర్గా వస్తాడా?
ధోనీ కెప్టెన్సీని త్యజించాక ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా ఆడతాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. కొన్ని మ్యాచ్లకు అతడు పూర్తిస్థాయిలో ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే, ప్రస్తుతం ఉన్న సీఎస్కే స్క్వాడ్లో ఏకైక సీనియర్ వికెట్ కీపర్ ధోనీనే. గాయం కారణంగా కాన్వే కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు. మరోవైపు యువ వికెట్ కీపర్ అవనీశ్ ఆరవిల్లేను గత మినీ వేలంలో సీఎస్కే ఎంపిక చేసుకుంది. ధోనీ ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బ్యాటింగ్ మాత్రమే చేసి.. వికెట్ కీపింగ్ను కుర్రాడికి అప్పగించే అవకాశం లేకపోలేదు. యువ టాలెంట్ను ప్రోత్సహించడంలో మన ‘కెప్టెన్ కూల్’ ఎప్పుడూ ముందుంటాడు.
అమ్మాయిల స్ఫూర్తితో.. ఆర్సీబీ
ఇప్పటి వరకూ ఒక్క టైటిల్ను బెంగళూరు నెగ్గని విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఇటీవల WPL కప్ను ఆర్సీబీ మహిళా జట్టు గెలిచింది. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో డుప్లెసిస్ నాయకత్వంలోని పురుషుల జట్టు సత్తా చాటేందుకు బరిలోకి దిగుతోంది. డుప్లెసిస్తోపాటు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తిక్ కీలక ప్లేయర్లు. డీకే ఫినిషర్గా గత సీజన్లో ఆకట్టుకోలేకపోయాడు. ఈసారి ఆ పాత్ర సమర్థంగా పోషిస్తాడని ఆర్సీబీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. భారీ మొత్తం వెచ్చించి మరీ దక్కించుకున్న కామెరూన్ గ్రీన్ తన ఆల్రౌండ్ ప్రతిభతో ఆర్సీబీని గెలిపించాల్సిన అవసరం ఉంది. చెపాక్ వేదిక బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నా.. స్పిన్నర్లకు సహకారం లభిస్తుంది. ఇలాంటి సమయంలో బ్యాటర్లపైనే కాకుండా నాణ్యమైన స్పిన్ ఎటాక్తో బరిలోకి దిగాలి. స్టార్ పేసర్ సిరాజ్తోపాటు లాకీ ఫెర్గూసన్, యువ బౌలర్ ఆకాశ్ దీప్, గ్రీన్తో పేస్ దళం బలంగా ఉంది. స్పిన్ బౌలింగ్ విభాగంలో మ్యాక్స్వెల్పైనే ఎక్కువగా ఆధారపడక తప్పని పరిస్థితి. కర్ణ్ శర్మ లెగ్ స్పిన్తో ఏమాత్రం రాణిస్తాడో చూడాలి.
తుది జట్లు (అంచనా):
సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానె, డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబె, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ముకేశ్ చౌదరి/తుషార్ దేశ్ పాండే
ఆర్సీబీ: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తిక్ (వికెట్ కీపర్), లామ్రోర్, లాకీ ఫెర్గూసన్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్ దీప్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెలరేగిన సంజు, జురెల్.. లఖ్నవూపై రాజస్థాన్ విజయం
ఐపీఎల్-2024లో రాజస్థాన్ ఎనిమిదో విజయాన్ని నమోదు చేసింది. -
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
ఐపీఎల్-17లో దిల్లీ ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబయితో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో గెలుపొందింది. -
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన సంజు, జురెల్.. లఖ్నవూపై రాజస్థాన్ విజయం
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM