CWG 2022: తండ్రి చేసిన త్యాగమే.. నీతూ కలకు ప్రాణం..!
ఓ యువ మహిళా బాక్సర్ ఎంతో ఆత్మవిశ్వాసంతో పంచ్లు కొడుతుంటే.. ప్రతి మ్యాచ్లోనే గెలవాలన్న కసి ఆమె కళ్లల్లో కనిపిస్తుందంటే...
ఆయన లేకుండా నేను ఇక్కడ ఉండను..
ఇంటర్నెట్ డెస్క్: ఓ యువ మహిళా బాక్సర్ ఎంతో ఆత్మవిశ్వాసంతో పంచ్లు కొడుతుందంటే.. ప్రతి మ్యాచ్లోనూ గెలవాలన్న కసి ఆమె కళ్లల్లో కనిపిస్తుందంటే.. అందుకు ఆమె తండ్రి చేసిన త్యాగమే కారణం. అదే కామన్వెల్త్ గేమ్స్లో భారత యువ బాక్సర్ నీతూ ఘంఘాస్ తొలి స్వర్ణం గెలిచేలా చేసింది. అందుకే ఆమె పసిడి గెలిచాక తన తండ్రి జై భగవాన్కు పతకాన్ని అంకితం చేసింది.
ఆయన చేసిన త్యాగం ఏంటి..!
(ఫొటో : నీతూ ఇన్స్టా)
నీతూ తండ్రి హరియాణా సెక్రటేరియట్లో ఓ సాధారణ ఉద్యోగి. అయితే కుమార్తెను ప్రపంచ ఛాంపియన్ చేయాలన్న కోరిక ఆయన్ను ఉద్యోగం సరిగాచేయనివ్వలేదు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడేళ్లు జీతం లేని సెలవులో ఉండి.. నీతూకు శిక్షణ ఇచ్చాడు. ఎట్టకేలకు.. ఆదివారం నీతూ మెడలో బంగారు పతకంతో పోడియంపై నిల్చున్నప్పుడు ఆయన త్యాగానికి ప్రతిఫలం దక్కింది. ఇంతకముందు రెండుసార్లు ప్రపంచ యూత్ ఛాంపియన్ అయిన నీతూ.. తండ్రికి ఇలాంటి వేదిక( కామన్వెల్త్)పై భారత్కు పతకాన్ని అందిస్తాననే భరోసా ఎప్పుడో ఇచ్చింది.
నా చిరకాల కోరిక
మ్యాచ్ అనంతరం నీతూ మాట్లాడుతూ ‘త్రివర్ణ పతాకాన్ని చూడటం గొప్ప అనుభూతి, నా చిరకాల కోరికలలో ఒకటి ఈరోజు నెరవేరింది. అందరి ఆశీర్వాదాలకు నేను కృతజ్ఞురాలిని.. ఈ పతకం మన తోటి దేశస్థులకు, మా నాన్నకు అంకితం. ఆయన నా కోసం ఎంతో కష్టపడ్డారు. అనేక కష్టాలను అనుభవించారు. ఎన్నో ప్రార్థనలు చేశారు. నాకు అన్నివేళాల అండగా ఉన్నారు. ఆయన లేకపోతే నేను ఇక్కడ ఉండను’ అని నీతూ చెప్పింది.
గబ్బర్ షెర్ని ఆఫ్ ది రింగ్
(ఫొటో : నీతూ ఇన్స్టా)
నీతూ చాలా తక్కువుగా మాట్లాడుతుంది. క్యాంప్లో, బయట కూడా ఆమె వాయిస్ వినబడదు. కానీ రింగ్లోపల మాత్రం ఆమె ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంది. అందుకే కోచ్ భాస్కర్ భట్ మాట్లాడుతూ ‘రింగ్ లోపల ఆమె గబ్బర్ షెర్నీలా ఉంటుంది. ప్రపంచ వేదికపై భారతీయ బాక్సింగ్కు మేరికోమ్ గుర్తింపు తీసుకొచ్చింది. అయితే, నీతూ బాక్సింగ్లో అడుగుపెట్టిన తర్వాత నాకు ‘తర్వాతి మేరికోమ్’గా కనిపించింది. ఆమె రింగ్ బయట సైలెంట్గా ఉన్నా రింగ్లో మాత్రం సింహంలానే గర్జిస్తుంది’ అని భట్ ప్రశంసించాడు.
జ్వరంతో బాధ పడుతూ..
నీతూ ఘంఘాస్ ప్రపంచ ఛాంపియన్షిప్ లోనే విజేతగా నిలుస్తుందని అంతా భావించారు. అయితే, జ్వరం కారణంగా క్వార్టర్ ఫైనల్ సమయంలో పూర్తి ఫిట్నెస్తో లేదు. అయినా మ్యాచ్కు సిద్ధం అయింది. క్వార్టర్స్లో కజకిస్థాన్కు చెందిన అలువా బల్కిబెకోవాతో 2-3తో ఓడిపోయినా.. చివరివరకూ పోరాడింది. ఈ సారి కామన్వెల్త్లో స్వర్ణం గెలిచాక ఆమె మాట్లాడుతూ ‘ప్రపంచ ఛాంపియన్ షిప్లో కీలక మ్యాచ్ జరిగే ముందు నాకు రాత్రంతా జ్వరం వచ్చి.. నిద్రపట్టలేదు. కానీ అదృష్టవశాత్తూ ఈసారి అలాంటిదేమీ లేదు’ అని చెప్పింది. కామన్వెల్త్ సెమీస్లో రిఫరీ-స్టాప్స్-కాంటెస్ట్ ద్వారా గెలిచిన నీతూ.. ఆ తర్వతా 2019 ప్రపంచ ఛాంపియన్షిప్ కాంస్య విజేత డెమీ-జాడే రెజ్టన్ను ఓడించగలిగింది.
అద్భుతమైన వ్యక్తిత్వం..
ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ స్థానంలో కామన్వెల్త్ క్రీడలకు ఎంపికైనా నీతూ.. తొలి ప్రయత్నంలోనే స్వర్ణం గెలిచాక .. ‘మేరీకోమ్కు పూర్తిగా భిన్నమైన స్థానం ఉంటుంది. ఆమె విశ్వ విజేత. నేను ఆమెకు సరితూగను’అని తన వినయాన్ని చాటుకుంది. నీతూ ఇదే పంథాలో తన బాక్సింగ్ పయనాన్ని సాగిస్తూ, తన తండ్రికి, దేశానికి ఎన్నో కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆశిద్దాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు