CWG 2022: టీమ్ఇండియాకు కఠిన పరీక్ష..సెమీస్లో నెగ్గాలంటే ఏం చేయాలి?
కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు కీలక సమరానికి సిద్ధమైంది.
ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. శనివారం ఎడ్జ్బాస్టన్ వేదికగా ఫైనల్ బెర్త్కోసం బలమైన ఇంగ్లాండ్ను ఢీకొట్టనుంది. ఒకవైపు టీమ్ఇండియా తొలి మ్యాచ్లో ఆసీస్ చేతిలో అనూహ్య పరాజయం తరవాత వరుసగా రెండు భారీ విజయాలతో జోరు మీదుండగా.. మరోవైపు ఈ టోర్నీలో ఓటమి రుచి చూడని ఇంగ్లిష్ జట్టు సూపర్ఫామ్లో కనిపిస్తోంది. దీంతో ఈ రెండు జట్లు మధ్య సెమీస్పోరు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరీ ఏ జట్టుకు విజయావకాశాలు ఎలా ఉన్నాయో చుద్దాం..!
టీమ్ఇండియా బలం ఎవరు..!
భారత్ జట్టు సెమీస్కు చేరిందంటే ప్రధాన కారణం రేణుకా సింగ్. ఎందుకంటే 3 మ్యాచ్ల్లో 4.00 ఎకానమీతో 9 వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడిచేసింది. ఆస్ట్రేలియాపై నిప్పులు చెరిగిన రేణూ వారి టాప్ఆర్డర్ను పవర్ప్లే లోనే పెవిలియన్కు పంపింది. ఇక చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో బార్బడోస్ బ్యాటర్లను బెంబేలెత్తించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. పవర్ప్లే ఓవర్లలో ఇన్స్వింగ్ బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో రేణూ నేర్పరి. ఇంగ్లాండ్ జట్టులో ఓపెనర్లు పెద్దగా ఫామ్లో లేరు. దీంతో రేణూ పదునైన బంతులతో వారిని ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. బౌలింగ్లో టీమ్ఇండియా అతిపెద్ద బలం రేణుకా సింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమెకు తోడు దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, స్నేహ రాణా, మేఘనా సింగ్ కూడా ఫామ్లోనే ఉన్నారు. వీళ్లంతా సమష్టిగా రాణిస్తే ఇంగ్లాండ్ బ్యాటర్లను అడ్డుకోవచ్చు.
ఇక బ్యాటింగ్లో నిలకడలేమి కనిపిస్తోంది. తొలి మ్యాచ్లో అర్ధశతకం చేసిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బార్బడోస్పై డకౌట్ అయింది. పాక్పై 63 పరుగులతో రాణించిన స్మృతి మంధాన, బార్బడోస్పై కీలకపోరులో ఆరంభంలోనే పెవిలియన్ చేరింది. జెమిమా రోడ్రిగ్స్ సైతం వీరిలానే బార్బడోస్పై అర్ధశతకం సాధించిన, ఆసీస్పై విఫలమైంది. ఈ ముగ్గురు స్టార్ బ్యాటర్లు ఒక్కొక్కరు ఒక్కో మ్యాచ్లో రాణించారు. అయితే, సెమీస్ లాంటి కీలక మ్యాచ్లో సమష్టిగా ఆడితేనే స్కోరు బోర్డుపై అనుకున్న పరుగులు వస్తాయి. అయితే, యువ ఓపెనర్ షెపాలీ వర్మ 3 మ్యాచ్ల్లో 157.35 స్ట్రెక్రేట్తో 107 పరుగులు సాధించి టీమ్ఇండియా తరఫున టాప్స్కోరర్గా ఉంది. ఆమె పవర్ప్లేలో ధాటిగా ఆడటం టీమ్ఇండియాకు కలిసొచ్చే అంశం. బ్యాటింగ్లో భారత జట్టు బలం ఈ నలుగురే. వీరు ఇంగ్లాండ్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటారనే దానిపై టీమ్ఇండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
ఇంగ్లాండ్తో అంత వీజీ కాదు..!
సొంత గడ్డపై మ్యాచ్లు జరుగుతుండటం ఇంగ్లాండ్కు అతిపెద్ద బలం. శ్రీలంక, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఇలా ప్రత్యర్థి ఎవరైనా ఇంగ్లాండ్దే ఆధిపత్యం. లీగ్దశలో ఈ మూడు జట్లపై అలవోకగా నెగ్గి ఇప్పుడు భారత్కు సవాల్ విసురుతోంది. ఇంగ్లాండ్ జట్టు బౌలర్లు కేథరిన్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్, ఇస్సీ వాంగ్ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందిపెడుతున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లు న్యూజిలాండ్ లాంటి బలమైన జట్టునే 71 పరుగులకు పరిమితం చేశారంటే వారి బౌలింగ్ ఎలా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా పవర్ ప్లేలో పేసర్ కేథరిన్ బ్రంట్ పేస్ను ఎదుర్కొవడం భారత్కు సవాలే. ఆమె న్యూజిలాండ్పై 3 ఓవర్లు వేసి కేవలం నాలుగు పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టింది. ఇందులో ఒక మెయిడిన్ కూడా ఉంది. సీనియర్ స్పిన్నర్ ఎక్లెస్టోన్ మిడిల్ ఓవర్లలతో పాటు డెత్లో కూడా బౌలింగ్ చేయగలదు. ఈ టోర్నీలో 5 వికెట్లు తీసి ఇంగ్లాండ్ తరఫున టాప్ వికెట్ టేకర్గా ఉంది. వీరికి తోడు కెంప్, వాంగ్ లాంటి బౌలర్లలున్నారు. దీంతో ఇంగ్లాండ్కు బౌలింగ్లో ఎటువంటి సమస్యా లేదు. మరి వీరిని భారత్ బ్యాటర్లు ఎలా ఆడుతారో చుడాలి.
ఆలిస్ క్యాప్సేతో డేంజర్!
ఇంగ్లాండ్ జట్టు లీగ్దశలో బౌలింగ్తోనే మ్యాచ్లను గెలిచేసింది. బ్యాటర్లు స్వల్ప లక్ష్యాన్ని నెమ్మదిగా ఛేదించేవారు. అయితే, ఇంగ్లాండ్ బ్యాటర్ ఆలిస్ క్యాప్సే మాత్రం ప్రతి మ్యాచ్లోనూ రాణించింది. 3 మ్యాచ్ల్లో (44,50,23) మొత్తం 117 పరుగులు చేసి టోర్నీలో రెండో టాప్స్కోరర్గా ఉంది. ఇంగ్లాండ్ ఓపెనర్లు విఫలం అయినప్పటికీ వన్డౌన్లో క్యాప్సే అదరగొడుతుంది. మిగిలిన బ్యాటర్లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతుంది. దీంతో టీమ్ఇండియా ఈమెను నిలువరించకపోతే మ్యాచ్ చేజారే అవకాశం ఉంది. కెప్టెన్ నటాలీ స్కివర్ మూడు మ్యాచ్ల్లో కలిపి 36 పరుగులే చేసింది. కీలక మ్యాచ్లో ఆమె ఫామ్లోకి వస్తే భారత్కు ప్రమాదమే.
తుదిజట్లు అంచనా:
ఇంగ్లాండ్: డానియెల్ వ్యాట్, సోఫియా డంక్లీ, ఆలిస్ క్యాప్సే, నటాలీ స్కివర్ (కెప్టెన్), అమీ జోన్స్ (వికెట్ కీపర్), మైయా బౌచియర్, కేథరీన్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్, ఫ్రెయా కెంప్, ఇస్సీ వాంగ్, సారా గ్లెన్
భారత్: షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), తానియా భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, స్నేహ రాణా, మేఘనా సింగ్, రేణుకా సింగ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు