CWG 2022: ఐస్క్రీం ఇప్పుడు తినొచ్చు.. ఇదే అమ్మకు బర్త్డే గిఫ్ట్..!
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పేరు దేశమంతా మారు మోగుతుంది.
తన విజయంపై నిఖత్ జరీన్
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పేరు దేశమంతా మారు మోగుతుంది. మేరీకోమ్ పోటీ పడే విభాగంలో ఆడుతూ రెండు నెలల కిందటే ప్రపంచ ఛాంపియన్ అయిన నిఖత్.. కామన్వెల్త్ క్రీడల్లో పసడి సాధించి మళ్లీ మెరిసింది. దీంతో దేశంలో ప్రస్తుతం అత్యుత్తమ మహిళా బాక్సర్ నిఖత్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఆమె స్వర్ణం అంత సులువుగా గెలవలేదు. దీనికోసం ఎంతో శ్రమించింది. స్ట్రాంజా మెమొరియల్లో 52 కేజీల ఈవెంట్లో పసిడి నెగ్గిన నిఖత్.. కామన్వెల్త్ కోసం రెండు కేజీలు తగ్గి 50 కిలోల విభాగంలో బరిలోకి దిగింది. ఇలా ఆమె శరీర బరువును విభాగానికి అనుగుణంగా మార్చుకోవడానికి చాలా కష్టపడింది. ఇప్పుడు ఆమె లక్ష్యమంతా 2024 పారిస్ ఒలింపిక్స్. ఇక్కడా స్వర్ణం కొల్లగొట్టేందుకు మళ్లీ 50 కేజీల విభాగంలో పోటీపడతానని ఆమె చెబుతుంది.
ఐస్క్రీం ఇప్పుడు తినొచ్చు...
కొంతకాలంగా బ్యాక్-టు-బ్యాక్ టోర్నమెంట్లు, ట్రయల్స్లో పోరాడుతూ.. జరీన్ విశ్రాంతి లేకుండా గడిపింది. ఆదివారం బంగారు పతకాన్ని గెలుచుకున్న అనంతరం నిఖత్ అక్కడే ఉన్న ఓ వ్యక్తిని ఐస్క్రీమ్ అడిగిందంటే అర్థం అవుతోంది.. ఆమె ఇష్టమైన వాటికి ఎంతకాలంగా దూరంగా ఉందో..! ఎందుకంటే జరీన్ కామన్వెల్త్ క్రీడల్లో బరువు తగ్గించుకోవాల్సి రావడంతో ఐస్క్రీం తినాలనే కోరికను విరమించుకుంది. అయితే ఇప్పుడు తనకు ఇష్టమైన ఐస్క్రీంతో పాటు నిజామాబాద్లోని తీపి కబురులన్నీ ఆస్వాదించవచ్చు.
ఈ క్షణాన్ని ఆస్వాదిస్తా..
"జనవరి నుంచి తీరిక లేకుండా ఛాంపియన్షిప్లలో పోరాడుతూ.. శిక్షణ పొందుతున్నాను. అయితే, ఇప్పుడు నేను ఈ క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. ఇప్పటివరకు నా విజయానికి ఎప్పుడూ సంబరాలు జరుపుకోలేదు. అయితే.. ఈసారి కాస్త విశ్రాంతి తీసుకోని ఈ విజయాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా’ అని నిఖత్ స్వర్ణం నెగ్గాక చెప్పింది.
అమ్మకు బర్త్డే గిఫ్ట్..
నిఖత్ మూడు రోజుల క్రితం.. తన తల్లి పుట్టినరోజున ఆమెతో ఉండాలనుకున్నా కుదరలేదు. కానీ ఇప్పుడు కామన్వెల్త్లో గెలిచిన గోల్డ్ మెడల్ని బహుమతిగా ఇవ్వడం ద్వారా ఆ లోటును భర్తీ చేయాలని భావిస్తోంది. పతకాల వేడుక నుంచి తిరిగి వచ్చిన తర్వాత జరీన్ తన కోచ్ భాస్కర్ భట్ మెడలో మెడల్ వేసి ఆశీస్సులు తీసుకోవడం విశేషం. "బితియా హై మేరీ. మా బంధం తండ్రీ కూతుళ్ల లాంటిది. ఇంతకంటే మంచి అనుభూతి మరొకటి ఉండదు" అని భట్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..