CWG 2022: ఆమె ఇన్ స్వింగ్ వేస్తే వికెట్ పడాల్సిందే! ఒక్కో బాల్ ఒక్కో అద్భుతం... చూడండి!
కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల క్రికెట్కు సెమీస్కు దూసుకెళ్లింది. కీలకపోరులో బార్డడోస్ను చిత్తు చేసింది. పాకిస్థాన్ను బెంబేలెత్తించింది. ఆస్ట్రేలియాకు చెమటలు పట్టించింది. అయితే, ఇవన్నీ జరిగాయంటే ప్రధాన
ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు సెమీస్కు దూసుకెళ్లింది. కీలకపోరులో బార్బడోస్ను చిత్తు చేసింది. పాకిస్థాన్ను బెంబేలెత్తించింది. ఆస్ట్రేలియాకు చెమటలు పట్టించింది. అయితే, ఇవన్నీ జరిగాయంటే ప్రధాన కారణం మాత్రం... రేణుకా సింగ్ ఠాకూర్. ఎందుకంటే ఆమె ఈ టోర్నీలో లీడింగ్ వికెట్ టేకర్ (9), భారత్కు పవర్ప్లేలో గేమ్ ఛేంజర్.
తొలి మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినా..రేణుకా సింగ్ బౌలింగ్ మాత్రం అంత తేలికగా ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే అలిస్సా హీలీ, బెత్ మూనీ, మెగ్ లానింగ్, తహ్లియా మెక్గ్రాత్ ఇలా అగ్రశ్రేణి బ్యాటర్లను పెవిలియన్కు పంపింది. ఇక రెండో మ్యాచ్లో పాక్పై పొదుపు బౌలింగ్ చేసి కట్టడి చేసింది. భారత్కు చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో బార్బడోస్ బ్యాటర్లను చుట్టేసింది. పవర్ప్లేలో 3 ఓవర్లు వేసి కేవలం ఐదు పరుగులు ఇచ్చి మూడు కీలకవికెట్లు పడగొట్టింది.
కామన్వెల్త్ గేమ్స్లో రేణుకా ప్రదర్శన
- 4-0-18-4 (ఆస్ట్రేలియా పై)
- 4-1-20-1 (పాకిస్థాన్పై)
- 4-0-10-4 (బార్బడోస్)
కామన్వెల్త్ గేమ్స్లో మొత్తంగా 12 ఓవర్లు వేసిన రేణుక 5.33 సగటు, 4.00 ఎకానమీతో 9 వికెట్లు తీయడం విశేషం.
స్వింగ్ క్వీన్
రేణుకా సింగ్ ఈ టోర్నీలో తన స్వింగ్ డిలివిరీలతో బ్యాటర్లను బోల్తా కొట్టిస్తోంది. ఆసీస్పై తహ్లియా మెక్గ్రాత్ లాంటి బ్యాటర్నే ఇన్స్వింగ్తో బుట్టులో వేసుకొంది. ఇక బార్బడోస్పై ప్రతి బంతిని స్వింగ్ చేస్తూ పవర్ప్లే బ్యాటర్లకు సవాల్ విసిరింది. దీంతో సోషల్ మీడియాలో భువనేశ్వర్తో పోలుస్తూ అభిమానులు స్వింగ్ క్వీన్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
బెస్ట్ ఫీమేల్ క్రికెటర్!
ఐసీసీ జులై నెలకు నామినేట్ చేసిన బెస్ట్ ఉమెన్ క్రికెటర్ రేసులో రేణూ ఉంది. ఇంగ్లాండ్ బ్యాటర్ ఎమ్మా లాంబ్ (234 పరుగులు), నటలియా స్కావర్ (219 రన్స్, 5 వికెట్లు)తో రేణూ (12 వికెట్లు) పోటీపడుతోంది. రేణుకా సెమీస్లో మళ్లీ విజృంభించి భారత్కు పతకం ఖాయం చేస్తుందేమో చూడాలి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు