వచ్చే పదేళ్లు క్రికెట్ ప్రపంచాన్ని ఎంటర్టైన్ చేసేది వీరిద్దరే..!: డేల్ స్టెయిన్
ట్రిస్టన్ స్టబ్స్..డెవాల్డ్ బ్రెవిస్...ఇటీవల ముగిసిన భారత టీ20లీగ్లో ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యువ బ్యాటర్లు.
ఇంటర్నెట్ డెస్క్: ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్.. ఇటీవల ముగిసిన భారత టీ20లీగ్లో ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యువ బ్యాటర్లు వీరు. బ్రెవిస్ తన మెరుపు ఇన్నింగ్స్లతో క్రికెట్ ప్రేమికులను అలరించాడు. ట్రిస్టన్ స్టబ్స్ మాత్రం ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విఫలం అయ్యాడు. దీంతో ఈ కుర్రాడికి ప్రత్యేక గుర్తింపు రాలేదు. 21 ఏళ్ల స్టబ్స్ ఇటీవల భారత్తో దిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20ల్లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అయితే బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవడంతో స్టబ్స్ తన టాలెంట్ నిరూపించుకోవడానికి ఎదురుచూస్తూ.. వస్తున్నాడు. ఎట్టకేలకు ఇంగ్లాండ్తో బుధవారం జరిగిన టీ20 మ్యాచ్లో తన ఆట ఎలా ఉంటుందో క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు. కేవలం 28 బంతుల్లోనే 8 సిక్సర్లు, 2 ఫోర్లతో 72 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 86 పరుగులే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన స్టబ్స్.. ఆరంభం నుంచి బౌండరీలు బాదుతూ ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే 19 బంతుల్లేనే తన తొలి అర్ధశతకాన్ని నమోదు చేశాడు.
మరోవైపు సీనియర్ల బ్యాటర్ మిల్లర్ ఔట్ అయినా స్టబ్స్ దూకుడు తగ్గలేదు. వచ్చిన బంతిని వచ్చినట్టుగా స్టాండ్స్లోకి పంపిస్తూ ఇంగ్లిష్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ఒక దశలో తన జట్టును గెలిపించేలా కనిపించాడు. అయితే సహచర బ్యాటర్లు నుంచి సహకారం అందకపోవడంతో స్టబ్స్ ఒంటరి పోరాటం 19 ఓవర్లో ముగిసింది. దీంతో ఇంగ్లాండ్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఉన్నంత సేపూ అభిమానులను ఎంటర్టైన్ చేసిన స్టబ్స్ 257.14 స్ట్రెక్రేట్తో 72 పరుగులు చేయడం విశేషం. ఈ ఇన్నింగ్స్కు ఫిదా అయినా దక్షిణాఫ్రికా మాజీ స్పీడ్ స్టార్ డేల్ స్టెయిన్ కీలక దక్షిణాఫ్రికా యువ క్రికెటర్లు బ్రెవిస్, స్టబ్స్ను ఉద్దేశించి ట్విటర్లో ‘రాబోయే పదేళ్లు, ఆ తర్వాత కూడా క్రికెట్ ప్రపంచానికి ఈ ఇద్దరు వినోదాన్ని అందిస్తారు’ అని ట్వీట్ చేశాడు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ కూడా స్టబ్స్ని అభినందించాడు. స్టబ్స్ అర్ధశతకం చేసిన తర్వాత ముంబయి అభిమానులు సోషల్ మీడియాలో వచ్చే ఏడాది భారత టీ20 లీగ్లో విధ్వంసమే అని ట్వీట్లు చేశారు.
ఇప్పటికే బేబీ ఏబీగా పేరుపొందిన 19 ఏళ్ల బ్రెవిస్ అండర్-19 ప్రపంచకప్లో పరుగుల వరద పారించడంతో ముంబయి జట్టు మెగా వేలంలో రూ.3 కోట్లు పెట్టి మరీ అతడ్ని దక్కించుకొంది. ఇక ఇంగ్లాండ్ పేసర్ టైమల్ మిల్స్ గాయపడటంతో అతడి స్థానంలో స్టబ్స్ను ముంబయి తమ జట్టులోకి తీసుకొంది. స్టబ్స్ దిల్లీతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో డకౌట్ కాగా.. చెన్నైతో 2 పరుగులు మాత్రమే చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది అట్టగడున నిలవడంతో నిరాశపడిన ముంబయి అభిమానులు.. వచ్చే సీజన్లో స్టబ్స్, బ్రెవిస్, టిమ్ డేవిడ్ వంటి యువ బ్యాటర్లు రాణిస్తే మరోసారి తమ జట్టు టైటిల్ నెగ్గుతుందని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్