warner: నా కుటుంబాన్ని బలి చేయలేను.. నిషేధంపై సమీక్షను విరమించుకుంటున్నా: వార్నర్
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై డేవిడ్(David warner) వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కాన్బెరా: కెప్టెన్సీ చేపట్టకుండా ఆస్ట్రేలియా(Australia) ఓపెనర్ డేవిడ్ వార్నర్(David warner)పై జీవితకాల నిషేధం(Ban) ఉన్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై సమీక్ష కోరుతూ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నాడు. తాజాగా తన దరఖాస్తును విరమించుకుంటున్నట్టుగా వార్నర్ బుధవారం ప్రకటించాడు. ఈ సందర్భంగా బోర్డు స్వతంత్ర ప్యానెల్, కౌన్సిల్ సహాయక సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘‘నాకు క్రికెట్ కన్నా నా కుటుంబమే ముఖ్యం. కేప్టౌన్లో మూడో టెస్టు సంఘటన తర్వాత దాదాపు ఐదేళ్లుగా ఎన్నో అవమానాలను నాతో పాటు నా కుటుంబం ఎదర్కోవలసి వచ్చింది. నాపై నిషేధం ఉన్నప్పటికీ ఆరోజు నుంచి నన్ను నేను ఆట పరంగా సంస్కరించుకోవడానికి కృషి చేశాను. క్రికెట్కు నా సేవలు అందించాను. అయినా, నేను అనుభవిస్తున్న శిక్ష నుండి ఇప్పటికీ విముక్తి పొందలేకపోతున్నాను. గత నవంబర్లో ఆస్ట్రేలియా క్రికెట్ ప్రవర్తనా నియమావళిని సవరించింది. అది నాలో కొత్త ఆశలను రేకెత్తించింది. నాపై ఉన్న నిషేధంపై సమీక్షను కోరేందుకు ఒక అవకాశం లభించిందని అనుకున్నాను. కానీ, ఇటీవల ఈ విషయంలో కౌన్సిల్ న్యాయవాది నాపైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. 2018 న్యూజిలాండ్ పర్యటన సమయంలో అసలేం జరిగిందనే విషయంపై వారు బహిరంగ ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ప్యానెల్ మాటల్లో చెప్పాలంటే వారు క్రికెట్ను ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. ఆ సంఘటనపై పబ్లిక్ ట్రయల్ నిర్వహించాలని ప్యానెల్ నిర్ణయించింది. అయితే దీని వల్ల నా కుటుంబం సభ్యులు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆ చెత్త ఎపిసోడ్ను క్లీన్ చేసేందుకు వాషింగ్ మెషీన్లా నేను సిద్ధంగా లేను’’ అని వార్నర్ సుదీర్ఘ పోస్ట్ను షేర్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?