David Warner: డేవిడ్ వార్నర్.. ఇది కదా స్వీట్ రివెంజ్..!
ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం కొందరికే అలవాటు. అలా ఒదిగి ఉండటం కూడా అంత తేలికేం కాదు.’’ ఇప్పుడు ఈ సామెత దిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు...
హైదరాబాద్పై విధ్వంసం.. బ్యాట్తోనే సమాధానం..
‘‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం కొందరికే అలవాటు. అలా ఒదిగి ఉండటం కూడా అంత తేలికేం కాదు.’’ ఇప్పుడు ఈ సామెత దిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు సరిగ్గా సరిపోతుంది. కేవలం ఒక్క సీజన్లో విఫలమైనంత మాత్రాన ఘోర అవమానంతో బయటకు గెంటేసిన హైదరాబాద్ జట్టుకు ఇప్పుడు తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. కనీసం కారణం కూడా చెప్పకుండా వదిలేసిన జట్టుపై.. వీసమెత్తు మాట తూలకుండా తానేంటో, తన విలువేంటో ఆటతోనే తేల్చి చెప్పాడు. దీంతో ఈ దిల్లీ ఓపెనర్ హైదరబాద్ జట్టుపై స్వీట్ రివెంజ్ తీసుకున్నాడు.
దిల్లీతో మొదలెట్టి.. హైదరాబాద్తో పేరు సంపాదించి..
డేవిడ్ వార్నర్ భారత టీ20 లీగ్లో చెరగని ముద్రవేశాడు. 2009లో దిల్లీ జట్టుతోనే ఈ టోర్నీలో ప్రయాణం మొదలెట్టాడు. 2013 వరకూ ఐదేళ్లు ఇక్కడే ఆడినా అప్పుడప్పుడు మెరుపులు మెరిపించించడమే తప్ప పెద్దగా పేరు సంపాదించలేదు. కానీ, 2014లో హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించడం మొదలుపెట్టాక అతడి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఒకవైపు సారథిగా జట్టును ముందుండి నడిపిస్తూనే మరోవైపు బ్యాట్స్మన్గా పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలోనే 2016లో అప్పటి బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ (973)తో పోటీపడి మరీ పరుగులు సాధించాడు. ఆ సీజన్లో వార్నర్ తొమ్మిది అర్ధశతకాలతో మొత్తం (848) పరుగులు దంచికొట్టాడు. మరోవైపు బెంగళూరుతోనే తలపడిన ఫైనల్లోనూ ధనాధన్ బ్యాటింగ్తో హైదరాబాద్కు కప్పు అందించాడు. దీంతో ఆ జట్టును వరుసగా ఐదేళ్లు ప్లేఆఫ్స్ వరకూ తీసుకెళ్లి ఘన చరిత్ర సృష్టించాడు.
కోహ్లీ, రోహిత్ కన్నా మేటి..
ఇక ఈ టీ20 టోర్నీలో బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ (6,499), పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్ (6,153), ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ (5,766) అత్యధిక పరుగుల వీరులుగా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వారి తర్వాత వార్నర్ (5,762) పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు. అయినా, సగటు, స్ట్రైక్రేట్, అర్ధశతకాల సంఖ్యల పరంగా చూస్తే వార్నరే మేటిగా ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ (36.51), ధావన్ (35.36), రోహిత్ (30.51) సగటుతో కొనసాగుతుండగా.. వార్నర్ (42.06) ముగ్గురికన్నా గొప్పగా రాణిస్తున్నాడు. అలాగే స్రైక్రేట్లోనూ వార్నర్ (140.71).. కోహ్లీ (129.26), ధావన్ (126.53), రోహిత్ (130.19)ల కన్నా అద్భుతంగా దూసుకుపోతున్నాడు. ఇక శతకాలు, అర్ధ శతకాలతో పోల్చి చూసినా వార్నర్ 4 శతకాలు, 53 అర్ధశతకాలతో ముందున్నాడు. విరాట్ 5 శతకాలు, 43 అర్ధశతకాలతో ఉండగా, ధావన్ 2 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు, రోహిత్ 1 శతకం, 40 అర్ధశతకాలతో ఉన్నారు. ఇలా ఏ విధంగా చూసినా వార్నర్ అద్భుతంగా రాణిస్తున్నాడు.
ఈ సీజన్లో ఎలా ఆడుతున్నాడంటే..
వార్నర్ ఎప్పటిలాగే ఈ సీజన్లోనూ అదరగొడుతున్నాడు. గతేడాది హైదరాబాద్ తరఫున ఆడిన 8 మ్యాచ్ల్లో రెండు అర్ధశతకాలతో 195 పరుగులే చేసిన అతడు ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో నాలుగు అర్ధశతకాలతో 356 పరుగులు చేశాడు. దీంతో ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో దూసుకుపోతున్నాడు. అయితే, ఇక్కడ టాప్-10 బ్యాట్స్మెన్ అందరూ 9, 10 మ్యాచ్లు ఆడగా.. వార్నర్ 8 మ్యాచ్ల్లోనే టాప్లో ఒకడిగా నిలిచాడు. దీన్నిబట్టి అతడెలా రాణిస్తున్నాడో, అతడిని వదిలేసుకొని హైదరాబాద్ ఎంత పెద్ద తప్పు చేసిందో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా గతరాత్రి ఆ జట్టుపైనే చెలరేగడం విశేషం. ఓపెనర్గా వచ్చిన వార్నర్ (92 నాటౌట్; 58 బంతుల్లో 13x4, 3x6) విధ్వంసం సృష్టించి ఈ సీజన్లో తన అత్యధిక స్కోర్ నమోదు చేయడమే కాకుండా హైదరాబాద్కు మ్యాచ్ దూరం చేయడంలోనూ అతడిదే కీలక పాత్ర. దీంతో దిల్లీ ఈ సీజన్లో ఐదో విజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. వార్నర్ మున్ముందు ఇలాగే ఆడితే ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసులోనూ దూసుకుపోయే అవకాశం ఉంది.
ఇందుకే వార్నర్ గ్రేట్ అనేది..
ఇక గతరాత్రి మ్యాచ్ గెలిచి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాక వార్నర్ మాట్లాడాడు. హైదరాబాద్పై ఇలా చెలరేగడానికి తనకేం అదనపు స్ఫూర్తి అవసరం లేదన్నాడు. దీన్నిబట్టి వార్నర్ ఎంత సహృదయుడో అర్థం చేసుకోవచ్చు. గతేడాది సీజన్ మధ్యలో హైదరాబాద్ తుది జట్టులో నుంచి తొలగించినా, తర్వాత కెప్టెన్సీ నుంచి పక్కనపెట్టినా.. వార్నర్ చాలా హూందాగా ప్రవర్తించాడు. సామాజిక మాధ్యమాల్లో ఆ జట్టుపై ఎన్ని విమర్శలొచ్చినా వార్నర్ ఒక్క మాట కూడా తూలలేదు. మనసులో ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుతూనే కనిపించాడు. ముఖ్యంగా కొన్ని మ్యాచ్లకు గ్యాలరీలో నిల్చొని మరీ జట్టును ఉత్సాహపర్చాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే ఇదేనేమో! అందుకే ఈ మ్యాచ్లో హైదరాబాద్పై అత్యధిక స్కోర్ సాధించినా చాలా నిష్కల్మషంగా కనిపించాడు. తన ఆటకు కట్టుబడి ఉంటే పరుగులు వాటంతట అవే వస్తాయనే ప్రాథమిక సూత్రాన్నే నమ్ముకొన్నాడు. ఎంతైనా తనని దూరం చేసుకున్న జట్టుపై ఈ బ్యాటింగ్ దిగ్గజం స్వీట్ రివెంజ్ తీర్చుకొన్నాడు.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు