IND vs AUS: ‘డెత్’ భయం పోవాలి.. సిరీస్ రేస్లో నిలవాలి!
టీ20 ప్రపంచకప్నకు ముందు ఎలాంటి ఫలితం రాకూడదని క్రికెట్ అభిమానులు భావించారో... అలాంటిదే టీమ్ఇండియాకు ఎదురైంది. ఆసీస్తో స్వదేశంలో...
రేపే ఆసీస్-భారత్ మధ్య కీలకమైన రెండో టీ20
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్నకు ముందు ఎలాంటి ఫలితం రాకూడదని క్రికెట్ అభిమానులు భావించారో... అలాంటిదే టీమ్ఇండియాకు ఎదురైంది. ఆసీస్తో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్లో ఆధిపత్యం ప్రదర్శించి ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవాల్సిన భారత్ జట్టు.. పేలవమైన బౌలింగ్ ప్రదర్శనతో భారీ స్కోరు సాధించినా ఆసీస్ చేతిలో చిత్తవ్వక తప్పలేదు. ఆసియా కప్ నుంచి కొనసాగుతున్న ‘డెత్’ ఓవర్ల ఆందోళనను అధిగమించాలి. అయితే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం పెద్ద లోటుగా భావిస్తున్న క్రమంలో రెండో మ్యాచ్కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆసీస్ 1-0 ఆధిక్యం సాధించిన మూడు టీ20ల సిరీస్ రేసులో నిలవాలంటే శుక్రవారం జరిగే మ్యాచ్లో టీమ్ఇండియా గెలిచి తీరాల్సిందే.
డెత్ ఓవర్లు పెద్ద మైనస్..
తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 208 పరుగులు చేసినా.. ఓటమి తప్పలేదంటే బౌలింగ్ ప్రదర్శన ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆసీస్తో జరిగిన తొలి టీ20లోనూ భారత పరిస్థితి ఇదే. బ్యాటర్లు కష్టపడి సాధించిన దానికి ప్రతిఫలం దక్కకుండా చేశారు. మరీ ముఖ్యంగా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్తోపాటు భారీ అంచనాలు పెట్టుకొన్న హర్షల్ పటేల్ ఘోరంగా విఫలమయ్యారు. వీరిద్దరూ కలిసి తమ ఎనిమిది ఓవర్లలో 101 పరుగులను సమర్పించారు. అక్షర్ పటేల్ మినహా మిగతా బౌలర్లు ఉమేశ్ యాదవ్, చాహల్, హార్దిక్ పెద్దగా రాణించలేదు. ఉమేశ్ రెండు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీసినా.. 27 పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలో కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రెండో మ్యాచ్లో బరిలో దిగితే పేస్ దళం కాస్త బలోపేతమవుతుంది. మిడిల్, డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా ఒకరు బౌలింగ్ చేసినా ప్రయోజనం భారీగా ఉంటుంది. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చేందుకు బుమ్రా సిద్ధంగా ఉన్నాడని టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
ఫీల్డింగూ మారాలి..
ప్రపంచకప్లో ప్రతి విభాగం రాణిస్తేనే కప్ సాధించే అవకాశం దక్కుతుంది. బ్యాటింగ్, బౌలింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ ఫీల్డింగ్లో క్యాచ్లు, అనవసర పరుగులు ఇచ్చేస్తే ఫలితం శూన్యం. ఆసీస్తో తొలి టీ20లోనూ ఇలానే మూడు క్యాచ్లను టీమ్ఇండియా ఫీల్డర్లు వదిలేశారు. అందులోనూ కీలక ఇన్నింగ్స్లను ఆడిన కామెరూన్ గ్రీన్ (61), స్టీవ్ స్మిత్ (35), మ్యాథ్యూ వేడ్ (45*) క్యాచ్లను నేలపాలు చేశారు. అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హర్షల్ చేతిలో పడిన క్యాచ్లను వదిలేశారు. మ్యాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్ను హర్షల్ వదిలేయడంతో వరుసగా రెండు సిక్స్లు బాదాడు. అదీనూ హర్షల్ బౌలింగ్లోనే కావడం విశేషం. అంతకుముందు బంతికే సిక్స్ కొట్టిన వేడ్ కీలకమైన 18వ ఓవర్లో మొత్తం 22 పరుగులను రాబట్టి.. విజయాన్ని తమ వైపు తిప్పుకొన్నాడు. అందుకే ప్రతి పరుగు, ప్రతి మ్యాచ్ చాలా కీలకం.. అలాగే డీఆర్ఎస్ను తీసుకోవడంలోనూ సీనియర్ కీపర్ దినేశ్ కార్తిక్ వెనకడుగు వేయడం సరైంది కాదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఓవరాల్గా బ్యాటింగ్ ఓకే.. కానీ
ఆసీస్తో తొలి టీ20లో భారత్ భారీ స్కోరే సాధించింది. జట్టు పరంగా ప్రదర్శన ఓకే కానీ.. వ్యక్తిగతంగా అయితే కెప్టెన్ రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (2), దినేశ్ కార్తిక్ (6) అక్షర్ పటేల్ (6) నిరాశపరిచారు. మరీ ముఖ్యంగా దినేశ్ కార్తిక్ హార్డ్హిట్టర్ పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. చివర్లో 16వ ఓవర్ తర్వాత క్రీజ్లోకి వచ్చిన కార్తిక్.. దూకుడుగా ఆడలేకపోయాడు. కేవలం ఐదు బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసి వికెట్ల ముందు దొరికిపోయాడు. రెండో మ్యాచ్లోనైనా అవకాశం వస్తే సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే సంజూ శాంసన్ను తీసుకోకుండా కార్తిక్, పంత్ను తీసుకోవడంపై విమర్శలు ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. రోహిత్ కూడా కాస్త సంయమనం పాటించి క్రీజ్లో నిలదొక్కుకొని బ్యాటింగ్ చేయాలని పలువురు మాజీలు సూచించారు. విరాట్ కోహ్లీ తన ఫామ్ను కొనసాగించాల్సిన అవసరం ఉంది. పాండ్య, సూర్యకుమార్, కేఎల్ రాహుల్ రాణించడం సానుకూలాంశం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు