GT vs CSK: 19వ ఓవర్ ఫోబియా.. మళ్లీ పునరావృతమవుతోందా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ సీజన్ తొలి మ్యాచ్ను చూశాక అభిమానుల్లో మెదిలే తొలి ప్రశ్న ఒకటే.. అంతర్జాతీయ మ్యాచుల్లో భారత బౌలర్లను ఆందోళనకు గురి చేసిన ఆ ఫోబియా మరోసారి వచ్చేసిందా..? ఎందుకంటే కీలక సమయంలో పరుగులు ఇవ్వడంతో అనుమానం రావడం సహజమే కదా.. ఇంతకీ ఏంటంటే..?
ఇంటర్నెట్ డెస్క్: 11 ఓవర్లకు 106/2... ఇదీ ఐపీఎల్ 16వ సీజన్లో (IPL 2023) చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ (GT vs CSK) స్కోరు. లక్ష్యం 179 పరుగులే కావడంతో 9 ఓవర్లలో 73 పరుగులంటే పెద్ద ఇబ్బందేం కాదు. అయితే చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో గుజరాత్ లక్ష్యం 18 బంతుల్లో 30 పరుగులకు చేరింది. 18వ ఓవర్ వేసిన యువ బౌలర్ హంగార్గేకర్ కేవలం 7 పరుగులే ఇచ్చి వికెట్ తీశాడు. దీంతో విజయ సమీకరణం 12 బంతుల్లో 23కి చేరింది. అనుభవజ్ఞుడైన దీపక్ చాహర్ కీలకమైన 19వ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఆ సమయంలో క్రీజ్లో రషీద్ ఖాన్, రాహుల్ తెవాతియా ఉన్నారు.
🏏 తొలి బంతిని అద్భుతంగా వేసిన దీపక్ పరుగులేమీ ఇవ్వలేదు.
🏏 అయితే రెండో బంతి లెగ్సైడ్ వేయడంతో తెవాతియా ప్యాడ్లను తాకి లెగ్బైస్ రూపంలో బౌండరీకి వెళ్లిపోయింది.
🏏 మూడో బంతికి సింగిల్ మాత్రమే ఇచ్చాడు. దీంతో రషీద్ ఖాన్ స్ట్రైకింగ్కు వచ్చాడు. హమ్మయ్య... మ్యాచ్పై చెన్నై పట్టు సాధించేలా ఉందని అంతా అనుకున్నారు.
🏏 తీరా ఈ మ్యాచ్లో ఎదుర్కొన్న మొదటి బాల్నే రషీద్ ఖాన్ సిక్స్గా మలిచాడు. చెన్నై అభిమానుల్లో నిరాశ మొదలైంది.
🏏 ఐదో బంతిని కూడా రషీద్ బౌండరీ బాదేశాడు. దీంతో మ్యాచ్పై ఆశలు కరిగిపోయాయి. అయితే చివరి బంతికి పరుగులేమీ రాలేదు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
దీంతో కీలకమైన 19వ ఓవర్లో ఏకంగా 15 పరుగులు వచ్చేయడంతో విజయానికి ఇంకా 6 బంతుల్లో కేవలం 8 రన్స్ మాత్రమే గుజరాత్కు అవసరం. దీంతో చెన్నైపై ఒత్తిడి పెరిగిపోయింది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన తుషార్ దేశ్ పాండే బౌలింగ్లో తెవాతియా సిక్స్, ఫోర్ బాదేసి గుజరాత్ను గెలిపించాడు. ఈ క్రమంలో ఐపీఎల్లోనూ బౌలర్లను 19వ ఓవర్ ఫోబియా వెంటాడుతుందా..? అనే అనుమానాలు అభిమానుల్లో మెదిలాయి. అంతర్జాతీయ క్రికెట్లోనూ భారత బౌలర్లు ఇలా 19వ ఓవర్లో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇదే కొనసాగితే మాత్రం భారీ స్కోరు సాధించినా సరే జట్టును గెలిపించడంలో విఫలం కావడం ఖాయం. చెన్నై బ్యాటింగ్ చేసినప్పుడు 19వ ఓవర్ వేసిన షమీ 10 పరుగులు ఇచ్చినప్పటికీ.. కీలకమైన శివమ్ దూబే వికెట్ తీశాడు. అయితే, లక్ష్య ఛేదన సమయంలో కీలకమైన 19వ ఓవర్లో భారీగా పరుగులు ఇవ్వడం సరైంది కాదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీపక్ చాహర్ వంటి సీనియర్ బౌలర్ మరింత బాధ్యతగా బౌలింగ్ చేయాల్సిన అవశ్యకత ఉంది. ఈ ఓవర్కు ముందు దీపక్ చాహర్ వేసిన 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు ఇచ్చాడు. వికెట్ తీయకపోయినా కట్టుదిట్టంగానే బౌలింగ్ వేశాడు. కానీ, ఆ 19వ ఓవర్లో 15 పరుగులు ఇవ్వడంతో అప్పటివరకు చేసిన ప్రదర్శన వెనుకబడిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు