Deepak Chahar: ఆయన్ను సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లగలిగాం: దీపక్ చాహర్
వైద్యపరమైన అత్యవసర పరిస్థితి కారణాలతో దీపక్ చాహర్ (Deepak Chahar) ఆసీస్తో ఐదో టీ20లో ఆడలేదు. దీంతో అభిమానులంతా ఏమైందోనని కంగారు పడ్డారు. దానికి దీపక్ చాహర్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి భారత ఆటగాడు దీపక్ చాహర్ (Deepak Chahar) పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. ఆసీస్తో టీ20 సిరీస్లోకి వచ్చాడు. మూడు, నాలుగో మ్యాచ్లను ఆడాడు. అనూహ్యంగా ఐదో టీ20కి దూరమయ్యాడు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ మ్యాచ్కు ముందు చెప్పాడు. తన తండ్రిని ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చిందని తాజాగా దీపక్ చాహర్ వెల్లడించాడు. పదో తేదీ నుంచి దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్ఇండియా వెళ్లనుంది. తొలుత టీ20 సిరీస్ను ఆడనుంది. దీపక్ చాహర్ కూడా ఈ సిరీస్కు ఎంపికయ్యాడు. అయితే, భారత జట్టుతో కలిసి వెళ్లే స్థితిలో దీపక్ చాహర్ లేడు. ప్రస్తుతం ఆసుపత్రిలో తండ్రి వద్ద దీపక్ చాహర్ ఉన్నాడు.
‘‘మేం సరైన సమయానికి మా నాన్నను ఆసుపత్రికి తీసుకెళ్లాం. లేకపోతే పరిస్థితి ప్రమాదకరంగా మారేది. ప్రస్తుతం ఆయన పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. చాలా మంది అభిమానులు ఆసీస్తో ఐదో టీ20 ఎందుకు ఆడకుండా మధ్యలోనే వెళ్లిపోయావు? అని అడిగారు. కారణం ఇదే. మా నాన్న ఆరోగ్యం చాలా ముఖ్యం. నన్ను ప్లేయర్ను చేయడానికి ఆయన ఎంతో శ్రమ పడ్డారు. అలాంటి తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే మైదానంలో మనసు పెట్టి ఆడలేను. అందుకే, వెంటనే ఇక్కడికి వచ్చేశా. ఆయన్ను వదిలి ఎక్కడికీ వెళ్లలేను. ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడిన తర్వాత దక్షిణాఫ్రికా వెళ్లేందుకు ప్రయాణమవుతా. ఇప్పటికే కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్టర్లతో మాట్లాడా’’ అని దీపక్ చాహర్ తెలిపాడు.
డిసెంబర్ 10 నుంచి జనవరి 7వ తేదీ వరకు దక్షిణాఫ్రికాలో భారత్(SA vs IND) పర్యటించనుంది. తొలుత మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఆ తర్వాత వన్డే, టెస్టు సిరీస్లు ఉంటాయి. టీ20 సిరీస్కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. వన్డేలకు కేఎల్ రాహుల్, టెస్టు సిరీస్కు రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపడతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి